Breaking News

సువాసనలు గుర్తించేలా అంధులకు శిక్షణ

Published on Mon, 07/14/2025 - 18:22

భారతదేశంలోని ప్రముఖ ధూపద్రవ్య బ్రాండ్ అయిన ఐటీసీ మంగళ్‌దీప్  స్పెషల్లీ ఏబుల్డ్‌ దృష్టిలోపి ఉన్నవారికోసం   సిక్స్త్ సెన్స్ ప్యానెల్‌ అనే ఒక ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం  చుట్టింది. ఈ క్రమంలోనే సువాసనలను గుర్తించేలా దృష్టి లోపంతో ఉన్న వ్యక్తులను భాగస్వామాన్ని మరింత బలోపేతం చేసింది.  మంగళ్‌దీప్ సిక్స్త్ సెన్స్ ప్యానెల్‌ను 180 మందికి విస్తరించింది. విభిన్న, విశిష్ట విద్యా, వృత్తిపరమైన నేపథ్యాల నుండి వీరిని  ఎంపిక చేసింది.

దృష్టి లోపం ఉన్నవారికి అధికంగా వాసనలను పసిగట్టే జ్ఞానం ఉంటుందని వైద్యపరంగా నిరూపితమైంది. ఈ నేపథ్యంలో భగవంతుడికి, భక్తులకు మధ్య వారధిగా ఉండే  ఒక పవిత్రమైన కార్యంలో సువాసన టెస్టింగ్‌లో అంధులకు భాగస్వామ్యం కల్పించింది. 2021లో  తీసుకొచ్చిన  సిక్స్త్ సెన్స్ ప్యానెల్ కార్యక్రమం కింద ప్రత్యేక సువాసన శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన 30 మంది దృష్టి లోపం ఉన్న వ్యక్తులను ఇటీవల సత్కరించింది. చెన్నై, కోల్‌కతా, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్‌లలో 180 మందికి పైగా సభ్యులకు శిక్షణ ఇచ్చినట్టు  మంగళ్‌దీపి వెల్లడించింది.  అప్పటి నుండి ఈ ప్యానెల్ ఉత్పత్తి ఆవిష్కరణలో కీలక పాత్ర పోషించింది, శాండల్, రోజ్, లావెండర్, మ్యారిగోల్డ్ వంటి అనేక ప్రత్యేకమైన,సువాసన వేరియంట్‌లను మంగళ్‌దీప్ విడుదల చేయటంలో తోడ్పాటు అందించినట్టు తెలిపింది.

ఈ కార్యక్రమం గురించి ఐటిసి లిమిటెడ్‌లోని అగర్బత్తి & మ్యాచ్‌ల వ్యాపారం డివిజనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీ గౌరవ్ తాయల్ మాట్లాడుతూ, “సిక్స్త్ సెన్స్ ప్యానెల్ 4 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ఎంపిక చేసిన సువాసలు, అభివృద్ధి,  మెరుపుపర్చడం అనేది, సహజంగా వాసనలను పసిగట్టడంలో ఎక్కువ పవర్‌ ఉన్న వ్యక్తులతో కలిసి పనిచేయటం వల్ల సాంప్రదాయ పరీక్షా పద్ధతులకు మించి విలువైన  ధృక్పథం అలవడింన్నారు.  రాబోయే రోజుల్లో తమ సంస్థలో మరింత మందిని తీసుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. ధూప్ స్టిక్స్, ఫ్లోరా అగర్బత్తిస్, ప్రీమియం కప్పులు, సాంబ్రాణి స్టిక్స్ వంటి మంగళ్‌దీప్, కీలక ఉత్పత్తులతో ముడి పదార్థాలు, మిశ్రమ అనుభవాల ద్వారా ఫ్రూటీ, ఫ్లోరల్, వుడీ, హెర్బల్/మింట్ ,ఔధ్/అంబర్ వంటి ప్రధాన సువాసనలను గుర్తించడంలో శిక్షణ  నిచ్చారు.  

ప్యానెల్ సభ్యులు నెలవారీ సువాసన పరీక్షలలోపాల్గొనడానికి, వివరణాత్మక అభిప్రాయాన్ని అందించడానికి వీలుగా నిర్మాణాత్మక ఉత్పత్తి మూల్యాంకన ప్రోటోకాల్‌లు అందిస్తారు.  "ఐటిసి  సిక్స్త్ సెన్స్ ప్యానెల్‌లో భాగం కావడం నిజంగా సాధికారత కల్పించే అనుభవమనీ,. దృష్టి లోపం ఉన్న సమాజానికి అర్థవంతమైన స్వరాన్ని అందించే ప్రాజెక్ట్‌కు సహకరించడం గౌరవంగా ఉందని మాజీ బ్లైండ్ క్రికెట్ ప్రపంచ కప్ విజేత & మహనవ్ ఎబిలిటీ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు మహేందర్ వైష్ణ  ‍ కొనియాడారు.
ఈ శిక్షణ విజయవంతంగా పూర్తయిన సందర్భంగా, రేడియో ఉడాన్ సహ వ్యవస్థాపకురాలు శ్రీమతి మినల్ సింఘ్వి  ఐటీసీకి ధన్యవాదములు  తెలిపారు.

Videos

మా మామను ఆపుతారా? పెద్దారెడ్డి కోడలు మాస్ వార్నింగ్

CAG Report: ఏపీ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం.. బాబు పాలనపై కాగ్ నివేదిక

ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

సీఎంను చంపేసిన Facebook

కూటమి ప్రభుత్వంలో వైద్యానికి నిర్లక్ష్య రోగం!

హత్య కేసును తమిళనాడులోనే విచారించాలి.. ఏపీలో న్యాయం జరగదు

జగన్ 2.0.. ఎలా ఉండబోతుందంటే రోజా మాటల్లో...

మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా.. ఎక్కడున్నాడు పవన్ కళ్యాణ్

వణికిన మహానగరం

Big Question: నా పిల్లల్ని కూడా.. డిబేట్ లో రోజా కంటతడి

Photos

+5

ట్రైలర్ లాంచ్ ఈవెంటో మెరిసిన నటి డింపుల్ హయాతీ (ఫొటోలు)

+5

విజయవాడ : సారె తెచ్చి..మనసారా కొలిచి..కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి (ఫొటోలు)

+5

జడివానకు హైదరాబాద్‌ అతలాకుతలం.. ట్రాఫిక్‌ జామ్‌తో చుక్కలు చూసిన వాహనదారులు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన..చెరువుల్లా మారిన రోడ్లు (ఫొటోలు)

+5

‘నా సీతా సీమంతం’ శ్రీమతి సీమంతంపై బిగ్‌బాస్‌ ఫేం పోస్ట్‌ (ఫొటోలు)

+5

‘నేను నా శివయ్య’ అంటున్న ఈ భక్తురాల్ని చూశారా?

+5

చందమామలా.. చీర సింగారించుకుని క్యూట్‌గా తెలుగు బ్యూటీ!

+5

ఆంధ్రా సరిహద్దులో.. ఉరకలేస్తున్న జలపాతాలు(చిత్రాలు)

+5

కుమారుడితో తొలిసారి తిరుమలలో హీరోయిన్ ప్రణీత (ఫొటోలు)

+5

'పరదా' సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)