Breaking News

అనిల్ అంబానీకి ఎస్‌బీఐ ‘ఫ్రాడ్‌’ ట్యాగ్‌.. ఒకప్పుడు బిలియనీర్.. ఇప్పుడు మోసగాడా?

Published on Wed, 07/02/2025 - 20:55

సాక్షి,ఢిల్లీ: అన్న ముఖేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా తిరుగులేని సామ్రాజ్యాన్ని నిర్మించగా.. తమ్ముడు అనిల్ అంబానీ మాత్రం అప్పుల ఊబిలో కూరుకుని నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.  గతంలో వ్యాపార రంగంలో తన అద్భుతమైన తెలివితేటలు, సామర్ధ్యంతో  ప్రపంచ అత్యంత ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్న అనిల్ అంబానీ ఇప్పుడు బ్యాంకుల్ని మోసం చేసిన మోసగాళ్ల జాబితాలో చేరినట్టు పలు నివేదికలు చెబుతున్నాయి.

ప్రముఖ వ్యాపార వేత్త అనిల్‌ అంబానీకి ఎస్‌బీఐ షాకిచ్చింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) భారీ ఎత్తున రుణాలిచ్చింది. ఆ రుణాల్ని రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ (ఆర్‌కాం) నిబంధనలకు విరుద్ధంగా నిధుల్ని మళ్లించినట్లు గుర్తించింది. ఫలితంగా బ్యాంకుల్ని మోసం చేసిన సంస్థల జాబితాలో రిలయన్స్‌ కమ్యూనికేషన్‌తో పాటు ఆ సంస్థ మాజీ డైరెక్టర్‌ అనిల్‌ అంబానీ పేరును సైతం చేర్చింది. 

ఎస్‌బీఐ స్టాక్‌ ఎక్ఛేంజ్‌ ఫైలింగ్‌ ప్రకారం.. రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కి ఇచ్చిన రుణాల్లో నిబంధనల ఉల్లంఘన, నిధుల దుర్వినియోగం వంటి అంశాలు కనిపించాయని పేర్కొంది. మొత్తం రూ.31,580 కోట్ల రుణాల్లో సుమారు రూ.13,667 కోట్లు ఇతర రుణాల చెల్లింపులకు, రూ.12,692 కోట్లు సంబంధిత సంస్థలకు మళ్లించారని తెలిపింది. 


ఈ నేపథ్యంలో, ఎస్‌బీఐ జూన్ 23న కంపెనీకి లేఖ రాసింది. సంస్థ ఖాతాల్ని ‘ఫ్రాడ్’గా గుర్తిస్తున్నట్లు సమాచారం అందించింది. అనిల్ అంబానీ పేరును కూడా చేర్చినట్లు ఆర్‌బీఐకి నివేదించింది. అయితే, అనిల్ అంబానీ తరఫు న్యాయవాదులు ఈ నిర్ణయంపై స్పందించారు. తాము సమర్పించిన వివరణలకు ఎస్‌బీఐ సరైన స్పందన ఇవ్వలేదని ఆరోపించారు. ఇదే విషయంలో అనిల్‌ అంబానీ సంస్థలకు రుణాలు ఇచ్చిన ఇతర బ్యాంకుల్ని సైతం ఎస్‌బీఐ సంప్రదించనుంది. ఇప్పటికే కెనరా బ్యాంక్ కూడా ఆర్‌కామ్‌ అకౌంట్లను ఫ్రాడ్‌గా గుర్తించింది.

కాగా, బ్యాంకులు ఏదైనా సంస్థకు రుణాలిచ్చి.. వాటిని చెల్లించే క్రమంలో లేదంటే ఇతర అవకతవకలు జరిగినట్లు గుర్తిస్తే వాటిని ఫ్రాడ్‌ జాబితాలో చేర్చుతాయి. ఆ జాబితాలో పేరుంటే  సదరు సంస్థలకు ‌5 సంవత్సరాల పాటు కొత్త రుణాలు ఇవ్వకూడదు. ఇది అన్ని బ్యాంకులకు వర్తించే నిబంధన. తాజాగా ఆర్‌కామ్‌ విషయంలో సైతం ఎస్‌బీఐ తీసుకున్న నిర్ణయం ఇతరు బ్యాంకులు తీసుకునేలా సంప్రదింపులు జరపనున్నట్లు తెలుస్తోంది.

Videos

ఎడ్జ్‌బాస్టన్‌ టెస్ట్ చివరి రోజు ఆటకు వర్షం అంతరాయం

నాగమల్లేశ్వరరావు కేసులో గుంటూరు ఎస్పీకి YSRCP ఫిర్యాదు

హైటెన్షన్ విద్యుత్ పోల్ ఎక్కిన శ్యాం అనే వ్యక్తి

పరిశ్రమల పేరుతో రైతుల జీవితాలతో బాబు చెలగాటం: మేరుగు నాగార్జున

వైఎస్ జగన్ హయాంలో ఏపీలో పాఠశాలల రూపురేఖలు మారాయి: సినీనటుడు సుమన్

చిత్తూరుకు YS జగన్

Harish Rao: నీళ్ల విలువ తేలియని నాయకులు పాలకులుగా ఉన్నారు

Venkatram Reddy: కూటమి సర్కార్ కంటే YSRCP పాలనే బెటర్

గిట్టుబాటు ధరల్లేవని మామిడిని రోడ్డు పక్కన పడేస్తున్న రైతులు

చాలాకాలం తర్వాత వెలుగులోకి ఇరాన్ సుప్రీం లీడర్

Photos

+5

ప్రిన్స్ చార్లెస్, ఓప్రా విన్‌ఫ్రే మెచ్చిన ప్రదేశం..ఫిట్‌నెస్‌కి కేరాఫ్‌ అడ్రస్‌ ఇది..! (ఫోటోలు)

+5

భార్యతో ద్వారకా తిరుమల వెళ్లిన కమెడియన్‌ (ఫోటోలు)

+5

కుట్రాళం జలపాతాలు చూశారా... ???

+5

ఆద్యంతం ఉత్కంఠను రేపే మిస్టరీ పర్యాటక ప్రదేశాలివే..! (ఫోటోలు)

+5

విజయవాడ : రైలు ప్రమాదాల సమయంలో ప్రాణనష్టం నివారణపై మెగా మాక్‌ డ్రిల్‌ (ఫొటోలు)

+5

అనంతపురం : గూగూడులో కుళ్లాయిస్వామి ఉత్సవాలకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

జిడ్డు ఆముదమే కానీ..ఎన్ని ప్రయోజనాలో తెలుసా..! (ఫొటోలు)

+5

హైదరాబాద్ : సాయంత్రం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్‌లో చుక్కలు (ఫొటోలు)

+5

ఆషాడమాసం.. విజయవాడ దుర్గ గుడిలో భక్తుల రద్దీ (ఫోటోలు)

+5

ఆరునెలల జ్ఞాపకాలు పంచుకున్న ప్రభాస్‌ సోదరి (ఫోటోలు)