-
తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైఎస్ఆర్సీపీ నేతలపై రాళ్ల దాడి
తాడిపత్రి,సాక్షి: ఏపీలో సాధారణ ఎన్నికల పోలింగ్ ముగిసినా అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. మంగళవారం(మే14) తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నేతలు దాడికి యత్నించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై టీడీపీ నేతలు రాళ్లదాడికి ప్రయత్నించారు. దీంతో వైఎస్ఆర్సీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇరు పార్టీల నేతలు పరస్పరం రాళ్లదాడికి దిగగా ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి భాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. రాళ్ల దాడిలో సీఐ మురళీకృష్ణకు తీవ్ర గాయలవగా ఆస్పత్రికి తరలించారు. -
ఆ శబ్దం వారికే వినిపిస్తుంది, వెంటాడుతుంది! వేలల్లో కేసులు నమోదు!
మీరెప్పుడైనా రాత్రి పూట చెవి చుట్టూ దోమ తిరగడం గమనించారా? అది తిరిగిన కాసేపు చిర్రెత్తుకొస్తుంది. లైటు వేసి దాన్ని చంపేదాకా నిద్రపట్టదు. కానీ ప్రపంచంలో చాలామందికి ఓ విచిత్రమైన కొత్తశబ్దాన్ని.. అసంబద్ధంగా వింటూ.. నిద్రకు దూరమవుతున్నారట. లైట్ తీసినా, వేసినా.. మెలకువగా ఉన్నా.. నిద్రపోయినా.. పోనీ ఆ చోటుని వదిలి ఎంత దూరం వెళ్లినా.. ఆ శబ్దం వెంటాడుతూనే ఉంటుందట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. వారు వినే ఆ శబ్దం.. తమ వెంట ఉన్నవారికి కూడా వినిపించకపోవచ్చు. అదే ‘ది హమ్’ మిస్టరీ. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో ఈ కేసులు వేలల్లో నమోదయ్యాయి. శబ్దానికి, నిశ్శబ్దానికి మధ్య అస్పష్టమైన ఓ అలికిడి ఉంటుందని.. రాత్రివేళ దాన్ని స్పష్టంగా వింటున్నామని చెప్పే వాళ్లే ఈ మిస్టరీకి సృష్టికర్తలు. వీరిని ‘ది హియర్స్’ అంటారు. సాధారణంగా మనిషి చెవులు.. 20 ఏ్డ (తక్కువ పిచ్) నుంచి 20 జుఏ్డ (అత్యధిక పిచ్) మధ్య ఫ్రీక్వెన్సీలను గ్రహిస్తాయి. కానీ ‘ది హియర్స్’ మాత్రం తమకు ఇంకాస్త తక్కువ ఫ్రీక్వెన్సీలో అస్పష్టమైన నాయిస్ వినిపిస్తోందని వాదిస్తారు. వారు వినే శబ్దాన్ని.. అతి తక్కువ–ఫ్రీక్వెన్సీ హమ్మింగ్లా, రంబ్లింగ్ (దూరంగా ఉన్న పెద్దపెద్ద వాహనాల నుంచి వచ్చే ప్రతిధ్వని) నాయిస్గా భావించారు నిపుణులు. ప్రశాంతమైన నగరాల్లో, పల్లెటూళ్లలో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతుంటాయి. ఈ హమ్మింగ్కి బ్రిస్టల్ హమ్, టావోస్ హమ్, విండ్సర్ హమ్ వంటి పలు పేర్లు ప్రాచుర్యంలోకి వచ్చాయి. బ్రిస్టల్ హమ్.. ఇంగ్లాడ్లోని బ్రిస్టల్లో 1970లో తొలి కేసు నమోదైంది. అక్కడి నివాసితులు కొందరు.. రాత్రి పూట ఏదో శబ్దం నిద్రకు భంగం కలిగిస్తోందని అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. మొదట్లో ఈ హమ్ సమీపంలోని ఫ్యాక్టరీలు, ఎలక్ట్రిక్ పైలాన్లు కారణం అయ్యి ఉండొచ్చని భావించారట. అయితే మరికొందరు నివాసితులు.. ఆ శబ్దాలన్నీ గ్రహాంతర అంతరిక్ష నౌకల నుంచి వస్తున్నాయని భావించారు. ఇంకొందరైతే.. రహస్య సైనిక చర్యల్లో భాగం కావచ్చని నమ్మారు. అయితే చాలామంది ఈ హమ్ ఈ లోకానికి చెందినది కాదని, మరో లోకానికి సంబంధించిందని ప్రచారం చేశారు. కొన్ని నెలలకు ఆ హమ్ హఠాత్తుగా ఆగినట్లే ఆగి.. బ్రిట¯Œ లోని ఇతర ప్రదేశాలకు వినిపించడం మొదలైంది. అదే హమ్ని ఇప్పటికీ చాలామంది వింటూనే ఉన్నారట. టావోస్ హమ్.. ఇక అమెరికాలోని న్యూ మెక్సికోలో 1990లో ఈ హమ్ ఫిర్యాదులు మొదలయ్యాయి. అయితే ఈ హియర్స్ ఒకే రకమైన శబ్దాన్ని వినడం లేదని అధికారులు గుర్తించారు. ఒక్కొక్కరూ ఒక్కో ప్రత్యేకమైన శబ్దాన్ని వింటున్నట్లు వివరించడం మొదలు పెట్టారు. దాంతో శాస్త్రవేత్తలు వారు నివేదించిన శబ్దాలను వినేందుకు.. వారి వారి ఇళ్లల్లో.. ప్రత్యేకమైన పరికరాలను కూడా అమర్చారు. కానీ ఆశించిన ఫలితం దక్కలేదు. శాస్త్రవేత్తలకు ఎలాంటి అసాధారణ కంపనాలు చిక్కలేదు. విండ్సర్ హమ్.. ఇంగ్లాడ్లోని విండ్సర్లో వినిపించే ఈ హమ్.. మొదటిగా ఎప్పుడు గుర్తించారో తెలియదు కానీ.. 2012 నుంచి ఈ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. విన్నవారంతా ఇది ఎక్కువ సేపు వినిపిస్తోందని.. బిగ్గరగా వినిపిస్తోందని వాపోతుంటారు. ఈ శబ్దం కిటికీలను కదిలిస్తోందని.. పెంపుడు జంతువుల్ని భయపెడుతోందని ఆరోపించారు. ఇది మానసికస్థైర్యాన్ని దెబ్బతీస్తోందని మొరపెట్టుకు న్నారు. ఈ శబ్దాన్ని దూరం చేసుకోవడానికి చాలామంది ఇతర ప్రదేశాలకు ప్రయాణాలు చేసినా.. ఆ శబ్దం వారిని వెంటాడుతూనే ఉందట. ఈ హమ్ కేసులో స్త్రీ పురుషులు సమానంగా ఇబ్బంది పడుతున్నారు. కొందరు ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు.. తాము హమ్ కేసును పరిష్కరించామని.. అది ఎక్కడ నుంచి వస్తుందో తెలుసునని చెప్పారు. పెద్ద పెద్ద అలల కారణంగా సముద్రపు అడుగుభాగం కంపించడమే ఈ హమ్మింగ్కు మూలమని ప్రకటించారు. అయితే ఆ వాదనను మరికొందరు శాస్త్రవేత్తలు ఖండించారు. సముద్రం లేని చోట కూడా ఇలాంటి ధ్వనులు వినిపిస్తున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయంటూ కొట్టిపారేశారు. ఇది ఒక మానసికమైన సమస్య అని కొందరు వైద్యులు చెబితే.. ఇది దూరంగా నడిచే ట్రాఫిక్ నుంచి కానీ, విమానాశ్రయాల నుంచి కానీ, నౌకాయానాల నుంచి కానీ, గాలి మరల నుంచి కానీ కావచ్చు అని కొందరు నిపుణులు అంచనా వేశారు. అయితే కొందరు శాస్త్రవేత్తలు మాత్రం.. ఈ శబ్దానికి మిడ్షిప్మ్యాన్ ఫిష్ లేదా టోడ్ ఫిష్లు కారణం కావచ్చని భావించారు. ఈ చేపలు తన సహచరిని సంభోగానికి పిలుపునిచ్చినప్పుడు కొన్నిసార్లు చిన్నగానే హమ్మింగ్ చేస్తాయి కానీ.. కొన్నిసార్లు చాలా పెద్దగా ఎక్కువ సేపు హమ్మింగ్ చేస్తుంటాయట. అది సుమారు గంట ప్రక్రియ అని.. ఆ శబ్దాలే.. ఈ హియర్స్ చెవిన పడుతున్నాయని వాదించారు. మరోవైపు ఈ హమ్మింగ్ బాధితులకు కేవలం ఒత్తిడి, ఆందోళనల వల్లే అలాంటి శబ్దాలు వినిపిస్తున్నాయని ఇంకొందరు శాస్త్రవేత్తలు సిద్ధాంతీకరించారు. ఏది ఏమైనా ఈ హమ్(శబ్దం) ఎక్కడి నుంచి వస్తోంది? ఎలా వినిపిస్తోంది? అనేది వినేవాళ్లకు కూడా తెలియకపోవడంతో మిస్టరీగానే మిగిలిపోయింది. — సంహిత నిమ్మన ఇవి చదవండి: ఈ పండుగ కొందరికి హోలీ అయితే.. మరి కొందరికి ‘హోలా మొహల్లా’.. -
Parineeti Chopra: దేవుడా..! టెన్షన్లో ఉన్నప్పుడు ఈ హీరోయిన్ ఇలా చేస్తుందా!
సాధారణంగా మన జీవితాల్లో ఎన్నో కుదుపులు, చికాకులు, అడ్డంకులు వస్తూంటాయి. వీటిని కొందరు తేలికగా, మరికొందరు టెన్షన్గా తీసుకుంటారు. మరి ఆ టెన్షన్లో చాలామంది కొన్నిరకాల చేష్టలు చేస్తూంటారు. వాటిలో గోళ్లు కొరకడం, వేళ్లు విరవడం, తల పట్టుకోవడం, చికాకు పడుతూ ఉండటంలాంటివి. ఇక ఈ బాలీవుడ్ నటికి మాత్రం ఇలాంటి అలవాటుందని తెలుసా..! టెన్షన్లో ఉన్నప్పుడు.. భయమేసినప్పుడు పరిణీతి చోప్రాకు.. చేతివేళ్ల గోళ్లను కాదు.. ఆ గోళ్ల చుట్టూ ఉన్న స్కిన్ని కొరకడం అలవాటట! విమానం ల్యాండ్ అవుతున్నప్పుడు చాలా భయపడుతుందట! ఆ భయంతో గోళ్ల చుట్టూ ఉన్న స్కిన్ని కొరుకుతుందని బాలీవుడ్ సోర్సెస్ ఇన్ఫో. పిజ్జా అంటే పరిణీతికి ప్రాణం. పగలు.. రాత్రి.. అర్ధరాత్రి.. అనే తేడా లేకుండా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు పిజ్జా పనిపడుతుందట! ఇవి చదవండి: Priyamani: ప్రియ 'నటీమణి'.. పెర్ఫార్మెన్స్కి పర్యాయపదం ఆమె! -
ట్రబుల్ షూటర్ ఎంట్రీ.. టీడీపీ నేతల్లో మొదలైన కలవరం
ఆ నేతకు వైఎస్సార్ కాంగ్రెస్లో ట్రబుల్ షూటర్గా పేరుంది. ఇప్పుడు ఆయన పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగడంతో ఆక్కడి విపక్షాలు కకావికలం అవుతున్నాయి. మొన్నటి వరకు ఎలాగొలా గెలుస్తాం అనుకున్న విపక్షం ట్రబుల్ షూటర్ దిగడంతో కలవరపడుతున్నారు. వైస్సార్సీపీ ట్రబుల్ షూటర్ విజయసాయి రెడ్ది. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇచ్చే ఎటువంటి టాస్క్ను అయినా.. విజయవంతంగా అమలు చేయడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నారు. సైరా విజయసాయిరెడ్డిగా ఆయన అభిమానులు పిలుచుకునే ఈ నాయకుడిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపింది. నిన్న మొన్నటి వరకు తమకు తిరుగులేదని భావించిన సింహపురి టీడీపీ నేతలకు సైరా ఎంట్రీతో కలవరం మొదలైంది. నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లోనూ వైస్సార్సీపీ అభ్యర్థుల గెలుపుతో పాటు.. తాను ఎంపీగా గెలిచేలా విజయసాయిరెడ్డికి సీఎం వైఎస్ జగన్ బాధ్యతలు అప్పగించారు. నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు వైసీపీ తన అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసింది. టీడీపీ మాత్రం కొన్ని చోట్ల అభ్యర్థులు లేక.. కొన్ని చోట్ల ఎవరికి ఇస్తే..ఎవరికి కోపం వస్తుందో అనే భయంతో దిక్కుతోచని పరిస్థితుల్లో కొనసాగుతోంది. తొలి జాబితాలో నాలుగు సెగ్మెంట్లలో అభ్యర్థులను ప్రకటించినా.. కోవూరు, ఆత్మకూరు, కందుకూరు స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేయలేక సతమతం అవుతోంది. దీంతో అక్కడి క్యాడర్, నేతలు డైలామాలో పడ్డారు. ఇప్పుడు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి పేరు ప్రకటించడంతో టీడీపీ నేతలకు భయం రెట్టింపు అయింది.. ప్రకటించిన అభ్యర్థులను కూడా మార్చే ఆలోచనలో ఉన్నట్లు టీడీపీ నేతల్లో చర్చ మొదలైంది. విజయసాయి రెడ్డి వేసే ఎత్తులు, పైఎత్తులను తట్టుకోవడం కష్టమని జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేతలు సైతం ఆందోళన చెందుతున్నారట. వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఓడించడంతో పాటు.. మొత్తం అన్ని నియోజకవర్గాలో గెలుపే లక్ష్యంగా విజయసాయిరెడ్ది పక్కా ప్రణాళికతో జిల్లాలోకి ఎంటర్ అయ్యారని.. టీడీపీ నేతలను మడత పెట్టడం ఖాయమని వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్దిని.. అలాగే అనం రామ నారాయణ రెడ్డిని ఓడించడం కోసం విజయసాయి రెడ్ది వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారని జిల్లాల్లో టాక్ నడుస్తోంది. సింహపురి జిల్లాపై మంచి పట్టు ఉన్న విజయసాయిరెడ్ది ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగటంతో టీడీపీ నేతలకు ఏమీ పాలుపోవడంలేదు. జిల్లాలోని అన్ని వర్గాల్లో, టీడీపీ నాయకులతో కూడా విజయసాయిరెడ్డికి విస్తృత సంబంధాలు ఉండటమే టీడీపీ నాయకత్వంలో భయానికి కారణం అంటున్నారు. విజయసాయి రెడ్దితో జాగ్రత్తగా ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు.. జిల్లా పార్టీ నేతలకు ఇప్పటికే సమాచారం పంపారని తెలుస్తోంది. పార్లమెంట్ పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ అసంతృప్తితో ఉన్న టీడీపీ నేతలు సైరాకు టచ్ లో ఉన్నారని.. వారు ఏ క్షణమైనా వైఎస్ఆర్సీపీలోకి జంప్ చేసే అవకాశం ఉందని టీడీపీ నేతలే చెబుతున్నారు. విజయసాయిరెడ్డి ఇంకా పూర్తిస్థాయిలో బరిలోకి దిగక ముందే టీడీపీ నేతలకు కంటిమీద కునుకు కరువైంది. వైఎస్ఆర్సీపీలోని నేతల్ని సెట్ రైట్ చెయ్యడంతో పాటు.. టీడీపీలోని కీలక నేతల్ని తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు విజయసాయిరెడ్ది ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. ఇదే జరిగితే మరోసారి నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ క్లిన్ స్వీప్ చేయడం ఖాయమని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. -
గురుకులాల్లో పదోన్నతుల టెన్షన్
సాక్షి, హైదరాబాద్: కొత్త నియామకాలకు ముందే గురుకుల విద్యా సంస్థల్లో పనిచేస్తున్న సీనియర్ టీచర్లకు పదోన్నతులు కల్పించాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఏళ్ల తరబడి వారంతా ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. గురుకుల పాఠశా లలు, కళాశాలల్లోని వివిధ కేటగిరీల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియను తెలంగాణరాష్ట్ర గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్ఈఐఆర్బీ) ఓ కొలిక్కి తీసుకొచ్చింది. వారంరోజుల్లో ఖాళీ లు భర్తీ చేసి అర్హులకు నియామక పత్రాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.అయితే ఈ నియామకాల కంటే ముందుగా పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలని గురుకుల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘా లు ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్రతరం చేశాయి. దీనిపై సీఎం రేవంత్రెడ్డితోపాటు మంత్రులు, ఉన్నతాధికారులకు వినతులు కూడా సమర్పించాయి. సీనియారిటీ జాబితాలు సిద్ధం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్), మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్)ల పరిధిలో దాదాపు వెయ్యి విద్యా సంస్థలున్నాయి. వీటి పరిధిలో 22వేలకుపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్లలో సీని యర్లకు పదోన్నతులు కల్పించాలి. దీనికి సంబంధించి సొసైటీలు ఇప్పటికే సీనియారిటీ జాబితాలు సిద్ధం చేశాయి. ప్రభుత్వం అనుమతిస్తే రెండ్రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసే వీలుందని సొసైటీ అధికారులు చెబుతున్నారు. ఇదే జరిగితే అన్ని కేటగిరీల్లో 3 వేల మందికి పదోన్నతులు దక్కుతాయి. ఆలస్యమైతే.. అంతే టీఆర్ఈఐఆర్బీ ద్వారా గురుకుల విద్యాసంస్థల్లో కొత్తగా 9వేల మంది ఉద్యోగులు చేరనుండగా, ఇప్పటికే గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ ఉద్యోగాలతోపాటు పీజీటీ కేటగిరీల్లో 2వేల మంది నియామక పత్రాలు అందుకున్నారు. మిగిలిన వారికి కూడా ఈ నెలాఖరులోగా నియామక పత్రాలు, ఆ తర్వాత పోస్టింగ్ ఇచ్చే అవకాశముంది. అయితే కొత్తవారికి నియామక పత్రాలు ఇవ్వగానే వారి సర్విసు గణన ప్రారంభమవుతుంది. దీంతో అర్హత ఉండి పదోన్నతులు రాని వారంతా కొత్తగా నియమితులైన వారికంటే జూనియర్లుగా ఉండిపోతారు. ఇలా పీజీటీ, జేఎల్, డీఎల్ కేటగిరీల్లోని సీనియర్ల సీనియారిటీ క్రమం తారుమారు అవుతుందని ఉద్యోగ సంఘాల నేతలు వాపోతున్నారు. ప్రభుత్వ పెద్దలు హామీ ఇచ్చారు చాలా కేటగిరీల్లోని టీచర్లకు పదోన్నతులు రాలేదు. ఇటీవల సీఎంతోపాటు సీఎస్, ఇతర ఉన్నతాధికారులను కలిసి పరిస్థితిని వివరించాం. వారు సానుకూలంగా స్పందించారు. నూతన నియామకాలకంటే ముందే పదోన్నతులు కల్పిస్తారనే నమ్మకం ఉంది. – మామిడి నారాయణ, గురుకుల ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధి సీనియర్లు నష్టపోతారు కొత్త నియామకాల తర్వాత పదోన్నతుల ప్రక్రియ చేపడితే సీనియర్లు తీవ్రంగా నష్టపోతారు. తదుపరి పదోన్నతుల సమయంలో జూనియర్లుగా మిగిలి పోయే ప్రమాదం ఉంది. దాదాపు ఆరేళ్లుగా గురు కులాల్లో పదోన్నతులు నిర్వహించలేదు. పదేళ్ల నుంచి ఒకే స్థానంలో పనిచేస్తున్న టీచర్ల సంఖ్య పెద్దగానే ఉంది. నూతన నియామకాలకంటే ముందే పదోన్నతులు, బదిలీలు నిర్వహిస్తే ప్రస్తుతం పనిచేస్తున్నవారికి లాభదాయకం. – సీహెచ్.బాలరాజు, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు -
Delhi Chalo: రైతు ఉద్యమం ఉధృతం
న్యూఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయడం సహా పలు డిమాండ్ల సాధనకు రైతులు చేపట్టిన ‘చలో ఢిల్లీ’ మరింత ఉధృతమైంది. ఢిల్లీ సమీపంలో శంభు, టిక్రి సరిహద్దుల వద్ద పోలీసుల బారికేడ్లు, ఇనుపకంచెలు, సిమెంట్ దిమ్మెలను దాటేందుకు రైతులు ప్రయతి్నస్తున్నారు. పోలీసుల భాష్పవాయు గోళాలు, జలఫిరంగుల దాడితో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. ఉద్యమం మొదలై మూడురోజులవుతున్నా అటు రైతులు, ఇటు కేంద్ర ప్రభుత్వం పట్టువిడవడం లేదు. పంజాబ్, హరియాణాల మధ్యనున్న శంభు సరిహద్దు వద్ద వేలాదిగా రైతులు సంఘటితమయ్యారు. టిక్రి, సింఘు, కనౌరీ బోర్డర్ పాయింట్ల వద్దా అదే పరిస్థితి కనిపించింది. వారిని నిలువరించేందుకు మరింతగా బాష్పవాయుగోళాలు అవసరమని ఢిల్లీ పోలీసులు నిర్ధారించారు. 30,000 టియర్గ్యాస్ షెల్స్కు ఆర్డర్ పెట్టారు. గ్వాలియర్లోని బీఎస్ఎఫ్ టియర్స్మోక్ యూనిట్ వీటిని సరఫరా చేయనుంది. ఘాజీపూర్ సరిహద్దు వద్ద సైతం పోలీసులు మొహరించారు. చండీగఢ్లో రైతు సంఘాల నేతలు జగ్జీత్సింగ్ దల్లేవాల్, శర్వాణ్ సింగ్ పాంథెర్, ప్రభుత్వ ప్రతినిధులైన వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్, హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ మధ్య గురువారం రాత్రి మూడో దఫా చర్చలు మొదలయ్యాయి. చర్చల్లో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సైతం పాల్గొన్నారు. వాటిలో తేలిందనేది ఇంకా వెల్లడి కాలేదు. సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం)లో భాగమైన భారతీయ కిసాన్ యూనియన్ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా రైతులు నేడు గ్రామీణ భారత్ బంద్ను పాటించనున్నారు. ‘‘రైతులెవ్వరూ శుక్రవారం నుంచి పొలం పనులకు వెళ్లొద్దు. కారి్మకులు సైతం ఈ బంద్ను భాగస్వాములవుతున్నారు. ఈ రైతు ఉద్యమంలో ఎంతగా భారీ సంఖ్యలో జనం పాల్గొంటున్నారో ప్రభుత్వానికి అర్థమవుతుంది’’ అని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ అన్నారు. భారత్బంద్ నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు హరియాణాలోని నోయిడాలో కర్ఫ్యూ విధించారు. పలు జిల్లాల్లో 17వ తేదీ దాకా టెలికాం సేవలను నిలిపేస్తూ హరియాణా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతులు సైన్యంలా ఢిల్లీ ఆక్రమణకు వస్తున్నారంటూ బీజేపీ పాలిత హరియాణా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు పంజాబ్లోనూ శుక్రవారం దాకా ఇంటర్నెట్ సేవలను నిలిపేస్తున్నట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. పట్టాలపై బైఠాయింపు నిరసనల్లో భాగంగా గురువారం రైతులు రైల్ రోకో కూడా నిర్వహించారు. పంజాబ్, హరియాణా సరిహద్దుల్లో అతి పెద్దదైన రాజాపురా రైల్వే జంక్షన్ వద్ద వందలాది మంది రైతులు పట్టాలపై బైఠాయించారు. మధ్యా హ్నం నుంచి సాయంత్రం దాకా రైళ్ల రాకపోకలను అడ్డుకుని నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. చాలా రైళ్లను దారి మళ్లించగా కొన్నింటిని రద్దు చేశారు. -
అంబానీ ‘కొత్త’ అడుగు.. ఒకే దెబ్బకు మూడు పిట్టలు!
ముఖేష్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏ రంగంలోకి అడుగుపెట్టినా అనూహ్యమైన అడుగులతో ప్రత్యర్థి కంపెనీలకు చెక్ పెడుతుంది. టెలికం రంగంలోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే రిలయన్స్ జియో అగ్రగామిగా ఎదిగింది. ఇప్పుడు అదే జియో ఓటీటీ రంగంలోనూ టాప్ కంపెనీగా ఎదిగేందుకు వేగంగా పావులు కదుపుతోంది. ప్రస్తుతం రిలయన్స్ జియో వాల్ట్ డిస్నీని కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. నివేదికల ప్రకారం.. ఈ ఒప్పంద ప్రక్రియ వచ్చే జనవరి లేదా ఫిబ్రవరిలో పూర్తవుతుందని భావిస్తున్నారు. ఈ ఒప్పందం ప్రకారం భారతదేశంలో డిస్నీ హాట్స్టార్ మీడియా కార్యకలాపాలు రిలయన్స్కు దక్కుతాయి. ఈ డీల్ తర్వాత, ఉమ్మడి సంస్థలో రిలయన్స్ 51 శాతం, డిస్నీ హాట్స్టార్ 49 శాతం వాటాను కలిగి ఉంటాయి. ప్రత్యక్ష పోటీకి చెక్! జియోకు చెందిన ఓటీటీ ప్లాట్ఫామ్ జియో సినిమా.. డిస్నీ ప్లస్ హాట్స్టార్ నుంచి ప్రత్యక్ష పోటీని ఎదుర్కొంటోంది. మొదట జియో సినిమా.. డిస్నీ హాట్స్టార్ నుంచి ఐపీఎల్ హక్కులను దక్కించుకుంది. ఆ తర్వాత డిస్నీ హాట్స్టార్.. జియో సినిమా నుంచి ఆసియా కప్, క్రికెట్ ప్రపంచ కప్ హక్కులను చేజిక్కించుకుంది. ఇప్పుడు జియో ఏకంగా డిస్నీ హాట్స్టార్నే కొనుగోలు చేస్తోంది. జియో సినిమాతో పోటీలో ఈ కంపెనీ గణనీయమైన నష్టాలను చవిచూడటం గమనార్హం. ఐపీఎల్, ఫిఫా ప్రపంచ కప్ తర్వాత, హాట్స్టార్ సబ్స్క్రైబర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఆ రెండింటిలో టెన్షన్.. ఈ ఒప్పందం తర్వాత, జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్స్టార్ విలీనం కానున్నాయి. అంటే రెండు యాప్ల కంటెంట్ను ఒకే యాప్లో యాక్సెస్ చేయవచ్చు. ఇప్పటికే ఉన్న డిస్నీ ప్లస్ హాట్స్టార్ కస్టమర్లు జియో సినిమాకి మారతారు. ఈ పరిణామాలు ప్రముఖ ఓటీటీలైన నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్లలో టెన్షన్ను కలిగిస్తున్నాయి. ఎందుకంటే జియో సినిమా సరసమైన ప్లాన్లను అందించవచ్చు. టెలికాం, ఓటీటీ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని జియో రీఛార్జ్తో చవకైన యాడ్-ఆన్ ప్లాన్లను ప్రవేశపెట్టవచ్చు. అంటే ఒకే దెబ్బకు ముడు పిట్టలు అన్నమాట! ఇదీ చదవండి: ఈ విషయంలో అంబానీ కంపెనీ తర్వాతే ఏదైనా..! -
మతగురువు దారుణ హత్య.. పోలీసులపై గ్రామస్థుల ఆగ్రహం
పాట్నా: బిహార్లోని గోపాల్గంజ్ జిల్లాలో దారుణం జరిగింది. ఆరు రోజుల క్రితం కనిపించకుండా పోయిన మతగురువు స్థానికంగా శవమై కనిపించడం ఉద్రిక్తతలకు దారి తీసింది. పోలీసుల వైఫల్యంపై స్థానిక యువత ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసు వాహనానికి నిప్పంటించారు. మనోజ్ కుమార్ దనపుర్ గ్రామంలోని శివ దేవాలయంలో మతగురువుగా పనిచేస్తున్నారు. టెంపుల్కి పూజ కోసం వెళ్లిన మనోజ్ కుమార్.. గత ఆరు రోజులగా కనిపించకుండా పోయారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కానీ మనోజ్ కుమార్ను కనిపెట్టలేకపోయారు. చివరికి మనోజ్ కుమార్ స్థానిక పొదల్లో శవమైన కనిపించారు. ఆయన శరీరం నుంచి కళ్లను పెరికివేశారు. జననాంగాలను కోసేశారు దుండగులు. ఈ వార్త తెలవడంతో స్థానిక గ్రామస్థుల్లో ఆగ్రహం పెల్లుబికింది. దర్యాప్తు చేపట్టిన పోలీసుల వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనిపించిన పోలీసులపై రాళ్లు రువ్వారు. హైవేపై నిలిపి ఉంచిన పోలీసు వాహనానికి నిప్పంటించారు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తెచ్చామని జిల్లా పోలీసు అధికారి ప్రాంజల్ తెలిపారు. అయితే.. మనోజ్ కుమార్ సోదరుడు అశోక్ కుమార్ షా స్థానికంగా బీజేపీ డివిజినల్ ప్రెసిడెంట్గా ఉన్నారు. బయటకు వెళ్లిన మనోజ్ కుమార్ ఇంటికి వస్తాడనే నమ్మకం ఉండిందని భావించినట్లు మరో సోదరుడు సురేష్ షా తెలిపారు. మనోజ్ను ఎందుకు చంపారో? తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపడతామని పోలీసులు హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: పార్లమెంట్ అలజడి కేసులో వెలుగులోకి కీలక అంశాలు -
తెలంగాణ భవన్ లో టెన్షన్ టెన్షన్
-
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె తెలుగుదేశంలో గందరగోళం
-
హర్యానాలో మళ్లీ ఉద్రిక్తత
చండీగఢ్: హర్యానా నూహ్లో మళ్లీ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పిల్లలు జరిపిన రాళ్ల దాడుల్లో ఎనిమిది మంది మహిళలు గాయపడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గత జులైలో నూహ్లో రెండు వర్గాల మధ్య ఆందోళనలు జరిగిన తర్వాత తాజా ఘటన ఆందోళన కలిగిస్తోంది. నూహ్ ఎస్పీ నరేంద్ర బిజర్నియా తెలిపిన వివరాల ప్రకారం.. ఎనిమిది మహిళలు వెళ్తుండగా.. పిల్లలు వారిపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటన గురువారం రాత్రి 8:20 సమయంలో జరిగిందని తెలిపారు. ఈ ఘటనలో నిందితులను ఇప్పటికే గుర్తించినట్లు వెల్లడించారు. ఆందోళనలు చెలరేగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితులు తమ అదుపులోనే ఉన్నట్లు తెలిపారు. ఈ ఏడాది జులై 31న నూహ్ జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. విశ్వ హిందూ పరిషత్ యాత్ర చేపట్టిన నేపథ్యంలో అల్లరిమూకలు రాళ్లు విసిరారు. దీంతో భారీ స్థాయిలో ఆందోళనలు జరిగాయి. ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నిరసనలు పక్కనే ఉన్న గురుగ్రామ్, ఢిల్లీ ప్రాంతాలకు వ్యాపించాయి. ఇదీ చదవండి: కాంగ్రెస్ Vs బీజేపీ: చిన్న పార్టీలతోనే పెద్ద చిక్కు! -
టెన్త్ విద్యార్థులకు యూడైస్ టెన్షన్
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది పదవ తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు కొత్త చిక్కు వచ్చిపడేలా ఉంది. యూడైస్లో పేరు లేకుంటే పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఇవ్వకూడదని విద్యాశాఖ భావిస్తోంది. దీనివల్ల దాదాపు లక్ష మంది విద్యార్థులు పరీక్ష ఫీజు కట్టలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ పరిణామం విద్యార్థుల తల్లిదండ్రులను కలవర పెడుతుండగా.. ఇప్పటికిప్పుడు ఈ నిబంధన తేవడం సరికాదని ఉపాధ్యాయులూ అంటున్నారు. యూడైస్ అప్డేట్లో క్షేత్రస్థాయి సమస్యలు గుర్తించాలని సూచిస్తున్నారు. పాఠశాల విద్యా డైరెక్టరేట్ మాత్రం ఇవేవీ పట్టించుకునేందుకు సిద్ధంగా లేకపోవడం సమస్యకు దారి తీస్తోంది. ఈ నెల 28వ తేదీ నాటికి యూడైస్లో విద్యార్థులందరి పేర్లు చేర్చాలని విద్యాశాఖ ఆదేశించింది. అయితే గడువు ముగిసే నాటికి దాదాపు 45 శాతం మంది విద్యార్థుల పేర్లు ఎక్కించే అవకాశం లేకుండా పోయింది. ఈ ఏడాది టెన్త్ పరీక్షలు 5 లక్షల మంది రాసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పాత రికార్డు లేకుంటే అంతే... ఏకీకృత జిల్లా విద్యా సమాచార వ్యవస్థ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (యూడైస్)లో ప్రతి విద్యార్థి సమగ్ర వివరాలు చేర్చాలని విద్యాశాఖ నిర్ణయించింది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ విద్యార్థి ఎక్కడ చదివింది, వారి టీసీల వివరాలు ఇందులో పొందుపర్చాల్సి ఉంటుంది. విద్యార్థులకు ప్రభుత్వ పరంగా లభించే ప్రతి ప్రయోజనానికి (సంక్షేమ పథకం) యూడైస్నే ప్రామాణికంగా తీసుకోవాలన్నది విద్యాశాఖ ఆలోచన. అయితే విద్యాహక్కు చట్టం ప్రకారం 8వ తరగతి వరకూ విద్యార్థికి అంతకుముందు ఎక్కడ చదివిందీ తెలిపే ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (టీసీ)తో పనిలేదు. ఈ మేరకే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులను టీసీలు లేకున్నా 8వ తరగతిలో చేర్చుకున్నాయి. స్కూల్ ఫీజు చెల్లించని విద్యార్థులకు కొన్ని ప్రైవేటు స్కూళ్ళు టీసీలు ఇవ్వకుండా ఆపాయి. ఈ కారణంగా రాష్ట్రంలో చాలామంది విద్యార్థులు టీసీల్లేకుండానే ఇతర స్కూళ్ళల్లో చేరారు. ఇంతే కాకుండా చాలా స్కూళ్ళు కింది తరగతుల్లో అనుమతులు లేకుండానే విద్యార్థులను చేర్చుకున్నాయి. ఈ కారణంగానూ విద్యార్థుల వివరాలు లభించని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో యూడైస్ కోసం పాత రికార్డు ఎలా తేవాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. టెన్త్ విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దు యూడైస్ సాధ్యాసాధ్యాలను ఉన్నతా ధికారులు గుర్తించాలి. క్షేత్రస్థాయిలో ఎదుర య్యే సమస్యలను అర్థం చేసుకోవాలి. యూ డైస్లో పేరులేదని పరీక్ష ఫీజు కట్టించుకోని పరిస్థితి వస్తే, అనేకమంది టెన్త్ విద్యార్థులు ఇబ్బందులు పడతారు. పరీక్షలు దగ్గరప డుతున్న సమయంలో వారిని మానసికంగా దెబ్బతీయడం సరైన చర్య కాదు. – చావా రవి (టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) వెసులుబాటు ఇవ్వకపోతే ఇబ్బందులే విద్యార్థి 8 నుంచి ఒకే స్కూల్లో ఉన్నప్పుడు దాన్నే ప్రామాణికంగా తీసుకుని యూడైస్లో చేర్చే ఆప్షన్ ఇవ్వాలని ఉపాధ్యాయ వర్గాలు కోరుతున్నాయి. ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు ఇందులోని ఇబ్బందులను విద్యా శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాయి. అప్పటివరకూ తాము యూడైస్లో చేర్చే ప్రక్రియ పూర్తి చేయలేమంటున్నాయి. ఆన్లైన్ ఈ మేరకు సాంకేతిక వెసులుబాటును కల్పించాలని కోరుతున్నాయి. -
సుప్రీం ఏం చెబుతుందో!
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష రాసిన అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఏడాదిన్నర సన్నద్ధత అంతా వృథా అయిపోతుందా?, ఎన్నో ఆశలతో గ్రూప్–1 కొలువు కోసం చేసిన ప్రయత్నాలు మళ్లీ మొదటికి వస్తాయా? అనే ఆందోళన నెలకొంది. మొత్తం మీద రెండోసారి రాసిన పరీక్షను హైకోర్టు రద్దు చేయడమే ఇందుకు కారణం. ప్రశ్నపత్రాల కుంభకోణం నేపథ్యంలో తొలిసారి ప్రభుత్వం ఈ పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే. కాగా హైకోర్టు తాజా తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని నిర్ణయించిందనే సమాచారం ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఊరటనిస్తోంది. అప్పుడలా..ఇప్పుడిలా..! రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 503 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి గతేడాది ఏప్రిల్లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన కమిషన్ కేటగిరీల జాబితా తయారు చేసి 1:50 నిష్పత్తిలో మెయిన్కు అర్హుల జాబితాను ప్రకటించి పరీక్ష తేదీలు సైతం వెల్లడించింది. అయితే టీఎస్పీఎస్సీ కార్యాలయ పరిధిలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరులో ప్రశ్నపత్రాల కుంభకోణం వెలుగు చూసింది. కమిషన్ సిబ్బంది కొందరు వివిధ పరీక్షల ప్రశ్నపత్రాలు బయటకు లీక్ చేశారనే ఆరోపణలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసింది. సిట్ దర్యాప్తులో అక్రమాలు వెలుగు చూడడంతో టీఎస్పీఎస్సీ వరుసగా వివిధ పరీక్షలను రద్దు చేసింది. ఈ క్రమంలోనే గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షను సైతం రద్దు చేసింది. గత జూన్ 11వ తేదీన తిరిగి ప్రిలిమినరీ పరీక్షలను నిర్వహించింది. రెండోసారి పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరినీ అనుమతించింది. రెండోసారి 2,33,248 మంది అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్ష రాశారు. అయితే రెండోసారి నిర్వహించిన పరీక్షలను కమిషన్ అత్యంత లోపభూయిష్టంగా నిర్వహించిందంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి కమిషన్ నిర్లక్ష్యాన్ని తప్పుబట్టారు. పరీక్షను రద్దు చేస్తూ ఈనెల 23న తీర్పు ఇచ్చారు. దీంతో ఎంతకాలంగానే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. కాగా దీనిపై టీఎస్పీఎస్సీ అప్పీల్కు వెళ్లింది. పరీక్ష నిర్వహణలో టీఎస్పీఎస్సీ నిర్లక్ష్య వైఖరి వల్లే గందరగోళం నెలకొందంటూ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం సైతం స్పష్టం చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థిoచింది. దీంతో అభ్యర్థులు మరింత ఆవేదనకు గురయ్యారు. అయితే దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించినట్లు సమాచారం. మళ్లీ చిగురిస్తున్న ఆశలు హైకోర్టు తీర్పు తుది కాపీ రాగానే వచ్చేవారంలో టీఎస్పీఎస్సీ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది. దీంతో ఉద్యోగాల కోసం ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న అభ్యర్థుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. అయితే సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది, ఏ విధమైన తీర్పు వెలువడుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సర్వోన్నత న్యాయస్థానంలో రాష్ట్ర ప్రభుత్వం తన వాదనలు బలంగా విన్పించాలని, మళ్లీ పరీక్ష నిర్వహించే పరిస్థితి తలెత్తకుండా జాగ్రత్త వహించాలని అభ్యర్థులు కోరుతున్నారు. గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ, ఆ తర్వాత గాంధీ జయంతి నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వరుస సెలవులున్నాయి. కాగా సుప్రీంకోర్టు తీర్పుపైనే గ్రూప్–1 పరీక్ష భవితవ్యం ఆధారపడి ఉంది. ఇతర గ్రూప్ పరీక్షలు కూడా ఉన్న నేపథ్యంలో గ్రూప్–1 మళ్లీ నిర్వహణ ప్రభుత్వానికి కూడా సవాలుగానే మారే అవకాశం ఉంది. -
ఆర్టీసీ లో ‘ఆగస్టు’ టెన్షన్
ఆ 183 మంది ఆర్టీసీ ఉద్యోగులుగానే రిటైర్మెంట్ తీసుకుంటారా? ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అందే అన్ని రకాల బెనిఫిట్స్ పోయినట్టేనా ? ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమయ్యే ప్రక్రియ ఆలస్యమవుతున్న కొద్దీ వారిలో తీవ్ర ఆందోళన నెలకొంది. కోరుకున్న అవకాశం అందినట్టే అందిచేజారిపోతుందనే బాధ వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. సాక్షి, హైదరాబాద్: ఈ నెల నుంచే ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు చెల్లించేందుకు సిద్ధమని ఇటీవల ఆర్టీసీ చైర్మన్ స్వయంగా ప్రకటించారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్టీసీ ఉన్నతాధికారులూ వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగుల వివరాలు, వారు పనిచేస్తున్న విభాగాల వారీగా ఆర్థికశాఖకు వెళ్లాయి. జీతాలు చెల్లింపునకు అంతా సిద్ధమవుతోంది. కానీ, ఇప్పటి వరకు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్టుగా ప్రభుత్వ ఉత్తర్వు మాత్రం జారీ కాలేదు. ఏ తేదీ నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలో ఆ ఉత్తర్వులో పేర్కొనాల్సి ఉంది. ఆ తేదీ విషయంలో స్పష్టత లేకపోయేసరికి ఇప్పుడు ఆర్టీసీ లో గందరగోళం నెలకొంది. ఆగస్టు నెలాఖరుకు ఆర్టీసీలో 183 మంది పదవీ విరమణ పొందాల్సి ఉంది. రిటైర్మెంట్కు ఇంకా 13 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వ ఉత్తర్వు వెలువడకపోవటంతో తాము విలీన ప్రక్రియ కంటే ముందే విరమణ చేయాల్సి వస్తుందేమోనన్న టెన్షన్ వారిలో ఉంది. వాస్తవానికి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని గత నెల31నే మంత్రివర్గ సమావేశం తీర్మానించింది. దీంతో తాము కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పదవీ విరమణ చేయొచ్చని ఈ 183 మంది ఆశపడ్డారు. కానీ నెలాఖరు సమీపిస్తున్నా, అసలు తంతు మాత్రం ఇంకా పెండింగ్లో ఉండడంతో వారు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గవర్నర్ ఆమోదంలో జాప్యంతో..: ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి సంబంధించిన బిల్లును ఈ నెల 6వ తేదీన శాసనసభ ఆమోదించింది. ఆ వెంటనే బిల్లు గవర్నర్ ఆమోదానికి పంపిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు రాజ్భవన్ దానిపై ఆమోదముద్ర వేయలేదు. పది రోజులు దాటినా గవర్నర్ ఆమోదం లభించలేదు. దీంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయలేదు. తాజాగా ఆ బిల్లుపై సందేహాల నివృత్తికి న్యాయశాఖ కార్యదర్శి అభిప్రాయం కోసం పంపినట్టు రాజ్భవన్వర్గాలు అధికారికంగా ప్రకటన విడుదల చేశాయి. దీంతో బిల్లుపై గవర్నర్ సంతకం, ప్రభుత్వ ఉత్తర్వు జారీకి మరికొంత సమయంపట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ బెనిఫిట్స్ కోల్పోయినట్టేనా ? ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ పరిధిలోకి వస్తే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నుంచి సీనియర్ డిపో మేనేజర్ వరకు పెద్దగా ప్రయాజనం లేకున్నా, కిందిస్థాయి ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల్లో మంచి పెరుగుదల ఉంటుంది. గ్రాట్యూటీ, పీఎఫ్ మొత్తం కూడా పెరుగుతుంది. కొత్త పీఆర్సీ వస్తే జీతాలు పెరుగుదల మరింతగా ఉంటుంది. ఆర్టీసీలో ప్రస్తుతం ఉద్యోగ విరమణ వయసు 60 ఏళ్లుగా ఉండగా, ప్రభుత్వంలో అది 61 ఏళ్లుగా ఉంది. దీంతో ఒక సంవత్సరం ఎక్కువగా పనిచేసే వెసులుబాటు కలుగుతుంది. పెరిగిన జీతం 12 నెలల పాటు అందుకునే వీలు చిక్కుతుంది. ఉద్యోగ భద్రతకు భరోసా ఉంటుంది. -
Manipur Violence: ఆగని మణిపూర్ అల్లర్లు
ఇంఫాల్: మణిపూర్లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆదివారం చెలరేగిన హింసాకాండలో పదిహేను ఇళ్లు తగలబడ్డాయి. లంగోల్ గేమ్స్ విలేజ్లో అల్లరిమూక దాడులకు తెగబడి ఇళ్లను తగులబెట్టారు. దీంతో భద్రతా సిబ్బంది బాష్పవాయువుని ప్రయోగించి పరిస్థితుల్ని అదుపులోనికి తీసుకువచ్చారు. ఇంఫాల్ తూర్పు జిల్లాలోని చెకోన్ ప్రాంతంలో దుండగులు వాణిజ్య సముదాయాలను తగులబెట్టారు. మరోవైపు రాజకీయంగా ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ఎన్డీయేలో ఇన్నాళ్లూ భాగస్వామ్యపక్షంగా ఉన్న కుకీ పీపుల్స్ అలయెన్స్ బైరన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించింది. లూటీ చేసిన ఆయుధాలు వెనక్కి మణిపూర్లో అల్లరిమూకలు భారీగా లూటీ చేసిన ఆయుధాల్ని తిరిగి స్వా«దీనం చేసుకునే కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు లూటీ అయిన ఆయుధాల్లో 1,195 తిరిగి స్వా«దీనం చేసుకున్నట్టు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. మణిపూర్ లోయ ప్రాంతం జిల్లాల నుంచి 1,057 ఆయుధాలు , కొండ ప్రాంతం జిల్లాల నుంచి 138 ఆయుధాలు స్వా«దీనం చేసుకున్నారు. మరోవైపు ఐజీ ర్యాంకు అధికారి ఒకరు ఆయుధాగారాల లూటీకి సంబంధించి విచారణ జరుపుతున్నారు. అయిదుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన హేయమైన ఘటనలో అయిదురుగు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. ఆ ప్రాంతం పోలీసు స్టేషన్ ఇన్చార్జ్ సహా అయిదుగురు సిబ్బందిని దీనికి సంబంధించిన వీడియో బయటకి వచి్చన వెంటనే సస్పెండ్ చేసినట్టుగా పోలీసు ఉన్నతాధికారులు ఆదివారం వెల్లడించారు. ఒక వర్గం ప్రజలు వారి సస్పెన్షన్ని వెనక్కి తీసుకోవాలని ప్రతీరోజూ పోలీసు స్టేషన్ ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నా వెనక్కి తగ్గలేదని చెప్పారు. జంకుతున్న ఎమ్మెల్యేలు ఈ నెల 21 నుంచి మణిపూర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడానికి కుకీ వర్గానికి చెందిన అత్యధిక ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యే అవకాశం ఉంది. పార్టీలకతీతంగా ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీకి హాజరుకావడానికి విముఖతతో ఉన్నారు. జాతుల మధ్య ఘర్షణలు ఇంకా కొనసాగుతూ ఉండడంతో తమకి భద్రత లేదని వారు భయపడుతున్నారు. శాంతి భద్రతలు అదుపులో లేకపోవడం వల్ల తాము అసెంబ్లీకి హాజరు కావడం లేదని కుకి వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఎల్.ఎమ్ ఖాటే చెప్పారు. ఎమ్మెల్యేల ఇంఫాల్ ప్రయాణం సురక్షితం కాదని అన్నారు. -
మణిపూర్లో ఆయుధాల లూటీ
ఇంఫాల్: మణిపూర్లో తెగల పోరు, ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి పోలీసు ఆయుధాగారంపై దుండగులు దాడి జరిపి ఆయుధాలను లూటీ చేశారు. ఎకే 47, ఘాతక్ వంటి అత్యాధునిక రైఫిల్స్, వివిధ రకాల తుపాకుల్లోని 19 వేలకు పైగా బుల్లెట్లు అపహరించారు. బిష్ణుపూర్ జిల్లా నారన్సైనా ప్రాంతంలో రెండవ ఇండియా రిజర్వ్ బెటాలియన్లో ఈ లూటీ జరిగింది. ‘‘బెటాలియన్ కేంద్రంపై దాడులకు దిగిన అల్లరి మూకలు అత్యాధునిక ఆయుధాలను లూటీ చేశారు. ఏకే, ఘాతక్ రైఫిళ్లు, 195 సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్, అయిదు ఎంపీ–5 గన్స్, 16 9ఎంఎం పిస్టల్స్, 25 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, 21 కార్బైన్స్, 124 హ్యాండ్ గ్రేనేడ్స్ను దొంగిలించారు’’ అని అధికారులు తెలిపారు. మరోవైపు మే 3వ తేదీన జరిగిన ఘర్షణల్లో మరణించిన వారి సామూహిక ఖననానికి ఆదివాసీలు చేస్తున్న ప్రయత్నాలు ఉద్రిక్తతలకి దారి తీస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్న మరికొందరు ప్రదర్శనగా ఆ ప్రాంతానికి వెళ్లడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో 25 మందికిపైగా గాయపడ్డారు. దీంతో, అంతిమ సంస్కార కార్యక్రమాలను కేంద్రం వినతి మేరకు వారం పాటు వాయిదా వేసుకున్నారు. -
పల్నాడు ప్రాంతంలో పులి భయం
-
మళ్లీ హైకమిషన్ వద్ద ఉద్రిక్తత
లండన్: ఖలిస్తానీ మద్దతుదారుల దాడితో ఘటనకు కేంద్ర బిందువుగా మారిన లండన్లోని భారతీయ హైకమిషన్ వద్ద మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. ఆదివారం భారతీయ హైకమిషన్పై దాడికి తెగబడిన ఘటన మరువకముందే మళ్లీ దాదాపు 2,000 మందితో కూడిన ఆ వేర్పాటువాద మూక అదే భవంతి సమీపానికి చేరుకుంది. ఖలిస్తాన్ అనుకూల, భారత వ్యతిరేక నినాదాలు చేసిన వేర్పాటువాదులు వెంట తెచ్చుకున్న రంగులు వెదజల్లే చిన్న బాణసంచా, నీళ్ల సీసాలు, కొన్ని వస్తువులను హైకమిషన్ భవంతిపైకి విసిరారు. ఆదివారం నాటి దుశ్చర్యతో అప్రమత్తమైన లండన్ పాలనా యంత్రాంగం భారీ సంఖ్యలో పోలీసులను అంతకుముందే అక్కడ మొహరించడంతో వేర్పాటువాదుల భారీ దాడి యత్నాలు ఆచరణలో విఫలమయ్యాయి. అమృత్పాల్ అరెస్ట్కు కంకణం కట్టుకున్న పంజాబ్ పోలీసుల చర్యను నిరసిస్తూ ఫెడరేషన్ ఆఫ్ సిఖ్ ఆర్గనైజేషన్స్, సిఖ్ యూత్ జతేబందియా వంటి సంస్థలు ఉమ్మడిగా ‘నేషనల్ ప్రొటెస్ట్’ పేరిట బ్యానర్లు సిద్ధంచేసి భారతీయ హైకమిషన్ వద్ద దాడికి కుట్ర పన్నినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. నిరసనకారులను అదుపులోకి తీసుకుని తరలించేందుకు దాదాపు 20 బస్సులను పోలీసులు తెప్పించారు. అప్రమత్తతలో భాగంగా కొందరు పోలీసులను అక్కడి వీధుల్లో కవాతుచేశారు. ఖలిస్తానీవాదులు అక్కడికి రాగానే పంజాబ్లో మానవహక్కుల ఉల్లంఘన కొనసాగుతోందని ఇంగ్లిష్, పంజాబీ భాషల్లో మైకుల్లో భారత వ్యతిరేక ప్రసంగాలు ఇచ్చారు. నిరసనకారుల్లో చిన్నారులు, మహిళలూ ఉండటం గమనార్హం. భారత్ తమను వేర్పాటువాదులని, పాక్ ఐఎస్ఐతో కుమ్మక్కయ్యారని ప్రకటించడాన్ని తప్పుబడుతున్నారు. భారత్ హైకమిషన్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన ఖలిస్తానీ మద్దతుదారులు -
బెజవాడ సైకిల్కు టెన్షనెందుకు?
ఆ పసుపు నేత కాలం కలిసొచ్చి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. కానీ ఈ సారి ఆయన పరిస్థితి రివర్స్ అయిందక్కడ. జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో పచ్చ పార్టీ ఎమ్మెల్యేకి ముచ్చెమటలు పడుతున్నాయట. తనకంటే వయసులో చిన్నోడే అయినా... అధికారపార్టీ యువనేతను చూస్తేనే సైకిల్ పార్టీ నేతకు టెన్షన్ ఎక్కువవుతోందట. అందుకే కడుపు మంటను చల్లార్చుకునేందుకు నియోజకవర్గంలో గొడవలు సృష్టిస్తున్నాడు. ఏడాది ముందే వెన్నులో వణుకు ఎన్నికలు ఇంకా ఏడాదిన్నర ఉండగానే బెజవాడ టీడీపీ నేతల వెన్నులో వణుకు మొదలైంది. ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కి భవిష్యత్ గుర్తొచ్చి టెన్షన్ పెరుగుతోందట. ఒకప్పటి గన్నవరం ఎమ్మెల్యే గద్దే రామ్మెహన్ గత రెండు సార్లు విజయవాడ తూర్పు నుంచి విజయం సాధించారు. రెండు సార్లు గెలిచినప్పటికీ నియోజకవర్గం అభివృద్ధికి గద్దె చేసిందేమీ లేదు. దివంగత నేత దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ ప్రస్తుతం తూర్పు నియోజకవర్గానికి వైసీపీ పార్టీ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఏ పదవిలోనూ లేనప్పటికీ వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రతీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో నియోజకవర్గ ప్రజలకు బాగా చేరువయ్యారు. సీఎం జగన్ చొరవతో తూర్పు నియోజకవర్గంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు జరిగాయి. ముఖ్యంగా సీఎం హామీతో కృష్ణలంక వాసుల చిరకాలవాంఛ అయిన కృష్ణానదిలో రిటైనింగ్ వాల్ ను 130 కోట్ల రూపాయలతో పూర్తిచేయగలిగారు. నియోజకవర్గంలో చేస్తున్న కార్యక్రమాలతో అవినాష్ ముఖ్యమంత్రి జగన్ దృష్టిని ఆకర్షించారు. ఇటీవలే తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్ధిగా దేవినేని అవినాష్ ను ఖరారు చేశారు. డ్రామా పాలిట్రిక్స్ ఈ పరిణామాలతో టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ లో వణుకు మొదలైంది. ఇప్పటి వరకూ నియోజకవర్గానికి ఇంఛార్జి హోదాలోనే ఇంత అభివృద్ధి సాధిస్తే...అతన్నే అభ్యర్థిగా ప్రకటించడంతో ..ఇక తన మనుగడ కష్టమని గద్దె డిసైడైపోయారట. రాబోయే ఎన్నికల్లో తనకు పోటీగా దేవినేని అవినాష్ నిలబడితే తనకు డిపాజిట్లు రాననే భయంతో కుట్ర రాజకీయాలకు తెరతీశారు. వైసీపీ ప్రభుత్వానికి, దేవినేని అవినాష్ కు మంచి పేరు రావడాన్ని జీర్ణించుకోలేక కడుపుమంటతో గడప గడప కార్యక్రమంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారట. అందులో భాగంగానే 17వ డివిజన్ పరిధి రాణీగారితోట ప్రాంతంలో గడప గడప కార్యక్రమంలో దేవినేని అవినాష్ పాల్గొన్న సమయంలో ఓ టీడీపీ కార్యకర్తతో డ్రామా స్టార్ట్ చేశారు. కావాలనే తమ ఇంటికి అవినాష్ ను పిలిపించి తమకు పథకాలేవీ రావడం లేదంటూ నిలదీసే ప్రయత్నం చేశారు. ఐతే వారికి ఏమేమి పథకాలు వచ్చాయో లిస్ట్ చదివి చెప్పడంతో టీడీపీ మహిళా కార్యకర్తలు కిమ్మనకుండా ఉండిపోయారట. టీడీపీ నేత సంచలన నిర్ణయం.. పవన్ పోటీ చేస్తే త్యాగానికి సిద్ధం ముందు నాటకాలు.. తర్వాత గొడవలు తన పాచిక పారలేదని గ్రహించి తెల్లారేసరికి పథకం ప్రకారం మళ్లీ అదే టీడీపీ మహిళా కార్యకర్తలు స్థానిక వాలంటీర్ తో పాటు వైసీపీ మహిళలతో గొడవకు దిగారు. వారి కళ్లల్లో కారం కొట్టి... దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో ఒక్కసారిగా తూర్పు నియోజకవర్గంలో రాజకీయంగా వేడి రాజుకుంది. ఈ దాడిని తమకు అనుకూలంగా చేసుకోవాలని గద్దె వేసిన స్కెచ్ వర్కవుట్ కాలేదట. తన ప్లాన్ బెడిసిగొట్టడంతో పాటు తనకే రివర్స్ అవ్వడంతో గద్దె షాక్ లో ఉన్నారట. చదవండి: అమెరికాలో సంపాదించి.. ఆంధ్రాలో పోటీ చేయాలని..! పథకాలు రావట్లేదని గొడవ చేసిన టీడీపీ మహిళా కార్యకర్తలకు ప్రభుత్వం నుంచి ఏమేమి అందాయో ఆధారాలతో సహా దేవినేని అవినాష్ బయటపెట్టడంతో గద్దె రామ్మోహన్ ను సొంత పార్టీ వాళ్లే అసహ్యించుకుంటున్నారని టాక్. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే నాయకుడి పార్టీలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గద్దె రామ్మోహన్ రావుకు తెలిసింది ఇలాంటి చీప్ పాలిట్రిక్సేనా అని తల బాదుకుంటున్నారట స్థానిక పసుపు క్యాడర్. దేవినేని అవినాష్ చేస్తున్న గడప గడప కార్యక్రమంతో గద్దే రామ్మోహన్కు గుబులు మొదలైందనే టాక్ తెలుగుదేశం వర్గాల్లోనే మొదలైంది. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థుల సమావేశంలో ఉద్రిక్తత
పంజగుట్ట: పోలీస్ రిక్రూట్మెంట్లో కొత్తగా ప్రవేశపెట్టిన కఠిన నిబంధనలను తొలగించాలని డిమాండ్ చేస్తూ కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థులు సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అభ్యర్థులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఈ నెల 6న దున్నపోతులకు వినతిపత్రం, 7 కలెక్టరేట్ల ముందు ధర్నా, 9వ తేదీ చలో హైదరాబాద్ నిర్వహిద్దామని తీర్మానం చేసి కార్యాచరణ ప్రకారం వెళదామనగా కొందరు ప్రతిపాదించగా, మరికొందరు వ్యతిరేకిస్తూ సమస్యలు పరిష్కరించే వరకు ప్రెస్క్లబ్లోనే ఆమరణ నిరాహారదీక్షకు కుర్చున్నారు. పంజగుట్ట ఇన్స్పెక్టర్ హరిశ్చంద్రారెడ్డి ఎంత సముదాయించినా వినకపోవడంతో రాత్రి 7:30 గంటల సమ యంలో అభ్యర్థులను, వారికి మద్దతు పలికిన నేతలను అరెస్టు చేసి పోలీసుస్టేషన్కు తరలించారు. ఆ 7 ప్రశ్నలకు మార్కులు కలపాలని... పరుగుపందెంలో ఉత్తీర్ణత సాధించిన ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులందరికీ మెయిన్స్ పరీక్షకు అవకాశం కల్పించాలని, హైకోర్టు ఆదేశాల మేరకు 7 తప్పుడు ప్రశ్నలకు 7 మార్కులు కలపాలని, రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్పై చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తూ ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వీరికి మద్దతు పలికేందుకు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకురాలు విమలక్క, సీపీఐ, సీపీఎం నేతలు బాలమల్లేష్, నర్సింగ్రావు హాజరయ్యారు. కోదండరామ్ మాట్లాడుతూ ఆర్మీ సెలక్షన్స్లో కూడా లేని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని నిబంధనలు తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామకాల్లో పెట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. అభ్యర్థులు పాత పద్ధతిలోనే రిక్రూట్మెంట్ చేయమంటున్నారని అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు వివిధ విద్యార్ధి సంఘాల నేతలు కె.ధర్మేంద్ర, ఆనగంటి వెంకటేశ్, సలీంపాషా, డాక్టర్ వలీఖాద్రీ, కోట రమేశ్, అశోక్ రెడ్డి, రెహమాన్ పాల్గొన్నారు. -
గన్ షాట్: వాళ్లకు పెన్షన్.. వీళ్లకు టెన్షన్
-
వికారాబాద్ జిల్లా పరిగి సబ్ జైలు దగ్గర ఉద్రిక్తత
-
త్రివిక్రమ్ తో మహేష్ సినిమాపై బయపడుతున్న ఫ్యాన్స్
-
జడ్చర్ల నేతాజీ చౌరస్తాలో ఉద్రిక్తత
-
భైంసాలో టెన్షన్.. టెన్షన్..!
భెంసాటౌన్/ఆదిలాబాద్/హైదరాబాద్: నిర్మల్ జిల్లా భైంసా నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టే ఐదో విడత ప్రజాసంగ్రామయాత్రకు అనుమతి నిరాకరించినట్లు భైంసా ఏఎస్పీ కిరణ్ ఖారె తెలిపారు. భైంసాలో నిర్వహించే సభకు కూడా అనుమతి లేదని పేర్కొన్నారు. భైంసాలోని సున్నిత పరిస్థితుల దృష్ట్యా పాదయాత్రతోపాటు సభకు ఎస్పీ ప్రవీణ్కుమార్ అనుమతి నిరాకరించినట్లు వెల్లడించారు. ప్రజాసంగ్రామ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో బీజేపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. రెండు, మూడురోజులుగా ఎంపీ సోయం బాపురావు, ఇతర జిల్లాల నాయకులు భైంసాలోనే మకాం వేసి సభ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పార్డి(బి) బైపాస్ రోడ్లో జరిగే భారీ బహిరంగసభకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ పారీ్టకి రాజీనామా చేసిన డీసీసీ మాజీ అ«ధ్యక్షుడు రామారావు పటేల్ ఈ సభావేదికగానే బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఈ మేరకు పట్టణంలో భారీఫ్లెక్సీలతో విస్తృత ప్రచారం చేసుకున్నారు. బీజేపీ టికెట్ ఆశావహులు సైతం భైంసా రహదారులను ఫ్లెక్సీలతో కాషాయమయం చేశారు. ఈ నేపథ్యంలో బండి యాత్రకు అనుమతి నిరాకరించడంతో ఎప్పుడేం జరుగుతుందోననే టెన్షన్ నెలకొంది. ఎంఐఎంకు భయపడే: సోయం ఎంఐఎంకు భయపడే సంజయ్ యాత్రకు అనుమతి ఇవ్వట్లేదని ఎంపీ సోయం బాపురావ్ ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రజాసమస్యలను పరిష్కరించలేక బండి యాత్రను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని పేర్కొన్నారు. ‘న్యాయస్థానం తలుపు తడతాం. న్యాయస్థానం అనుమతి తీసుకుని యాత్ర కొనసాగిస్తాం’అని ప్రకటించారు. ‘సభావేదిక వేసేదాక చూసి, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దిగే హెలీప్యాడ్ను కూడా పరిశీలించిన పోలీసులు అకస్మాత్తుగా అనుమతి రద్దు చేయడం వెనుక సీఎం కేసీఆర్ ప్రోద్బలం ఉంది’అని పేర్కొన్నారు. యాత్రతో బీజేపీకి ప్రజాదరణ పెరుగుతుందని భయపడి, అనుమతులు నిరాకరిస్తున్నారని పేర్కొన్నారు. అడ్డుకోవడం పిరికిపంద చర్య: డీకే అరుణ సంజయ్ పాదయాత్రను అడ్డుకోవడం సీఎం కేసీఆర్ పిరికిపంద చర్యకు నిదర్శనమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. ప్రజల కోసం చేస్తున్న యాత్రగా కేసీఆర్ గ్రహించి అనుమతించాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రజల్లో టీఆర్ఎస్పై పెరుగుతున్న వ్యతిరేకతను తట్టుకోలేకనే బీజేపీని అడ్డుకుంటున్నారని విమర్శించారు. ‘మత ఘర్షణలు జరుగుతాయనే సాకుతో అడ్డుకోవడం సరికాదు. తెలంగాణ పోలీసులకు సత్తా ఉంటే యాత్రకు అనుమతివ్వాలి. బందోబస్తులో ఉండి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి.అయితేనే పోలీస్ వ్యవస్థకు మనుగడ ఉన్నట్లు’అని అరుణ పేర్కొన్నారు. భైంసా సభను అడ్డుకోవడం కుట్ర రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది: కె.లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని, బీజేపీ ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించ తలపెట్టిన భైంసా సభకు అనుమతి నిరాకరించడం సరికాదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్ మండిపడ్డారు. తెల్లారితే సభ ఉండగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను నిర్మల్ వెళ్లకుండా అడ్డుకోవడం ఏమిటని నిలదీశారు. భైంసా సభను అడ్డుకోవడం వెనుక కేసీఆర్ కుట్ర ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి కేసీఆర్కు భయం పట్టుకుందని, ఆయన ఎన్ని కుట్రలు చేసినా బీజేపీని ఆపలేరని పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా కల్వకుంట్ల కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. కేసీఆర్ తనకు తాను నయా నిజాం అనుకుంటున్నారని.. నిజాం మెడలు వంచినట్లే కేసీఆర్ నిరంకుశ పాలనకు అంతం పలికే రోజు దగ్గర్లోనే ఉందని వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: జగిత్యాలలో హై టెన్షన్.. బండి సంజయ్ మరోసారి అరెస్ట్
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement