Breaking News

ధర దడ.. 3 నెలల గరిష్టానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం

Published on Tue, 01/13/2026 - 05:09

న్యూఢిల్లీ: ఆహార పదార్థాల ధరల పెరుగుదలతో 2025 డిసెంబర్‌లో ద్రవ్యోల్బణం 1.33 శాతం పెరిగింది. మూడు నెలల గరిష్టానికి ఎగిసింది. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం గతేడాది నవంబర్‌లో 0.71 శాతంగా, 2024 డిసెంబర్‌లో 5.22 శాతంగా నమోదైంది. తాజాగా ఇది పెరిగినప్పటికీ వరుసగా నాలుగో నెలలోనూ, రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్దేశించుకున్న కనిష్ట పరిమితి రెండు శాతం లోపే ఉండటం గమనార్హం. 

వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, కూరగాయలు, మాంసం–చేపలు, గుడ్లు, మసాలా దినుసులు, పప్పులు మొదలైన వాటి ధరల పెరుగుదల కారణంగా ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం, రిటైల్‌ ద్రవ్యోల్బణం పెరిగినట్లు సీపీఐ డేటాను విడుదల చేసిన సందర్భంగా జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) తెలిపింది. గ్రామీణ ప్రాంతాలతో (0.76 శాతం) పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం అధికంగా 2.03 శాతం స్థాయిలో నమోదైంది. ద్రవ్యోల్బణం అత్యధికంగా నమోదైన టాప్‌ అయిదు పెద్ద రాష్ట్రాల్లో కేరళ (9.49 శాతం), కర్ణాటక (2.99 శాతం), ఆంధ్రప్రదేశ్‌ (2.71 శాతం) ఉన్నాయి. ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి (రెండు శాతం అటూ ఇటుగా) కట్టడి చేసే బాధ్యతను రిజర్వ్‌ బ్యాంక్‌కి కేంద్రం అప్పగించిన సంగతి తెలిసిందే.  
 

Videos

కాకినాడ జిల్లా సార్లంకపల్లె అగ్ని ప్రమాదంపై YS జగన్ దిగ్భ్రాంతి

వర్మకు పవన్ అవమానం.. రగిలిపోతున్న పిఠాపురం

YSRCP మొసలి కన్నీరు కరుస్తుందా.. అదిరిపోయే కౌంటర్ కుమార్ యాదవ్

అల్లు అర్జున్ మూవీ లైనప్..

ప్రభాస్ గురించి తెలియని నిజాలు..! సోషల్ మీడియా షేక్ అవుతుందిగా

మన శంకరవరప్రసాద్ తర్వాత, ఏ హీరోతో అనిల్ రావిపూడి చిత్రం చేస్తాడు?

బాబుకు బిగ్ షాక్ హైకోర్టుకు స్కిల్ స్కామ్ కేస్?

Garam Garam Varthalu: కలెక్షన్ కింగ్

Garam Garam Varthalu: కొడుకు మీద ప్రేమతో

KSR: రాజ్యసభ సీటు కోసం బేరసారాలా?

Photos

+5

చంద్రబాబుకు మాత్రమే తెలిసిన స్కిల్‌ ఇది (ఫొటో స్టోరీ)

+5

'నారీ నారీ నడుమ మురారి' మూవీ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

'అనగనగా ఒక రాజు' మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

అందంగా కవ్విస్తూనే యాక్షన్‌ మోడల్‌లో రాజాసాబ్‌ బ్యూటీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీనియర్‌ నటులు విజయకుమార్ (ఫోటోలు)

+5

ప్రముఖ నటుడికి సన్మానం.. హాజరైన మీనా (ఫోటోలు)

+5

ఒకే ఫ్రేమ్‌లో నమ్రత, లక్ష్మీ ప్రణతి (ఫోటోలు)

+5

పతంగులు ఎగురవేసిన ప్రధాని మోదీ, జర్మనీ ఛాన్సలర్ మెర్జ్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత మరింత కళగా సమంత (ఫోటోలు)

+5

బుల్లితెర నటులు 'ఇంద్రనీల్, మేఘన'ల గృహప్రవేశం (ఫోటోలు)