మావోయిస్టు కుంజమ్ హిడ్మా అరెస్ట్
Breaking News
టర్కీ కంపెనీతో కాంట్రాక్ట్ రద్దు
Published on Wed, 05/28/2025 - 09:32
చెన్నై విమానాశ్రయం టర్కీకి చెందిన సెలెబి సంస్థతో గతంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అధికారికంగా రద్దు చేసుకుంది. జాతీయ భద్రతా ఆందోళనల కారణంగా కంపెనీ సేవలందిస్తున్న సెక్యూరిటీ క్లియరెన్స్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (ఎంఐఏఎల్) సంస్థ సేవలను నిలిపేసింది. దీన్ని సవాలు చేస్తూ కంపెనీ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. విచారణ పూర్తయ్యేవరకు కొత్త గ్రౌండ్ వర్కింగ్ కాంట్రాక్టులు ఇవ్వడాన్ని నిలిపివేయాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో చెన్నై ఎయిర్పోర్ట్ కూడా సంస్థ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది.
టర్కిష్ ఏవియేషన్ సంస్థ సెలెబి పదేళ్లకు పైగా భారతదేశంలో కార్యకలాపాలు సాగిస్తోంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్తో సహా అనేక విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలను అందిస్తోంది. కంపెనీతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నందుకు ప్రతిస్పందనగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు కంపెనీ మధ్యవర్తిత్వ ప్రొసీడింగ్స్ దాఖలు చేసింది.
ఇటీవల కాలంలో టర్కీ పాకిస్థాన్ ఉగ్రచర్యలకు మద్దతు ఇస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్లో టర్మీ సంస్థల కార్యకలాపాలను నిలిపేయాలని దేశీయ సంస్థలు చూస్తున్నాయి. టర్కీ డ్రోన్ల వాడకంతో సహా ప్రాంతీయ సంఘర్షణల్లో పాక్కు మద్దతుగా టర్కీ ప్రమేయంపై భారతదేశంలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంలో టర్కీ సంస్థలతో ఒప్పందాలపై దేశీయ కంపెనీలు పున:పరిశీలన చేసుకునే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇదీ చదవండి: గోల్డ్ రేట్, స్టాక్ మార్కెట్ అప్డేట్స్
సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దును సవాలు చేస్తూ సెలెబి కంపెనీ ఢిల్లీ హైకోర్టు, బాంబే హైకోర్టును ఆశ్రయించింది. జూన్లో ఈ కేసు విచారణ జరిగే వరకు ముంబై ఎయిర్పోర్ట్ కొత్త గ్రౌండ్ హ్యాండ్లింగ్ కాంట్రాక్టులను ఖరారు చేయకుండా బాంబే హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది.
Tags : 1