8 సుస్థిరాభివృద్థి లక్ష్యాల పర్యవేక్షణకు కమిటీ | Sakshi
Sakshi News home page

8 సుస్థిరాభివృద్థి లక్ష్యాల పర్యవేక్షణకు కమిటీ

Published Thu, Jun 29 2023 4:43 AM

Committee to monitor the Sustainable Development Goals - Sakshi

సాక్షి, అమరావతి: ఐక్యరాజ్యసమితి పేర్కొన్న సుస్థి­రాభివృద్ధి లక్ష్యాలను వేగంగా చేరుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఏపీఎస్‌డీజీ ప్రత్యేక పోర్టల్‌ ద్వారా సేకరించే సమాచారం దునియో­గం కాకుండా ప్రత్యేక కమి­టీని ఏర్పాటు చేసింది. ఎనిమిది మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ సీఎస్‌ డాక్టర్‌  జవహర్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులిచ్చారు.

కమిటీలో వెనుకబడిన తరగతుల సంక్షేమ­శాఖ ప్రత్యే­క ప్రధాన కార్యదర్శి, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి, మహిళా శిశు సం­క్షేమశా­ఖ ముఖ్య కార్యదర్శి, సాంఘిక సంక్షేమశా­ఖ ముఖ్య కార్యదర్శి, మైనార్టీ, గిరిజన సంక్షేమ కార్యదర్శులు సభ్యులుగా, ఐటీశాఖ కార్యదర్శి సభ్య కన్వినర్‌గా వ్యవ­హరిస్తారని వివరించారు.

10 నుంచి 19 ఏళ్ల బాలికల్లో ఎనీ­మియా, 15 నుంచి 49 ఏళ్ల మధ్యలో గర్భందా ల్చిన మహిళల్లో ఎనీమియా, ఐదేళ్లలోపు వయ­సులో బరువు తక్కువగా ఉన్న వారిలో పౌష్టికాహారలోపం,  ఐదేళ్లలోపు వయసుకు తగ్గట్టుగా బరువు పెర­గని పిల్లల్లో పౌష్టికాహారలోపం, 1–8 తరగతుల విద్యార్థుల ప్రాథమిక విద్య నమోదు, ఇంటర్మిడియట్‌ విద్యార్థుల గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ నిష్పత్తి, పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు, పాఠశాలల్లో విద్యార్థినుల టాయి­లెట్స్‌ వంటి ఎనిమిది సుస్థిరాభివృద్ధి లక్ష్యా­లకు సంబంధించిన సమాచారం గ్రామ, వార్డు సచివాలయాల నుంచి ఎప్పటికప్పుడు సేక­రించి ఏపీఎస్‌డీసీ పోర్టల్‌లో నమోదు చేస్తారు. 

Advertisement
Advertisement