Breaking News

సాయి పేరెంటరల్స్‌ ఐపీవో నేడు

Published on Tue, 03/24/2026 - 04:04

హైదరాబాద్‌: ఫార్మాస్యూటికల్‌ రంగ కంపెనీ సాయి పేరెంటరల్స్‌ పబ్లిక్‌ ఇష్యూ నేడు(24న) ప్రారభమై శుక్రవారం(27న) ముగియనుంది. ఇష్యూకి ధరల శ్రేణి రూ. 372-392కాగా.. తద్వారా రూ. 409 కోట్లవరకూ సమీకరించనుంది. ఇష్యూలో భాగంగా యాంకర్‌ ఇన్వెస్టర్లకు తాజాగా షేర్లను కేటాయించింది. ఒక్కో షేరుకీ రూ. 392 ధరలో 31,28,485 షేర్లు విక్రయించింది. తద్వారా దాదాపు రూ. 123 కోట్లు సమీకరించింది. యాంకర్‌ ఇన్వెస్టర్లలో కొటక్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఫండ్‌, క్వాంట్‌ ఎంఎఫ్‌, మోర్గాన్‌ స్టాన్లీ ఏషియా(సింగపూర్‌) పీటీఈ, ఇండియా ఎమర్జింగ్‌ జెయింట్స్‌ ఫండ్‌ ఉన్నాయి. 

దేశీ మ్యూచువల్‌ ఫండ్స్‌సహా.. బీమా కంపెనీలు, తదితర విభిన్న సంస్థాగత ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలు యాంకర్‌ పెట్టుబడుల జాబితాలో చేరినట్లు కంపెనీ వెల్లడించింది. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 38 షేర్లకు(ఒక లాట్‌) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఏప్రిల్‌ 2కల్లా బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్‌కానుంది. యాంకర్‌ పెట్టుబడులు.. కంపెనీ బిజినెస్‌ మోడల్‌, వృద్ధి అవకాశాలు, నిర్వహణా సామర్థ్యాలపట్ల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నట్లు సాయి పేరెంటరల్స్‌ ఎండీ అనిల్‌ కుమార్‌ కె. పేర్కొన్నారు. 

కంపెనీ ప్రధానంగా ఇంజెక్టబుల్‌ ప్రొడక్టులను తయారు చేస్తోంది. బ్రాండెడ్‌ జనరిక్స్‌తోపాటు.. కాంట్రాక్ట్‌ డెవలప్‌మెంట్‌, తయారీ(సీడీఎంవో) సర్వీసులు సైతం అందిస్తోంది. కార్డియోవాస్కులర్‌, యాంటీబయోటిక్స్‌, డయాబెటిస్‌ తదితర వివిధ థెరప్యూటిక్‌ విభాగాలలో ఇంజెక్టబుల్స్‌, ట్యాబ్లెట్లు, క్యాప్సూల్స్‌ తదితర డోసేజీలు రూపొందిస్తోంది.

ఇదీ చదవండి: భౌగోళిక రాజకీయ చదరంగంలో అనివార్య శక్తిగా భారత్

Videos

ట్రంప్ ప్రకటనకు ముందు భారీ డీల్ 580 బిలియన్ డాలర్ల ట్రేడింగ్

ప్రభాస్ సీక్వెల్ సినిమాలపై ధురంధర్ ఎఫెక్ట్

పసిడి ప్రేమికులకు పండగ.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..!

మొదలైన పెట్రోల్.. డీజిల్ కష్టాలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు..

భారత్‌లో గ్యాస్, పెట్రోల్ సంక్షోభం..! మోదీ క్లారిటీ..

కూటమిలో కామ పిశాచులు

ఇరాన్ సంచలన నిర్ణయం.. ప్రపంచ దేశాల్లో భారీగా పెరగనున్న పెట్రోల్ ధరలు?!

అనకాపల్లి స్టీల్ ప్లాంట్ రావడానికి కారణం జగనే

ఇరాన్ కు రష్యా సాయం? ఆధారాలు ఉన్నాయన్న జెలెన్ స్కీ

కల్తీ పాల నిందితులను కఠినంగా శిక్షించాలి

Photos

+5

రష్మిక-విజయ్ దేవరకొండ వెడ్డింగ్..ఈ అరుదైన ఫోటోలు చూశారా? (ఫోటోలు)

+5

ట్రంప్ ప్రకటనకు ముందు భారీ డీల్ 580 బిలియన్ డాలర్ల ట్రేడింగ్

+5

విశాఖపట్నంలో సినీ నటి శ్రుతి హాసన్‌ సందడి (ఫొటోలు)

+5

శ్రీరామనవమి స్పెషల్ : ఏపీలో ఉన్న ఈ అద్భుతమైన ఆలయం గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ధురంధర్‌ 2కి బ్లాక్‌బస్టర్‌ టాక్‌.. ట్రెండింగ్‌లో హీరోయిన్‌ సారా (ఫోటోలు)

+5

ఘనంగా 'బ్యాండ్‌ మేళం' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ లో కొత్తగా నిర్మించిన అద్భుత ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

విజయవాడ : సమ్మోహనం.. ఆంధ్ర నాట్యం (ఫొటోలు)

+5

శర్వానంద్ 'బైకర్' సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

పెళ్లి వేడుకలో అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి (ఫోటోలు)