కాపుతో పెట్టుకున్నారు.. వంగవీటి నరేంద్ర మాస్ వార్నింగ్
Breaking News
ఐటీ రంగంలో ఖర్చుల సెగ..
Published on Sat, 02/14/2026 - 11:30
గ్లోబల్ టెక్నాలజీ మార్కెట్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ సంస్థలు సాఫ్ట్వేర్ సేవల కంటే హార్డ్వేర్ మౌలిక సదుపాయాలకే పెద్దపీట వేస్తున్నాయి. దీనివల్ల భారతీయ ఐటీ సేవల కంపెనీలు తాత్కాలిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ స్టాక్ ధరల తగ్గింపు దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఒక అద్భుతమైన కొనుగోలు అవకాశాన్ని అందిస్తోందని క్వాంటం ఏఎంసీ ఫండ్ మేనేజర్ (ఈక్విటీస్) క్రిస్టీ మథాయ్ చెబుతున్నారు.
మారిన వ్యయాల ప్రాధాన్యత
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హవా నడుస్తోంది. దీంతో కంపెనీలు తమ బడ్జెట్ను డేటా సెంటర్లు, సెమీకండక్టర్లు, హై-ఎండ్ ప్రాసెసర్ల వైపు మళ్లిస్తున్నాయి. ఎన్విడియా వంటి హార్డ్వేర్ కంపెనీలు లాభపడుతుంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ (SaaS), సంప్రదాయ ఐటీ సర్వీస్ కంపెనీలపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ మార్పుల వల్ల లార్జ్ క్యాప్ ఐటీ స్టాక్స్ ఇటీవల భారీగా క్షీణించాయి.
సెంటిమెంట్ కంటే ఫండమెంటల్స్ బలంగా..
మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి ఉన్నప్పటికీ ఐటీ కంపెనీల ఫండమెంటల్స్ పటిష్టంగా ఉన్నాయని విశ్లేషణలు చెబుతున్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ విభాగాల నుంచి ఐటీ ఆర్డర్లు మళ్లీ పుంజుకుంటున్నాయి. కంపెనీలు ఇప్పుడు నేరుగా ఏఐ ప్రాజెక్టుల ద్వారా ఆదాయాన్ని పొందడం ప్రారంభించాయి. కీలక రంగాల్లో ఆర్డర్ బుక్స్ ఆశాజనకంగా ఉన్నాయని, ఇది భవిష్యత్తు వృద్ధికి సంకేతమని మథాయ్ అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: ప్రేమలో మునిగి తేలుతూ.. వ్యాపారం పెంచుతూ..
Tags : 1