Breaking News

రీఛార్జ్‌ ముగిస్తే ఇన్‌కమింగ్‌ కాల్స్‌ ఎందుకు ఆపేస్తారు?

Published on Wed, 03/11/2026 - 11:44

రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఎంపీ రాఘవ్ చద్దా ఇటీవల లేవనెత్తిన అంశాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్న పన్నులు, విమానాశ్రయాల్లో ఆహార ధరలు, ప్రజాప్రతినిధుల జవాబుదారీతనంపై ఆయన సంధించిన ప్రశ్నలు ఆలోచింపజేశాయి. ఈ నేపథ్యంలో ఆయన అడిగిన ప్రశ్నలు, వాటికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలు ఎలా ఉన్నాయో కింద తెలియజేస్తున్నాం.

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా కేంద్రాన్ని సూటిగా ప్రశ్నిస్తూ వార్తల్లో నిలిచారు. ఒక చార్టర్డ్ అకౌంటెంట్‌గా తనకున్న ఆర్థిక అవగాహనతో బడ్జెట్ లోపాలను ఎత్తిచూపడమే కాకుండా, రోజువారీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారికంగా కేంద్రం నుంచి సమాధానాలు రాబట్టారు.

పన్నుల భారంతో మధ్యతరగతి విలవిల

బడ్జెట్ 2026-27పై జరిగిన చర్చలో రాఘవ్ చద్దా కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ‘రికార్డు స్థాయిలో పన్ను వసూళ్లు జరుగుతున్నా, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం ఎందుకు లేదు? జీతాలు పెరగకపోయినా ద్రవ్యోల్బణం (సుమారు 6.8%) కారణంగా కొనుగోలు శక్తి పడిపోతోంది. కనీసం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎల్‌టీసీజీ) పన్నును ఎత్తివేయాలి’ అని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ స్పందన: ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. దేశ మౌలిక సదుపాయాల కల్పన (క్యాపెక్స్‌) కోసం నిధుల సేకరణ అవసరమని, పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజా సంక్షేమ పథకాలకు మళ్లిస్తున్నామని పేర్కొంది. అయితే నేరుగా ఆదాయపు పన్ను తగ్గింపుపై స్పష్టమైన హామీ ఇవ్వలేదు.

రైట్ టు రీకాల్.. ఓటర్లకే ఆ అధికారం ఇవ్వాలి!

ఇటీవల రాఘవ్‌ చద్దా రాజ్యసభలో లేవనెత్తిన ‘రైట్ టు రీకాల్’ (ఎన్నికైన ప్రతినిధులు పనితీరు నచ్చకపోతే అధికారం తొలగించే హక్కు) అంశం సభ్యుల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది. ‘ఎన్నికైన ప్రతినిధుల ఐదేళ్ల కాలపరిమితి ముగిసే వరకు వేచి చూడకుండా, పనితీరు సరిగ్గా లేని అభ్యర్థులను ఓటర్లే తొలగించేలా చట్టం తీసుకురావాలి’ అని చద్దా కోరారు. ప్రపంచవ్యాప్తంగా 24 దేశాల్లో ఈ విధానం ఉందని గుర్తుచేశారు.

ప్రభుత్వ స్పందన: ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం ఆచితూచి స్పందించింది. ప్రస్తుతం ఉన్న రాజ్యాంగ విధివిధానాల ప్రకారం దేశంలో ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అమలులో ఉందని తెలిపింది. ఇటువంటి మార్పులు రాజకీయ అస్థిరతకు దారితీసే అవకాశం ఉందని ప్రాథమికంగా అభిప్రాయపడింది.

విమానాశ్రయాల్లో ఆహార ధరలు..

విమానాశ్రయాల్లో కనీస ఆహార ధరలు ఆకాశాన్నంటుతున్నాయని సభలో తెలిపారు. సాధారణంగా లీటర్‌ వాటర్‌ బాటిల్‌ రూ.20 ఉంటే..  ఎయిర్‌పోర్ట్‌ల్లో మాత్రం ఇది సుమారు రూ.100గా ఉంటుంది. ఇదే కాకుండా వివిధ ఆహార పదార్థాల ధరలు ఎయిర్‌పోర్ట్‌ల్లో అధిక ధరలుంటాయి. ఈ నేపథ్యంలో ‘విమానాశ్రయాల్లో సామాన్య ప్రయాణికులకు తక్కువ ధరలో స్నాక్స్, పానీయాలు లభించే ఉడాన్ యాత్రి కేఫ్‌ల సంఖ్యను పెంచాలి. వాటిని సెక్యూరిటీ చెక్ దాటిన తర్వాత కూడా అందుబాటులో ఉంచాలి’ అని కోరారు.

ప్రభుత్వ స్పందన: పౌర విమానయాన శాఖ ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలిస్తామని, ప్రయాణికుల సౌకర్యార్థం విమానాశ్రయాల్లో సరసమైన ధరలకు ఆహారం అందించే అవుట్‌లెట్లను పెంచే దిశగా చర్యలు చేపడతామని తెలిపింది.

సిమ్ కార్డులు - ఇన్‌కమింగ్ కాల్స్‌..

రాఘవ్ చద్దా రాజ్యసభలో టెలికాం కంపెనీల దోపిడీని ఎండగట్టారు. ‘ప్రస్తుతం దేశంలోని టెలికాం కంపెనీలు ప్రీపెయిడ్ ప్లాన్ గడువు ముగిసిన వెంటనే అవుట్‌గోయింగ్ మాత్రమే కాకుండా, ఇన్‌కమింగ్ కాల్స్ కూడా నిలిపివేస్తున్నాయి. దీనివల్ల సామాన్యులు, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు, వలస కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. వారి వద్ద రీఛార్జ్ చేసుకునే డబ్బు లేకపోయినా తమకు వచ్చే ఫోన్ కాల్స్ కూడా అందుకోలేకపోతున్నారు. ఇది ఒక రకమైన దోపిడీ కాదా?’ అని ప్రశ్నించారు.

బ్యాంకింగ్, రేషన్, ప్రభుత్వ పథకాలు.. ఓటీపీ ద్వారా ఫోన్ నంబర్‌కే లింక్ అయి ఉన్న తరుణంలో ఇన్‌కమింగ్ ఆపేయడం వల్ల సామాన్యులు ప్రాథమిక హక్కులను కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం, ట్రాయ్ స్పందన: డేటా (ఇంటర్నెట్) అవసరం లేని వినియోగదారుల కోసం కేవలం వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌ మాత్రమే ఉండే చౌకైన ప్లాన్లను తీసుకురావాలని కంపెనీలను ఆదేశించింది. గతంలో ఉన్న 90 రోజుల పరిమితిని సడలించి వినియోగదారులు ఏకకాలంలో 365 రోజుల (ఒక ఏడాది) వరకు వాలిడిటీని పొందేలా స్పెషల్ టారిఫ్ వోచర్స్ తీసుకురావాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

రాఘవ్ చద్దా లేవనెత్తిన ప్రశ్నలు కేవలం రాజకీయ కోణం నుంచి కాకుండా సామాన్యుడి ఆర్థిక, సామాజిక ప్రయోజనాల చుట్టూ ఉండడం విశేషం. ముఖ్యంగా పన్నుల సంస్కరణలు, వర్కర్ల రక్షణపై ఆయన అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం రాతపూర్వక సమాధానాలు భవిష్యత్తు విధాన నిర్ణయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: కొనుగోలుదారులను ఆడేసుకుంటున్న బంగారం..

Videos

Watch Live: వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు

ముగ్గురిని కనాలా.. గ్యాస్ ధరలు పెంపు.. బాబు, పవన్ పై కేతిరెడ్డి ఫైర్

గ్యాస్ సంక్షోభం? తెలుగు రాష్ట్రాల్లో వరుసగా మూతపడుతున్న హోటళ్లు

పేదల గుండెచప్పుడు.. జగన్ నేతృత్వంలో పార్టీ ప్రయాణం

భారత్ వస్తున్న షిప్ పై ఇరాన్ దాడి

చంద్రబాబు మార్క్ మోసాలపై వైఎస్ జగన్ ప్రశ్నల వర్షం

దుబాయ్ ఎయిర్ పోర్ట్ పై మరోసారి ఇరాన్ డ్రోన్ దాడి

జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎంపై కాల్పులు

శ్రీవారి పరకామణి వెనుక భారీ కుట్ర.. ఆధారాలతో బయటపెట్టిన YSRCP నాగార్జున యాదవ్

ఉరుసు ఉత్సవాలకు ఆహ్వానం

Photos

+5

అడివి శేష్‌ 'డెకాయిట్‌' మూవీ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో పశ్చిమాసియా యుద్ధ ప్రభావం..మూతపడుతున్న హోటళ్లు (ఫొటోలు)

+5

హైదరాబాద్ : రాత్రిపూట చార్మినార్‌ వద్ద రంజాన్‌ సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో వేల్స్‌ మహిళల హాకీ జట్టు సందడి (ఫొటోలు)

+5

అంగరంగ వైభవంగా ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ఫోన్లు చోరీ.. మూడు కోట్ల విలువైన మొబైల్స్‌ రికవరీ (ఫొటోలు)

+5

'డాటర్ ఆఫ్ వరప్రసాద్ రావు' తెర వెనక ఇలా (ఫొటోలు)

+5

కూతురితో బిగ్‌బాస్ సోనియా హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

విజయ్-రష్మిక మెహందీ సెలబ్రేషన్ ఫొటోలు

+5

బాక్సర్‌లా మారిపోయిన టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)