Breaking News

జేఎస్‌డబ్ల్యూ నిధుల సమీకరణ

Published on Wed, 07/02/2025 - 01:40

ముంబై: డ్యూలక్స్‌ బ్రాండ్‌ పెయింట్ల దిగ్గజం అక్సో నోబెల్‌ ఇండియా కొనుగోలుకి జేఎస్‌డబ్ల్యూ పెయింట్స్‌ నిధుల సమీకరణకు తెరతీసింది. దీనిలో భాగంగా కంపెనీ ప్రమోటర్లతోపాటు.. పీఈ దిగ్గజాలు పెట్టుబడులు సమకూర్చనున్నట్లు వెల్లడించింది. మరికొన్ని నిధులను రుణాల ద్వారా సమకూర్చుకోనున్నట్లు కంపెనీ ఎండీ పార్ధ్‌ జిందాల్‌ తెలియజేశారు. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ గ్రూప్‌ కంపెనీ అంతర్గత వనరులు, ప్రమోటర్ల పెట్టుబడుల ద్వారా రూ. 7,000 కోట్లు సమకూర్చుకోనున్నట్లు వెల్లడించారు. మిగిలిన నిధులను పీఈ సంస్థలు అందించనున్నట్లు పేర్కొన్నారు.

ఐదేళ్ల క్రితమే ప్రస్థానం ప్రారంభించిన జేఎస్‌డబ్ల్యూ పెయింట్స్‌ తాజాగా డచ్‌ దిగ్గజం అక్సో నోబెల్‌.. ఇండియా బిజినెస్‌ను కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు రూ. 13,000 కోట్లు వెచి్చంచనుంది. డీల్‌ పూర్తయితే జేఎస్‌డబ్ల్యూ పెయింట్స్‌ దేశీయంగా డెకొరేటివ్‌ పెయింట్ల విభాగంలో మూడో పెద్ద కంపెనీగా అవతరించనుంది. రానున్న మూడేళ్లలో టర్నోవర్‌ రూ. 7,500 కోట్లకు చేరనున్నట్లు అంచనా.

కాగా.. భారత్‌ నుంచి పూర్తిగా వైదొలగడంలేదని అక్సో నోబెల్‌ సీఈవో గ్రెగ్‌ పౌక్స్‌ గిలామీ తెలియజేశారు. పౌడర్‌ కోటింగ్స్‌ బిజినెస్, ఆర్‌అండ్‌డీ కంపెనీ చేతిలోనే కొనసాగనున్నట్లు  వెల్లడించారు. అయితే జేఎస్‌డబ్ల్యూకి సాంకేతిక భాగస్వామిగా కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. లైసెన్సింగ్, రాయల్టీ ఒప్పందంకింద 4.5 శాతం అందుకోనున్నట్లు తెలియజేశారు. 

#

Tags : 1

JSW

Videos

పాకిస్తాన్ తో యుద్ధాన్ని ఎందుకు ఆపేశారు? కాంగ్రెస్ సూటి ప్రశ్నకు బీజేపీ రిప్లై ఏంటి?

ఈడీ విచారణపై అల్లు అరవింద్ క్లారిటీ

ఈ ఘటన చూసి నా కళ్ళలో నీళ్లు వచ్చాయి.. ఎంపీ తనుజారాణి ఎమోషనల్

వైఎస్ జగన్ ను కలవొద్దని మామిడి రైతులను కూటమి నేతలు బెదిరిస్తున్నారు

మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది: రాంచందర్రావు

ఈనెల 9న చిత్తూరు జిల్లాలో YS జగన్ పర్యటన: పెద్దిరెడ్డి

20 ఏళ్ల తర్వాత ఒకే వేదికపైకి ఠాక్రే వారసులు

గంటాపై ఫిర్యాదు చేసిన భీమిలి నియోజకవర్గ నేతలు

వల్లభనేని వంశితో అభిమానుల ఫోటోలు

ఏపీలో నరకాసుర పాలన: పేర్ని నాని

Photos

+5

ఆద్యంతం ఉత్కంఠను రేపే మిస్టరీ పర్యాటక ప్రదేశాలివే..! (ఫోటోలు)

+5

విజయవాడ : రైలు ప్రమాదాల సమయంలో ప్రాణనష్టం నివారణపై మెగా మాక్‌ డ్రిల్‌ (ఫొటోలు)

+5

అనంతపురం : గూగూడులో కుళ్లాయిస్వామి ఉత్సవాలకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

జిడ్డు ఆముదమే కానీ..ఎన్ని ప్రయోజనాలో తెలుసా..! (ఫొటోలు)

+5

హైదరాబాద్ : సాయంత్రం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్‌లో చుక్కలు (ఫొటోలు)

+5

ఆషాడమాసం.. విజయవాడ దుర్గ గుడిలో భక్తుల రద్దీ (ఫోటోలు)

+5

ఆరునెలల జ్ఞాపకాలు పంచుకున్న ప్రభాస్‌ సోదరి (ఫోటోలు)

+5

'అఖండ' కోసం తెలుగులో ఎంట్రీ ఇచ్చేసిన నటి హర్షాలీ మల్హోత్రా (ఫోటోలు)

+5

గర్భాలయంలో ఏడడుగుల విగ్రహం.. ఏపీలో ఈ పురాతన ఆలయం గురించి విన్నారా? (చిత్రాలు)

+5

నలుగురు టాప్‌ హీరోయిన్లతో ధనుష్‌ పార్టీ.. ఎందుకో తెలుసా (ఫోటోలు)