-
అమ్మ ప్రేమను వర్ణించే మధురమైన పాటలు
ఈ సృష్టి మీదకు వచ్చిన ప్రతిఒక్కరూ పుట్టుకతోనే రుణపడి ఉండేది ఒక తల్లికి మాత్రమే! నవ మాసాలు మోసి.. పురిటినొప్పులు భరించిన ఆ తల్లికి ఏమిచ్చినా తక్కువే! బిడ్డ క్షేమారోగ్యాలే తన సిరిసంపదలుగా భావించే ఆ మాతృమూర్తి గొప్పదనాన్ని వర్ణించేందుకు మాటలు సరిపోవు. అందుకే కళాకారులు పాటల రూపంలో తనను పొగిడారు. పాటల రూపంలో తన స్వభావాన్ని, త్యాగాన్ని వర్ణించారు. నేడు (మే 12న) మదర్స్ డే సందర్భంగా కమ్మనైన అమ్మ పాటలను కొన్నింటిని కింద ఇచ్చాం.. విని ఆనందించండి..1. నాలో నిను చూసుకోగా.. 2. వంద దేవుళ్లే కలిసొచ్చినా.. 3. అమ్మా.. అమ్మా.. నే పసివాణ్నమ్మా.. 4. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా.. 5. సువ్వి సువ్వాలమ్మా.. 6. ఎదగరా.. ఎదగరా.. 7. అమ్మా అని కొత్తగా.. 8. అమ్మ 9. అమ్మనే అయ్యానురా.. 10. అమ్మా.. అమ్మా.. నీ వెన్నెల.. 11.. అమ్మా.. వినమ్మా.. 12. అమ్మా.. నన్ను మళ్లీ పెంచవా.. ఇవే కాకుండా ఇంకా ఎన్నో సినిమా పాటలు అమ్మ ప్రేమను కమ్మగా వినిపించాయి. సినీ సాంగ్సే కాకుండా.. సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ.. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో.. ఇలా ఎన్నో జానపద పాటలు సైతం తల్లి మమకార మాధుర్యాన్ని గుర్తు చేశాయి. -
మంగ్లీ పాట, విజయ్ దేవరకొండ డ్యాన్స్.. హోలీ స్పెషల్ సాంగ్స్ విన్నారా?
సంవత్సరంలో ఘనంగా జరుపుకునే పండుగలలో హోలీ పండుగ ఒకటి. వసంత రుతు శోభకు వర్ణమయంగా, సౌందర్యయుతంగా స్వాగతం పలికే రంగుల పండుగ- హోలీ! ఈ పండుగను సత్య యుగం నుంచి జరుగుతున్నట్లుగా హిందూ పురాణాలు తెలియజేస్తున్నాయి. హోళి అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. ఈ హోళిని హోలికా పూర్ణిమ అని కూడా అంటారు. చిన్నాపెద్ద తేడా లేకుండా రంగుల పండగలో మునిగితేలుతారు. అందరిలో ఆనందాన్ని ఇచ్చే రంగుల పండుగ హోలీ.. నేడు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, రంగు నీటిని విసురుకుంటూ తమ మధ్య ఉన్న అనుబంధాన్ని సరికొత్తగా చెబుతారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు కలిసి ఆనందంగా రంగుల పండుగ చేసుకుంటారు. హోలీ అంటనే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ జోష్ వస్తుంది. మన ప్రియమైన వారిని అదే రంగుల్లో నింపడం లాంటివి చెస్తూ ఎంతో ఆనందంగా గడుపుతుంటాం. ఇలాంటి సమయంలో అందరిలో జోష్ నింపే పాటులు తోడైతే.. ఆ సంతోషం డబుల్ అవుతుంది. చాలా సినిమాల్లో హోలీ ఆధారంగా ఎన్నో పాటలు వచ్చాయి. వాటిలో కొన్ని పండుగ వైభవాన్ని చెబితే మరికొన్ని రంగుల జోష్ను నింపాయి. మీ ఇంట జరిగే హోలీకి ఈ పాటలను కూడా జత చేయండి. నాయకుడు: 1987లో మణిరత్నం దర్శకత్వంలో కమల్ హీరోగా వచ్చిన ‘నాయకుడు’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.. అందులో ‘సందెపొద్దు మేఘం పూలజల్లు కురిసెను నేడు’ అనే పాట ఎప్పటికీ ఎవర్గ్రీన్ అని చెప్పవచ్చు. రాఖీ: ఎన్టీఆర్, ఇలియానా జోడీగా నటించిన సినిమా రాఖీ. ఇందులో 'రంగు రబ్బా రబ్బా అంటోంది రంగ్ బర్సే' అంటూ హోలీ సాంగ్తో తారక్ దుమ్మురేపాడు. అందులో తన డ్యాన్స్తో హోలీ సంతోషాన్ని డబుల్ చేశాడు. ప్రతి హోలీ కార్యక్రమంలో ఈ పాట ఉండాల్సిందే. జెమిని: వెంకటేశ్- నమిత జోడీగా నటించి మెప్పించిన సినిమా ‘జెమిని’. ఈ చిత్రంలో ‘దిల్ దివానా.. మై హసీనా..’ పాట నేపథ్యం కూడా హోలీ పండుగ చుట్టే ఉంటుంది. 2017లో హోలీ పండగను మత సామరస్యాలకు అతీతంగా జరుపుకోవాలన్న సందేశాన్ని ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఒక పాటను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేసింది. అందులో విజయ్ దేవరకొండ నటిస్తే.. ఆ థీమ్ను వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేశారు. మాస్: నాగార్జున హీరోగా వచ్చిన మాస్ సినిమాలోని ‘రంగు తీసి కొట్టు’ సాంగ్ ఎవర్గ్రీన్ హోలీ పాటగా నిలిచింది. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ పాట సినిమాకే హైలెట్గా నిలిచింది. 2019లో మంగ్లీ హోలీ నేపథ్యంలో ఓ పాటను ఆలపించింది. ‘ఖతర్నాక్ కలర్ జల్లురా’ అనే సాగే ఈ పాటలో పల్లెల్లో హోలీని ఎంత సంతోషంగా జరుపుకుంటారో చక్కగా చూపించారు. రెండేళ్ల క్రితం హోలీ పండుగకు యాంకర్ వర్షిణీ ప్రత్యేకంగా రూపొందించిన సాంగ్లో తన డ్యాన్స్తో దుమ్మురేపింది. ఈ పాట ద్వారా మధుప్రియ తన గాత్రంతో ఆకట్టుకుంది. సిల్సిలా : బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ నటించిన 'సిల్సిలా' సినిమాలో రంగ్ బర్సే బీగీ చునర్వాలీ అనే పాట దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. ఈ పాటకు అప్పడు, ఇప్పుడు అనే తేడా ఉండదు. పాట వింటే చాలు డ్యాన్స్తో ఊగిపోతారు. -
కొత్త టాలెంట్ను బయటకు తీసిన విజయ్సేతుపతి
స్టార్ హీరోలు పాటలు పాడడం పరిపాటిగా మారింది. కోలీవుడ్లో కమలహాసన్, విజయ్, శింబు, ధనుష్ వంటి వారు పాడిన పాటలు ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందాయి. కాగా తాజాగా మరో మల్టీ టాలెంటెండ్ హీరో విజయ్సేతుపతి కూడా పాడడం మొదలెట్టారు. ఈయన 'కరా' అనే తమిళ చిత్రంలో ఓ పాట పాడారు. మాస్టర్ మహేంద్రన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కరా. దీని విశేషం ఏమిటంటే మొసలి ఇతి వృత్తంతో రూ పొందడం. ఈ చిత్రం ద్వారా నటి సాహిబా బాసిన్ నాయకిగా పరిచయం అవుతున్నారు. నటుడు జీవా ప్రతినాయకుడిగా నటిస్తున్న ఇందులో మొట్టై రాజేంద్రన్, సేలం వేంగై కె.అయ్యనార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని భవానీ ఎంటర్ప్రైజస్ పతాకంపై రాజేంద్రకుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా అవతార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అచ్చు రాజామణి సంగీతాన్ని, గీరీశన్ ఏజీఏ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ మొసలి తమిళ పేరు కరా అని చెప్పారు. ఈ చిత్రం కోసం నటుడు విజయ్సేతుపతి పాడిన కాదల్ కుమారు వైరల్ ఆనారు అనే పాటను ఇటీవల విడుదల చేయగా అది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ట్రేండింగ్ అవుతోందని చెప్పారు. చిన్న పిల్లల నుంచి వయసు మళ్లిన వారు వరకూ ఆనందించే మంచి జనరంజకమైన కథా చిత్రంగా ఇది ఉంటుందన్నారు. ఈ చిత్రం సమ్మర్ స్పెషల్గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. -
Pankaj Udhas: గజల్ గంధర్వుడు
‘ముజ్ కో యారో మాఫ్ కర్నా, మై నషేమే హూ’ ‘థోడి థోడి పియా కరో’ ‘షరాబ్ చీజ్ హి ఐసీ’ ‘సబ్కో మాలూమ్ హై మై షరాబీ నహీ’ ‘చాందీ జైసా రంగ్ హై తేరా’ ‘కభీ సాయా హై కభీ ధూప్’ ‘దివారోంసే మిల్ కర్ రోనా అచ్ఛా లగ్తా హై’ ‘ఆయియే బారిషోం కా మౌసం హై’... ఒక్కటా రెండా పంకజ్ ఉధాస్ పేరు వినడగానే ఈ పేరుతో పాటు వినిపించే అమృత గుళికల్లాంటి గజల్స్, పాటలు ఎన్నో ఎన్నెన్నో. గజల్స్ను ఎప్పుడూ వినే వాళ్లతో పాటు, ఎప్పుడూ వినని వాళ్లను కూడా తన అభిమానులుగా చేసుకున్నాడు గజల్ మేస్ట్రో పంకజ్ ఉధాస్. ఎప్పుడూ వినని వాళ్లు ఆయన గొంతు నుంచి ఒక్కసారి గజల్ వింటే మంత్రముగ్ధులయ్యే వారు. మళ్లీ మళ్లీ వినాలని తపించేవారు. ‘ఆహత్’ ఆల్బమ్తో ఆనందాశ్చర్యాలకు గురి చేసిన పంకజ్ గజల్ ప్రపంచంలో అజరామరమైన కీర్తిని సొంతం చేసుకున్నారు. సోమవారం ఆయన భౌతికంగా దూరమైనా ప్రతి శ్రోతలో, అభిమానిలో సజీవంగా నిలిచే ఉంటాడు. గుజరాత్లోని జెట్పూర్లో పుట్టిన పంకజ్ ముగ్గురు అన్నదమ్ములలో చిన్నవాడు. అన్న నిర్మల్ ఉధాస్తో ఆ ఇంట్లో గజల్ గజ్జె కట్టింది. మరో అన్న మన్హర్ ఉధాస్ బాలీవుడ్లో కొన్ని సినిమాలకు పాడాడు. తండ్రి కేశుభాయిదాస్ ప్రభుత్వ ఉద్యోగి. వైణికుడు. ప్రసిద్ధ వైణికుడు అబ్దుల్ కరీమ్ ఖాన్ దగ్గర దిల్రుబా నేర్చుకున్నాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ ఇల్లు ఒక సంగీత పాఠశాలలాగ ఉండేది. వన్స్ అపాన్ ఎ టైమ్ బ్లాక్ అండ్ వైట్ చిత్రాల పాటల నుంచి గజల్స్ వరకు ఆ ఇంట్లో ఎన్నో వినిపించేవి. రాగాలు, స్వరఝరుల గురించి చర్చ జరిగేది. తనకు ఏమాత్రం సమయం దొరికినా పంకజ్ తండ్రి దిల్రుబా వాయించేవాడు. దిల్రుబా నుంచి వచ్చే సుమధుర శబ్దతరంగాలు పంకజ్ను సంగీతం వైపు నడిపించాయి. ‘చక్కగా స్కూలు పాఠాలు చదువుకోకుండా ఈ సంగీత పాఠాలు నీకు ఎందుకు నాయనా’ అని తండ్రి మందలించి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదీ తెలియదుగానీ గజల్స్ గురించి, దిల్రుబాపై వినిపించే రాగాల గురించి సందేహాలు అడిగినప్పుడు కుమారుడి సంగీతోత్సాహానికి ఆ తండ్రి మురిసిపోయేవాడు. ఒక్క సందేహం అడిగితే మూడు సమాధానాలు చెప్పేవాడు. అంతేకాదు ముగ్గురు కుమారులను రాజ్కోట్(గుజరాత్)లోని‘సంగీత్ అకాడమీ’ లో చేర్పించాడు. ఆ కళాశాలలో తబాలా వాయించడం నేర్చుకున్న పంకజ్ గులామ్ ఖదీర్ ఖాన్ సాహెబ్ దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాడు. డిగ్రీ కోసం ముంబైలోని సెయింట్ జేవియర్ కాలేజీలో చేరిన పంకజ్ ‘క్లాస్లో సైన్స్ పాఠాలు’ కాలేజీ తరువాత శాస్త్రీయ సంగీత పాఠాలపై శ్రద్ధ పెట్టేవాడు. తొలిసారిగా ‘కామ్నా’ (1972) అనే సినిమాలో పాడాడు పంకజ్. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ గాయకుడిగా పంకజ్కు మంచి పేరు వచ్చింది. అయితే ఈ మంచి పేరు తనకు వెంటనే మరో అవకాశాన్ని తీసుకు రాలేదు. ‘ఇది కూడా మంచికే జరిగింది. పంకజ్కు బోలెడు అవకాశాలు వచ్చి ఉంటే తనకు అత్యంత ఇష్టమైన గజల్స్కు అనివార్యంగా దూరం కావాల్సి వచ్చేది’ అంటారు పంకజ్ అభిమానులు. అవకాశాల సంగతి ఎలా ఉన్నా పంకజ్లో గజల్స్పై ఆసక్తి అంతకంతకూ పెరుగుతూనే పోయింది. ‘ఉద్యోగం చెయ్ లేదా వ్యాపారం చెయ్’ లాంటి సలహాలు అదేపనిగా వినిపిస్తున్న కాలంలో ఒక అద్భుత అవకాశం తనను వెదుక్కుంటూ వచ్చింది. అమెరికా, కెనడాలలో పది నెలల పాటు ఉన్న పంకజ్ అక్కడ ఎన్నో గజల్ కచేరీలు చేశాడు. ‘వాహ్వా వాహ్వాల’తో కూడిన ప్రేక్షకుల చప్పట్లు అతడి ప్రతిభను ప్రశంసించే సర్టిఫికెట్లు అయ్యాయి. ఇండియాకు డబ్బులతో కాదు ఉత్సాహంతో... ఆత్మవిశ్వాసంతో వచ్చాడు. ‘గజల్స్’ కోసమే ఉర్దూ నేర్చుకున్నాడు పంకజ్. గజల్స్ గానంలో మరింత పట్టు సాధించాడు. పంకజ్ ఉధాస్ అనే శబ్దం వినబడగానే ‘గజల్’ అనేది అతడి పేరు ముందు వచ్చి మెరిసేది. 1980లో తొలి గజల్ ఆల్బమ్ ‘ఆహత్’ను తీసుకువచ్చాడు. ఈ గజల్ ఆల్బమ్ తనకు తీసుకు వచ్చిన పేరు అంతా ఇంతా కాదు. పదేళ్ల పోరాటం తరువాత పంకజ్ తొలి ఆల్బమ్ అనూహ్యమైన విజయం సాధించింది. ఇక అప్పటి నుంచి 50 వరకు ఆల్బమ్లను తీసుకువచ్చాడు. మ్యూజిక్ ఇండియా 1987లో లాంచ్ చేసిన పంకజ్ ‘షా గుఫ్తా’ మన దేశంలో కంపాక్ట్ డిస్క్పై రిలీజ్ అయిన తొలి ఆల్బమ్. ఇక సినిమాల విషయానికి వస్తే ‘ఘాయల్’ సినిమా కోసం 1990లో లతా మంగేష్కర్తో కలిసి మెలోడియస్ డ్యూయెట్ పాడాడు. ఇక ‘నామ్’ సినిమాలో ‘చిఠ్ఠీ ఆయీ హై’ పాట ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ పాట సూపర్ హిట్ అయిన తరువాత అవకాశాలు వెల్లువెత్తాయి. అయితే అవకాశాన్ని సొమ్ము చేసుకోవాలని పంకజ్ ఎప్పుడూ అనుకోలేదు. ఆచితూచి నిర్ణయం తీసుకునేవాడు. రాశి కంటే వాసికి ప్రాధాన్యత ఇచ్చాడు. బహుశా ఇలాంటి విలువలే సంగీత చరిత్రలో అతడికి సమున్నత స్థానం ఇచ్చాయి. సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ కోసం ‘ఆదాబ్ అర్జ్ హై’ టాలెంట్ హంట్ ప్రోగ్రామ్ను నిర్వహించాడు పంకజ్. సినిమా కోసం పాడినా, నటించినా, టీవీ షోలు నిర్వహించినా గజల్స్పై తనకు ఉన్న ప్రత్యేక ప్రేమను ఎప్పుడూ కాపాడుకునేవాడు పంకజ్. అందుకే గజల్స్ను ప్రేమించే వాళ్ల మదిలో చిరస్థాయిగా, ఇంకో వందేళ్ళయినా సజీవంగానే ఉంటాడు. పంకజ్ ఫేవరెట్ సాంగ్ రేడియోలో వినిపించే బేగం అఖ్తర్ గానామృతానికి చాలా చిన్న వయసులోనే ఫిదా అయ్యాడు పంకజ్. ‘ఆమెది ఒక వినూత్న స్వరం’ అంటాడు. భావాలు, భావోద్వేగాలు పాటలో ఎలా పలికించాలో ఆమె గొంతు వినే నేర్చుకున్నాడు. ‘యే మొహబ్బత్ తేరే అంజామ్ సే’ తనకు ఇష్టమైన పాట. ఎప్పుడు వినాలనిపించినా వినేవాడు. పద్దెనిమిది సంవత్పరాల వయసులో పంకజ్కు ప్రసిద్ధ గజల్ గాయకుడు మెహదీ హాసన్తో పరిచయం అయింది. చాలాకాలానికి యూకే టూర్లో స్నేహితుడి ఇంట్లో హాసన్ను కలుసుకున్నాడు. పంకజ్ గానప్రతిభకు కితాబు ఇచ్చాడు హాసన్. ఈ కితాబు కంటే హాసన్తో కలిసి పర్యటించడం, అతడి గొంతును గంటల తరబడి వినడాన్ని బాగా ఎంజాయ్ చేసేవాడు పంకజ్. అదర్ సైడ్ హీరో జాన్ అబ్రహం పంకజ్కు వీరాభిమాని. విద్యాబాలన్, జాన్ అబ్రహమ్, సమీరా రెడ్డిలాంటి వారికి తన మ్యూజిక్ వీడియోలతో బ్రేక్ ఇచ్చాడు పంకజ్. ఎప్పుడూ సంగీత ప్రపంచంలో తేలియాడినట్లు కనిపించే పంకజ్కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. స్కూల్, కాలేజీలలో బాగా ఆడేవాడు. పంకజ్ ఫేవరెట్ బౌలర్ బీఎస్ చంద్రశేఖర్. సంగీతం తప్ప ఏమీ తెలియనట్లు ఉండే పంకజ్ మ్యాచ్లకు సంబంధించి చేసే విశ్లేషణ ఆకట్టుకునేది. ‘మీరు క్రికెట్ వ్యాఖ్యాతగా బ్రహ్మాండంగా రాణించవచ్చు’ అని సరదాగా అనేవారు సన్నిహితులు. పంకజ్ను చూసీచూడగానే అంతర్ముఖుడు(ఇంట్రావర్ట్) అని అనిపిస్తుంది అయితే ఆయన చాలా సరదా మనిషి అని, చుట్టు పక్కల వాళ్లను తెగ నవ్విస్తారని చెబుతుంటారు సన్నిహితులు. డాక్టర్ కావాలనేది పంకజ్ చిన్నప్పటి కల. అయితే సంగీతం అతడిని వేరే దారిలోకి తీసుకువెళ్లింది. డాక్టర్ కాకపోయినా ఆయన పాడే గజల్స్ ఔషధాలలాగే పనిచేసి మనసుకు స్వస్థతను చేకూరుస్తాయి. ముక్కు సూటి మనిషి సినిమా రంగంలో అవకాశాలు రావాలంటే ‘నిక్కచ్చిగా మాట్లాడే ధోరణి’ ఉండకూడదు అంటారు. అయితే పంకజ్ మాత్రం ‘నొప్పించక తానొవ్వక’ అన్నట్లుగా ఎప్పుడూ ఉండేవాడు కాదు. తన మనసులోని మాటను కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేవాడు. బాలీవుడ్ మ్యూజిక్ ప్రస్తావన వస్తే.... ‘మ్యూజిక్ ఇండస్ట్రీ పూర్తిగా మారిపోయింది. నాన్–ఫిల్మ్ మ్యూజిక్ను పట్టించుకోవడం లేదు. సర్వం బాలీవుడ్ అన్నట్లుగా ఉంది. బాలీవుడ్లో తొంభై శాతం మ్యూజిక్ హిప్ హాప్, పంజాబీ, ర్యాప్. ఆర్డీ బర్మన్ క్లాసిక్స్లాంటివి ఇప్పడు వినే పరిస్థితి లేదు. పాటలు స్క్రీన్ప్లేలో భాగంగా ఉండడం లేదు. సినిమాను ప్రమోట్ చేయడానికి అన్నట్లుగా ఉంటున్నాయి. బాలీవుడ్లోని ఒకప్పటి స్వర్ణ శకం తిరిగి రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. బాలీవుడ్ గాయకుల్లో పాప్ సంగీత నేపథ్యం నుంచి వచ్చిన వారే ఎక్కువ. ఖవ్వాలి ఎవ్వరికీ పట్టని కళ అయింది’ అని నిట్టూర్చేవాడు పంకజ్. -
పాటకు పట్టం
‘పాట’ అనే మాటలో ఎన్ని ఉద్వేగాల ఊటలో! ఎన్ని ఉద్రేకాల తంత్రులో! ఎగిసిపడి ఎదను రసప్లావితం చేసే ఎన్నెన్ని పారవశ్యాల జలయంత్రాలో! ప్రతి రాత్రీ వసంతరాత్రిగా, ప్రతి గాలీ పైరగాలిగా, బతుకంతా పాటలా సాగాలంటాడు ఒక కవి. ఏదో ఒక పాట వింటూనే జీవితం గడుపుతాం. చెవులను, మనసును తాకి హాయి గొలిపే పాటల తుంపరలలో తడుస్తూనే జీవన రహదారిలో సాగుతాం. మరి, బతుకే పాటైన మేటి పాటగాళ్ళ సంగతేమిటి! కాలికి గజ్జె కట్టి బుజాన కంబళి వేసుకుని జీవితమే ఆటగా, పాటగా గడిపిన గద్దర్లు; పాటల వియద్గంగలో జీవితాంతం మునకలేసిన వంగపండులు, పలుకే పాటై జీవనదిలా ప్రవహించే అందెశ్రీలు, పాటను పుక్కిటపట్టి రాగమే జీవనరాగంగా బతుకును పండించుకుంటున్న గోరటి వెంకన్నలు... చెప్పుకుంటూ వెడితే ఒకరా ఇద్దరా! ఆపైన, సినీగీతాన్ని వినీలాకాశానికెత్తిన కృష్ణశాస్త్రులు, శ్రీశ్రీలు, ఆత్రేయలు, సినారేలు, ఆరుద్రలు, వేటూరులు..! పేరుకు పాటైనా తీరులు ఎన్నో! కొన్ని పాటలు జాతి మొత్తంలో ఉత్తేజపు విద్యుత్తును నింపి ఉద్వేగాల అంచుల వైపు నడిపిస్తాయి. జనగణమన లాంటి అలాంటివి జనరంజకమై జాతి గళమెత్తి పాడుకునే గీతాలు అవుతాయి. తెలంగాణ ఉద్యమంతోపాటు ఉవ్వెత్తున ఎగసిన ఉద్రేకపు పొంగు పాటగా మారి అందెశ్రీ ఆలపించిన ‘జయజయహే తెలంగాణ’ గీతానికి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రగీతం ప్రతిపత్తిని ఇచ్చి తనను తాను గౌరవించుకుంది. పాటలో పలికించలేని రసమే లేదు. ప్రజోద్యమాల అగ్నిశిఖలలోంచి నిప్పురవ్వల్లా పుట్టుకొచ్చిన పాటే ప్రేయసీప్రియుల యుగళగీతంగా మారి మోహరాగాలతో విరితావులనీనగలదు. ‘నీవే నేనుగా ఒకటైన చోట’ ‘వలపుల పూదోట’ పూయించగలదు. మనిషైతే మనసుంటే కనులు కరగాలని, కరుణ కురియా లని, జగతి నిండాలని ప్రబోధిస్తూ; ప్రకృతి సమస్తంలో ఇమిడి ఉన్న కారుణ్యాన్ని జాలిజాలిగా కరిగే నీలిమేఘం మీదుగా రూపుగట్టి మనల్ని నిలువునా కదిలించి కరిగించగలదు. తూరుపు సిందూరపు మందారపు వన్నెలలోని ఉదయరాగానికి చూపుల్ని, హృదయగానానికి చెవుల్ని అప్ప జెబుతూనే కాలగర్భం లోలోతులకు వెళ్లి వేనవేల వత్సరాల కేళిలో మానవుడుదయించిన శుభ వేళను – మలయ మారుతాలతో, పుడమి పలుకు స్వాగతాలతో, తారకలే మాలికలై మలచిన కాంతితోరణాలతో ఉత్సవీకరించి మన కళ్ళముందు నిలపగలదు. ‘చిరునవ్వు వెన్నెల్లు చిలికేటి వాడా, అరుదైన చిరుముద్దు అరువియ్య రారా’ అంటూ; ‘అల్లారు ముద్దుకదే, అపరంజి ముద్ద కదే... ఒంటరి బతుకైనా ఓపగలుగు తీపికదే’ అంటూ పాట లాలిగా జోలగా మారి వాత్సల్య రసంలో ఓలలాడించగలదు. పాటను కైకట్టిన ఆదికవి ‘అమ్మ’ అంటారు అందెశ్రీ. నేల పొరలను చీల్చుకుని విత్తనం రెండు ముక్కలుగా పగిలి మొలకెత్తినట్లుగా ప్రకృతిమాత పొత్తిళ్ళల్లో కవలశిశువులుగా ప్రాణి పుట్టుక, పాట పుట్టుక అంటూ పాటను సృష్ట్యాదిన ప్రతిష్ఠిస్తారు. గగనాంతరసీమ గానసమూహమై పాటందుకుంటే, నేల రంగస్థలమై ఆటందుకుందంటారు. ప్రకృతి పురుషులు కేళీవిలాసాల్లో తేలుతున్న వేళ జంతుధ్వనుల నుంచి పుట్టిన సప్తస్వరాల అన్వయింపే ఏ పాట అయినా అంటూ పాటల భిన్నత్వంలోనే ఏకత్వాన్ని రూపిస్తారు. పురామానవ పరిణామ కోణం నుంచి గ్రీకు సాహిత్యాన్ని, ఇతర యూరోపియన్ భాషల సాహిత్యంతో బేరీజు వేస్తూ చర్చించిన జార్జి థామ్సన్ అనే పండి తుడు కూడా విచిత్రంగా ఇలాగే పాటను సాహిత్యపు ఆదిమదశలో నిలుపుతాడు. ఆధునిక ఇంగ్లీష్ కవిత్వానికి భిన్నంగా గ్రీకు కవిత్వం పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. గ్రీకు మహాకవి హోమర్ కవిత్వం మన వాల్మీకి రామాయణంలానే తంత్రీలయ సమన్వితంగా ఉంటుంది. వ్యాసభారతం కూడా వాగ్రూపంలో విస్తరించి చివరికి లిఖితరూపం పొందినదే. అలా చూసినప్పుడు నేటి మన పాటకవులందరూ వ్యాసవాల్మీకి పరంపరలోకే వస్తారు. లిఖితరూపంలోకి వచ్చాక కవిత్వం కాళి దాసాదులతో భిన్నమైన మలుపు తిరిగింది. తెలుగులో ఆధునిక కవిత్వం ఆదిలో పాటకు ప్రతిరూపంగా ఎలా వెలువడిందో వివరిస్తూ, అనంతరకాలంలో తెలుగునాట పాటకు ప్రచురణార్హత, కవితకు శ్రవ్యార్హత లేకుండా చేశారని అంబటి సురేంద్రరాజు ఆవేదన వ్యక్తం చేస్తారు. కంటితో చదవడం కన్నా, చెవితో వినడమే కవితకు స్వాభావికమంటాడు. నిన్నమొన్నటి వరకు ఐరిష్ కవిత్వం ప్రధానంగా ఆశుసంప్రదాయాన్నే అనుసరించిందని జార్జి థామ్సన్ కూడా చెబుతూ; మొదట అచ్చులో చదివిన కొన్ని ఐరిష్ కవితలను ఆ తర్వాత ఒక రైతుగాయకుని నోట వినడం తనకు అపూర్వమైన అనుభవంగా వర్ణిస్తాడు. నిరక్షరాస్యులైన ఐరిష్ గ్రామీణుల పెదాలపై కవిత్వం నర్తిస్తూ ఉంటుందని, వారు మాట్లాడే మామూలు మాటలు కూడా కవితాత్మకంగా మారిపోతాయని అంటాడు. సామూహిక శ్రమలో భాగంగా పుట్టిన వాక్కు కవితాత్మకంగా మారి శ్రమకు చోదకంగా మారిందనీ, ఆదిమ కాలంలో పనిలో భాగంగా పాట పుట్టింది తప్ప కేవలం తీరిక సమయాల్లో పాడుకునేందుకు కాదంటాడు. పూర్తిగా లిఖిత సంప్రదాయంలో పెరిగిన కవిత్వం ఆలోచనామృతం కావచ్చు కానీ, సద్యస్పందన కలిగించే పాట ఆలోచనామృతమే కాక ఆపాతమధురం కూడా. ప్రజాక్షేత్రంలో, ప్రజలే ప్రభువులుగా ఉన్న ప్రజాస్వామ్యంలో సామాన్యజనం సహా అందరినీ ఉర్రూతలూగించే పాటకు పట్టం కట్టడం ఎంతైనా సముచితమూ, స్వాగతార్హమూ. పాట కవులందరికీ కోటిదండాలు. -
టాప్ టెన్ మోస్ట్ పాపులర్ కె-పాప్ గ్రూప్స్ (ఫోటోలు)
-
‘ఓల్డ్ బట్ గోల్డ్’ యూట్యూబ్ చానల్తో.. షోమ్ మ్యూజికల్ జర్నీ..
'షహన షోమ్' మ్యూజికల్ జర్నీ తన అధికార యూట్యూబ్ చానల్ ‘వోల్డ్ బట్ గోల్డ్’తో మొదలైంది. దీని ద్వారా బాలీవుడ్ టైమ్లెస్ మెలోడిస్ను వినిపించి ఆబాలగోపాలాన్ని అలరిస్తోంది. ‘మొహబ్బత్ కర్నే వాలే’ లాంటి క్లాసిక్తో పాటు ‘సేవ్ ది గర్ల్చైల్డ్’ ‘ఎడ్యుకేషన్ ఫర్ ది అండర్ప్రివిలేజ్డ్’ లాంటి సామాజిక స్పృహతో కూడిన ఇతివృత్తాలతో పాటలు పాడుతుంది. చిన్నప్పుడు సినిమా పాటలే కాదు క్లాసిక్ గజల్స్, కీర్తనలు పాడేది. ప్రముఖ సంగీతకారుల వర్థంతిని దృష్టిలో పెట్టుకొని వారికి నివాళిగా యూట్యూబ్లో చేసే పాటల కార్యక్రమాలు సూపర్హిట్ అయ్యాయి.పాత పాటలు పాడుతుంటే కాలమే తెలియదు. 'టైమ్మెషిన్లో గతంలోకి వెళ్లినట్లుగా అనిపిస్తుంది’ అంటున్న షహనకు దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. తన పాటల ద్వారా వివిధ సామాజిక సేవాకార్యక్రమాలకు నిధులను సేకరించడంలో కూడా ముందు ఉంటుంది. 'పాటల ద్వారా సామాజిక సందేశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం నా లక్ష్యాలలో ఒకటి’ అని చెబుతుంది షహన. ఇవి చదవండి: ముగ్గురు మిత్రుల ముచ్చటైన విజయం -
2024 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. మీ దగ్గర ఈ సాంగ్స్ ఉంటే రచ్చ రచ్చే!
అందరూ ఇప్పుడు న్యూ ఇయర్ జోష్లో ఉన్నారు. కొత్త సంవత్సరాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునే ప్లాన్స్ వేస్తున్నారు. అయితే డిసెంబరు 31న రాత్రి తెలుగోళ్ల దాదాపు కేక్ కట్ చేయడం లేదంటే పార్టీ చేసుకోవడం లాంటివి చేయడానికి రెడీ అవుతుంటారు. ఈ సెలబ్రేషన్స్కి మరింత ఊపు తెచ్చేందుకు కొన్ని సాంగ్స్ ఉండాలి. అలా 2023లో వచ్చిన కొన్ని సాంగ్స్.. ఈ రోజు పార్టీలో ప్లే చేశారనుకోండి. మీ జోష్ మరింత రెట్టింపయ్యే ఛాన్స్ ఉంటుంది. దిగువన ఉన్న పాటల్లో అన్ని కాకపోయినా సరే కొన్నైనా సరే ప్లే చేసుకుని కొత్త సంవత్సరానికి స్వాగతం పలకండి. -
యూట్యూబ్ షేక్.. 2023లో దుమ్ము రేపిన వీడియోలు, షార్ట్స్ ఇవే..
ఆధునిక కాలంలో సోషల్ మీడియా రాజ్యమేలుతోంది. దీంతో ప్రపంచంలో ఏ మూల ఏ సంఘటన జరిగిన నిమిషంలో తెలిసిపోతోంది. ఇందులో కూడా కొన్ని సంఘటనలు మాత్రమే పెద్దగా వైరల్ అవుతాయి. ఈ ఏడాది (2023) ఎక్కువ మంది చూసిన వీడియోలు ఏవి, టాప్ ట్రెండింగ్ కంటెంట్, దాని వెనుక ఉన్న క్రియేటర్ల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 2023లో ఎక్కువ మంది వీక్షించిన వీడియాల్లో చెప్పుకోదగ్గది 'చంద్రయాన్-3 మిషన్ సాఫ్ట్-ల్యాండింగ్ లైవ్ టెలికాస్ట్'. దీనికి ప్రారంభంలో 8.5 మిలియన్స్.. ఇప్పటి వరకు 79 మిలియన్ వ్యూవ్స్ వచ్చాయి. ఈ సంవత్సరంలో యూట్యూబ్లో అతిపెద్ద లైవ్ స్ట్రీమ్గా ఇది సంచలనం సృష్టించింది. ఆ తరువాత వరుసగా మ్యాన్ ఆన్ మిషన్, యూపీఎస్సీ స్టాండ్ అప్ కామెడీ, డైలీ వ్లాగర్ పేరడీ, శాస్తా బిగ్ బాస్ 2 వంటివి ఎక్కువ వ్యూవ్స్ పొందాయి. టాప్ 15 గేమింగ్ వీడియోలు 2023లో 'ఐ స్టోల్ సుప్రా ఫ్రమ్ మాఫియా హౌస్' ఎక్కువమంది హృదయాలను దోచింది. ఈ గేమింగ్ వీడియో ఇప్పటికి 30 మిలియన్ వీక్షణనలను పొందింది. ఆ తరువాత స్థానంలో జీటీఏ5 ఇన్ రియల్ లైఫ్, గ్రానీ చాఫ్టర్ 1, స్కిబిడి టాయిలెట్ 39 - 59, కునాలి కో దర్ నహీ లగ్తా వంటివి ఉన్నాయి. టాప్ 10 కంటెంట్ క్రియేటర్స్ ఈ ఏడాది యుట్యూబ్లో సంచలనం సృష్టించిన టాప్ 10 కంటెంట్ క్రియేటర్ల జాబితాలో ప్రధమ స్థానంలో పవన్ సాహు ఉండగా.. ఆ ఆ తరువాత స్థానాల్లో నీతూ బిష్ట్ (Neetu Bisht), క్యూట్ శివాని 05, ఫిల్మీ సూరజ్ యాక్టర్, అమన్ డ్యాన్సర్ రియల్, ఆర్టిస్ట్ సింతు మౌర్య మొదలైనవారు ఉన్నాయి. ఇందులోనే మహిళల విభాగంలో నీతూ బిష్ట్, షాలు కిరార్, జశ్వి విశ్వి, ది థాట్ఫుల్ గర్ల్, రాయల్ క్యూన్, సోనాల్ అగర్వాల్, మింకు టింకు, అంజు డ్రాయింగ్ షార్ట్స్, మహి లక్రా వ్లాగ్స్, మామ్ అండ్ రీదిష్ణ వంటి వారు ఉన్నారు. టాప్ 15 షార్ట్స్ యూట్యూబ్ షార్ట్స్ విభాగంలో ఈ ఏడాది వరుసగా పతి కో బనాయా పాగల్, కదం కదం భజాంగే జా, 500 మీ ఐఫోన్, బ్లో ద రోలర్ అండ్ విన్ ఛాలెంజ్, చలాక్ బాయ్ ఫ్రెండ్, టామ్ అండ్ జెర్రీ (రిత్వి & కవి), పోర్ ఛాలెంజ్ విత్ సిరప్ వంటివి ఉన్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: 50 రూపాయలతో రూ.350 కోట్ల సామ్రాజ్యం - చూపు లేకున్నా.. సక్సెస్ కొట్టాడిలా.. టాప్ 15 మ్యూజిక్ వీడియోలు 2023లో పాపులర్ అయిన వీడియోల విషయానికి వస్తే.. ఇందులో మొదటి స్థానంలో ఘనీ కో సబ్ ఘన్, జరా హక్తే జరా బచ్కే, జవేద్ మోహ్సిన్, క్యా లోగే తుమ్, హా నువ్ కావాలయ్యా (జైలర్), పల్సర్ బైక్ (ధమాకా), నా రెడీ (లియో) మొదలైనవి ఉన్నాయి. -
2023లో యూట్యూబ్ ని షేక్ చేసిన టాప్ 10 సాంగ్స్ ఇవే
-
యూట్యూబ్ ని షేక్ చేస్తున్న సలార్ సాంగ్..!
-
లవ్ యూ బామ్మా
85 సంవత్సరాల వయసులో కంటెంట్ క్రియేటర్గా మారింది విజయ నిశ్చల్. ఫ్రెంచ్ ఫ్రై, సమోస. గులాబ్ జామూన్, పొటాటో బాల్స్...ఒక్కటా రెండా ఎన్నెన్నో పసందైన వంటలను ఎలా చేయాలో తన చానల్ ద్వారా నేర్పుతుంది నిశ్చల్. వంటలు చేస్తూ ఆ వంటకు తగినట్లుగా హుషారుగా పాటలు పాడుతుంటుంది. ఈ బామ్మ చానల్కు 8.41 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా నిశ్చల్ బామ్మ చేసిన ‘ఎగ్లెస్ కేక్’ వీడియో వైరల్గా మారింది. ఈ వీడియో 1.1 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. ‘ఎగ్లెస్ కోసం ఎన్నో చోట్ల ప్రయత్నించాను. మీ వీడియో చూసిన తరువాత నేను స్వయంగా చేశాను. ఇదంతా మీ చలవే. లవ్ యూ బామ్మా’ ‘వంటల్లో ఓనమాలు కూడా తెలియని నేను మీ వల్ల ఇప్పుడు ఎన్నో వంటలు చేయగలుగుతున్నాను. నా టాలెంట్ను చూసి ఫ్రెండ్స్ ప్రశంసిస్తున్నారు’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో కనబడుతున్నాయి. -
పేద పిల్లలకు సంగీతం నేర్పిస్తున్న అక్కాచెల్లెళ్లు
‘నేర్చుకున్న విద్యను పదిమందికి పంచుదాం’ అంటున్నారు కామాక్ష్మి, విశాల సిస్టర్స్. ముంబైకి చెందిన ఈ అక్కాచెల్లెళ్లు ‘ది సౌండ్ స్పేస్’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి తాము నేర్చుకున్న సంగీతాన్ని పేద పిల్లల చెంతకు తీసుకువెళుతున్నారు. గత పది సంవత్సరాలుగా కామాక్షి, విశాల సిస్టర్స్ పది వేలమంది పిల్లలకు సంగీత పాఠాలు బోధించారు. టైమ్తో అప్డెట్ అవుతూ పిల్లలు సులభంగా అర్థం చేసుకునేలా పాఠాలను డిజైన్ చేశారు. ‘జీవితంలో ప్రతి దశలో సంగీతం ఆహ్లాదాన్ని, శక్తిని ఇస్తుంది. సంగీతం అనేది బాగా డబ్బులు ఉన్న వాళ్ల కోసమే అనే భావనను మార్చాలనుకున్నాం’ అంటుంది కామాక్షి. విశాల, కామాక్షి లక్నో యూనివర్శిటీలో మ్యూజిక్ కోర్సు చేశారు. ‘చదువు, ఆరోగ్యం... మొదలైనవి మాత్రమే పిల్లలకు ముఖ్యం అనే వాళ్లు చాలామంది ఉన్నారు. అయితే కోవిడ్ కల్లోల కాలంలో మ్యూజిక్ థెరపి గొప్పదనం ఏమిటో తెలిసింది’ అంటుంది విశాల. -
చంద్రమోహన్ దశాబ్దాల సినీ జీవితం.. ఆయనకిష్టమైన పాటలు ఇవే!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే సినీ దిగ్గజం నింగికెగిసింది. దాదాపు ఐదున్నర దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. తన కెరీర్లో హీరోగా, విలన్గా, హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మెప్పించిన తీరు తెలుగువారికి చిరకాలం గుర్తుండిపోతాయి. తన సినీ జీవితంలో దాదాపు 932 చిత్రాల్లో నటించి అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. రంగుల రాట్నంతో మొదలైన ఆయన సనీ ప్రస్థానం.. గోపిచంద్ చిత్రం ఆక్సిజన్తో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన నటించిన సినిమాల్లో ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి. అలా ఆయన నటించిన చిత్రాలపై గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన సినిమాల్లో ఆయనకు ఇష్టమైన టాప్ హిట్ సాంగ్స్ గురించి వివరాలు పంచుకున్నారు. అవేంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: రూ.100 కోట్ల ఆస్తి పోగొట్టుకున్న చంద్రమోహన్, చివరి దశలో సింపుల్గా..) చంద్రమోహన్కు ఇష్టమైన 30 పాటలు. ఝుమ్మంది నాదం – సిరి సిరి మువ్వ మావిచిగురు తినగానే – సీతామాలక్ష్మి మేడంటే మేడా కాదు – సుఖ దుఃఖాలు కలనైనా క్షణమైనా – రాధా కళ్యాణం మల్లెకన్న తెల్లన – ఓ సీత కథ లేత చలిగాలులు– మూడు ముళ్లు దాసోహం దాసోహం – పెళ్లి చూపులు సామజవరాగమనా – శంకరాభరణం ఈ తరుణము – ఇంటింటి రామాయణం ఇది నా జీవితాలాపన – సువర్ణ సుందరి పంట చేలో పాలకంకి – 16 ఏళ్ల వయసు నాగమల్లివో తీగమల్లివో – నాగమల్లి పక్కింటి అమ్మాయి పరువాల – పక్కింటి అమ్మాయి కంచికి పోతావ కృష్ణమ్మా – శుభోదయం ఏమంటుంది ఈ గాలి – మేము మనుషులమే బాబా... సాయిబాబా – షిర్డీసాయి బాబా మహత్యం నీ పల్లె వ్రేపల్లె గా – అమ్మాయి మనసు చిలిపి నవ్వుల నిన్ను – ఆత్మీయులు నీలి మేఘమా జాలి – అమ్మాయిల శపధం వెన్నెల రేయి చందమామా – రంగుల రాట్నం అటు గంటల మోతల – బాంధవ్యాలు ఏదో ఏదో ఎంతో చెప్పాలని – సూర్యచంద్రులు ఏది కోరినదేదీ – రారా కృష్ణయ్య ఏ గాజుల సవ్వడి – స్త్రీ గౌరవం ఏమని పిలవాలి – భువనేశ్వరి మిడిసిపడే దీపాలివి– ఆస్తులు– అంతస్తులు పాలరాతి బొమ్మకు– అమ్మాయి పెళ్లి ఐ లవ్ యు సుజాత– గోపాల్ రావ్ గారి అమ్మాయి నీ తీయని పెదవులు– కాంచనగంగ నీ చూపులు గారడీ– అమాయకురాలు (ఇది చదవండి: నటుడు చంద్రమోహన్ మృతికి కారణాలివే!) వ్యక్తిగత జీవితం.. చంద్రమోహన్ భార్య జలంధర మంచి రచయిత్రి అని అందరికీ తెలిసిందే. వీరికి ఇద్దరమ్మాయిలు సంతాన కాగా.. వారికి పెళ్లిళ్లయిపోయాయి. పెద్దమ్మాయి మధుర మీనాక్షి సైకాలజిస్ట్. ఆమె భర్త బ్రహ్మ అశోక్ ఫార్మాసిస్ట్ కాగా అమెరికాలో స్థిరపడ్డారు. చిన్నమ్మాయి మాధవి వైద్యురాలు. ఆమె భర్త నంబి కూడా డాక్టరే కావడంతో వీరంతా చెన్నైలో ఉంటున్నారు. -
ఆటా.. పాట.. అండాదండ
‘‘నడువు నడువు నడువవే రామక్కో.. కలిసి నడుము కట్టవే రామక్కా.. గులాబీల జెండలే రామక్కా..’’ భారత్ రాష్ట్ర సమితి ఎన్నికల ప్రచార రథాలు, బహిరంగ సభా వేదికలపై నుంచి మార్మోగుతున్న పాట ఇది. కల్వకుర్తి రైతుకూలీ కొమ్ము లక్ష్మమ్మ గళం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారి లక్షలాది ‘వ్యూ’లతో దుమ్ము రేపుతోంది. ఈ తరహా పాటలు, లక్ష్మమ్మ లాంటి వందలాది గొంతులను ఎన్నికల ప్రచార సభలో పదునైన ఆయుధంగా వాడుతున్నారు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్. వాస్తవానికి రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ ‘పాట’ను ముందు భాగంలో నిలిపి తన ఎజెండాను జన సామాన్యంలోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే పరంపరను కొనసాగిస్తూ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ ‘గళబలం’తో బీఆర్ఎస్ ముందుకు సాగుతోంది. ఉద్యమంలో అగ్రస్థానం..: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కాలంలో స్థానిక చరిత్ర, సంస్కృతి, అమరుల త్యాగాలు, కరువు దుఃఖాన్ని ప్రతిబించిబే పాటలతో ప్రజల్లో భావ వ్యాప్తి ద్వారా చైతన్యం నింపేందుకు కేసీఆర్ అధిక ప్రాధాన్యతనిచ్చారు. కొన్నిసార్లు తానే స్వయంగా కలం చేతబూని కొత్త పాటలు సృష్టించిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఇక ‘ధూం ధాం’ వంటి వేదికల ద్వారా వందలాది మంది తెలంగాణ కవి గాయకులు తమ ఆట పాటలతో రాష్ట్ర సాధన ఉద్యమాన్ని శిఖరాగ్రానికి చేర్చారు. ఎన్నికల ప్రచారంలోనూ..: తెలంగాణ ఆవిర్భావం నేపథ్యంలో జరిగిన 2014 ఎన్నికలతో పాటు 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పాటను ఆలంబనగా చేసుకుని జన సామాన్యానికి చేరువైంది. ఉద్యమ కాలం నాటి ‘ఎనుకముందు జూసుడేంది రాజన్న.. ఓ రాజన్న .. ఎత్తుర తెలంగాణ జెండా రాజన్న ఓ రాజన్న’, ‘మన ఓటు మన తెలంగాణకే అన్నో రామన్నా.. మన ఓటు మన కారు గుర్తుకే అక్కో సీతక్కా..’ అంటూ తెలంగాణ తెగువను, చైతన్యాన్ని గుర్తు చేస్తూ 2014 ఎన్నికల ప్రచారంలో జనంలోకి వెళ్లిన బీఆర్ఎస్ తొలిసారిగా అధికారాన్ని చేపట్టింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ‘మానవతకు మారు పేరు కేసీఆర్ సారూ.. మళ్లీ గెలిచి రావాలె.. మనసుగల్ల సర్కారు’ అంటూ బీఆర్ఎస్కు మద్దతుగా పాటలు కట్టిన కవులు, గాయకులు పార్టీ విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. ఇక ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లోనూ పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వ విజయాలను గుర్తు చేస్తూ, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను జనం భాషలో వివరిస్తూ కళా బృందాలు ఆడి పాడుతున్నాయి. అధికారంలోనూ భాగస్వామ్యం కల్పించారు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన రాష్ట్ర సాధన ఉద్యమంలో వందలాది కళాలు, గలాలు పుట్టుకొచ్చి తెలంగాణ కరువు, దుఃఖాన్ని కళ్లకు కట్టాయి. ఓ వైపు తెలంగాణ సంస్కృతిని చాటుతూనే మరోవైపు రాష్ట్ర సాధన వైపుగా జనసామాన్యాన్ని చైతన్యవంతులను చేశాయి. కవులు, కళాకారులను కరివేపాకులా తీసేయకుండా వారికి అధికారంలోనూ భాగస్వామ్యం కల్పించిన ఘనత కేసీఆర్దే. – దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్సీ పాట బలం తెలిసిన వ్యక్తి కేసీఆర్ పాట బలాన్ని తెలుసుకున్న ఏకైక నాయకుడు కేసీఆర్. ఎన్నికల ప్రచారసభల్లో తెలంగాణ తెచ్చిన వారిని, అభివృద్ధి బాటను చూపిన వారిని గుర్తుంచుకోండి అని ఆట పాటలతో ప్రజలకు చెబుతున్నాం. – పెద్దింటి మధుప్రియ పాటకు గొడుగు పట్టిందే కేసీఆర్ రాజకీయం పాటను ఎప్పుడూ స్వార్ధానికే వాడుకుంది. కానీ పాటను మరిచిపోకుండా అక్కున చేర్చుకుని గౌరవించిన ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమే. ఉద్యమ కాలం నాటి కలాలు, గళాలను రాజకీయ అందలం ఎక్కించిన ఘనత కేసీఆర్దే. – మిట్టపల్లి సురేందర్, కవి, గాయకుడు పాటకు పదవులు తమ కలాలు, గళాలతో తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చిన కవి గాయకులు పలువురిని.. రాష్ట్రం సాధించి అ«ధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ తగిన విధంగా అందలమెక్కించారు. 580 మంది కవులు, కళాకారులకు ‘సాంస్కృతిక సారధి’ ద్వారా ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారంలో మమేకం చేశారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో సాంస్కృతిక విభాగాన్ని ముందుండి నడిపిన రసమయి బాలకిషన్ ఇప్పటికే రెండుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ప్రస్తుతం మూడోసారి ఎన్నికల బరిలో నిలిచారు. తెలంగాణ వాగ్గేయకారుడిగా పేరొందిన గోరట వెంకన్న గవర్నర్ కోటాలో, ఉద్యమాన్ని తన పాట, మాటతో ఉర్రూతలూగించిన కవి గాయకుడు దేశపతి శ్రీనివాస్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు. అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత బీఆర్ఎస్ ప్రచార వేదికలపై అంతా తానై వ్యవహరించిన గాయకుడు వేద సాయిచంద్కు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్గా కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు. ఆయన ఆకస్మిక మరణానంతరం భార్య రజనికి కార్పొరేషన్ పదవి ఇవ్వడం, ఆర్థికంగా ఆదుకోవడం వంటివి కళాకారుల్లో సరికొత్త ఆత్మ విశ్వాసాన్ని, భరోసాను నింపాయి. సాయిచంద్ మరణం తర్వాత జరుగుతున్న ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో మిట్టపల్లి సురేందర్, పెద్దింటి మధుప్రియ, ఏపూరి సోమన్న తదితరులు బీఆర్ఎస్ ఆటపాటల బాధ్యతను తలకెత్తుకున్నారు. - కల్వల మల్లికార్జున్ రెడ్డి -
వినాయకచవితి స్పెషల్.. ఈ సాంగ్స్ లేకపోతే సందడే ఉండదు!
వినాయకచవితి పండుగ వచ్చిందంటే చాలు. చిన్నపిల్లలే కాదు.. పెద్దలు డ్యాన్సులతో హోరెత్తిస్తారు. పెద్ద పెద్ద డీజేలు, గణనాధుని పాటలతో ఏ గల్లీలో చూసినా సందడే సందడి.. ధూమ్ ధామ్. మరీ ఇంత సంతోషంగా పిల్లలు, పెద్దలు జరుపుకునే పండుగలో గణనాథునిపై మనం రాసుకున్న పాటలకైతే కొదువ లేదాయే. మరీ ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా సంతోషంగా గణనాధున్ని గంగమ్మ ఒడికి చేర్చే వరకు మనకోసం.. మరీ ముఖ్యంగా బొజ్జ గణపయ్య కోసం సినిమాల్లో వచ్చిన పాటలను ఓ సారి గుర్తు చేసుకుందాం. వినాయకచవితి సందర్భంగా లంబోదరుడి సూపర్ హిట్ సాంగ్స్ గురించి తెలుసుకుందాం పదండి. సినిమాల్లో మన గణపయ్య సూపర్ హిట్ సాంగ్స్ మెగాస్టార్ 'జై చిరంజీవ'- 'జై జై గణేశా.. జై కొడతా గణేశా' 'జై జై గణేశా.. జై కొడతా గణేశా' అనే సాంగ్ వినాయకచవితి వచ్చిందంటే కచ్చితంగా ఉండాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి, సమీరా రెడ్డి, భూమిక ప్రధాప పాత్రల్లో విజయ భాస్కర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వెంకటేశ్ కూలీనెం 1- 'దండాలయ్యా.. ఉండ్రాలయ్యా..దేవా' 'దండాలయ్యా.. ఉండ్రాలయ్యా..దేవా. నీ అండదండా ఉండాలయ్యా.. దేవా' అంటూ సాగే వినాయకుని పాట ఇప్పటికీ కూడా ఎవర్గ్రీన్. వెంకటేశ్, టబు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2002లో రిలీజైంది. 100% లవ్ -'తిరుతిరు గణనాథ..' నాగచైతన్య, తమన్నా జంటగా నటించిన చిత్రం 100% లవ్. ఈ చిత్రంలో తమన్నా పాడే 'తిరుతిరు గణనాథ..' అంటూ పాడే సాంగ్ హైలెట్. వినాయకచవితి పండుగ రోజు ఈ పాట కచ్చితంగా ఉండాల్సిందే. అల్లు అర్జున్ 'ఇద్దరమ్మాయిలతో'- గణపతి బప్పా మోరియా అల్లు అర్జున్, అమలా పాల్ జంటగా నటించిన చిత్రం ఇద్దరమ్మాయిలతో. ఈ చిత్రంలో 'గణపతి బప్ప మోరియా' సాంగ్ వినని వారుండరు. ఐకాన్ స్టార్ ఈ పాటకు తన స్టెప్పులతో అదరగొట్టాడు. వెస్ట్రర్న్ స్టెల్లో బన్నీ దుమ్ములేపారు. దేవుళ్లు- 'వక్రతుండా మహాకాయ' సాంగ్ ఎస్పీ బాలసుబ్రమణ్య ఆలపించిన ఈ సాంగ్ దేవుళ్లు సినిమాలోది. ఇద్దరు చిన్న పిల్లలు తమ తల్లిదండ్రుల కోసం దేవుడిని మొక్కులు చెల్లించేందుకు బయలుదేరుతారు. ఈ సినిమాలో 2001లో రిలీజ్ కాగా.. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించారు. బాలయ్య భగవంత్ కేసరి- గణేశ్ ఆంతం సాంగ్ బాలకృష్ణ, శ్రీలీల జంటగా నటిస్తోన్న చిత్రం భగవంత్ కేసరి. ఈ చిత్రంలో గణేశ్ ఆంతం లిరికల్ సాంగ్ను ఇటీవలే రిలీజ్ చేశారు. వినాయకచవితికి గణపతి మండపాలు ఈ పాటతో హోరెత్తనున్నాయి. -
మాట తప్పిన ఆత్రేయ! ముచ్చటపడ్డా.. ఆ కోరిక నెరవేరకుండానే..
మాట తప్పడం ఆత్రేయకు మామూలు అనీ, ఆయన మాటను పాటిస్తే అది విశేష మని లోక వ్యాప్తమైన ప్రతీతి. ఆత్రేయ రాయక నిర్మాతలను ఏడిపించేవారనీ, అందుకే ఆయన పుల్లయ్య నుంచి మురారి వరకూ అనేక నిర్మాతల ఆగ్రహానికీ, ఆ తర్వాత ఆనందానికీ కారకులయ్యే వారని పరిశ్రమలో కథలు వినిపించేవి. వృత్తి రీత్యా ఆత్రేయ సత్యహరిశ్చంద్రుడు కాకపోవడం నిజమైనా, అవసాన కాలంలో ఆయన ఎంతో ముచ్చటపడి ఇచ్చిన మాట విధి వశాత్తూ వమ్ము కావడం ఆయన సుకవి మీద అభిమానులందరికీ సానుభూతి కలిగించే విషాద కరమైన ఉదంతం! ముద్రణ పట్ల వ్యామోహం లేని ఆత్రేయకు ఆఖరి దశలో తను రాసిన సినిమా పాటల్లో కొన్నిటిని ‘నా పాట నీ నోట పలకాలి’ అనే పేరుతో పుస్తక రూపంలో తీసుకురావాలనే కోరిక కలిగింది. కొందరు నిర్మాతలు వాగ్దానాలు చేసినా, అది సాకారం కాలేదు. చివరకు చిరకాల మిత్రులైన కొంగర జగ్గయ్య దగ్గర ఈ విషయం వెల్లడించగా, ఆయన ఆత్రేయ అంతవరకు రాసిన మొత్తం సినిమా పాటల్ని రెండు, మూడు సంపుటాలుగా వెలువరిద్దామని ప్రతిపాదించారు. అనుకోకుండా తన కల నెరవేరబోతున్నందుకు ఆనందంతో తలమునకలైన ఆత్రేయ ఆ పాటల సంపుటాలు అట్ట పెట్టెల్లో ఉంచే ‘సెట్స్’గా రావాలని అభిలషించారు. జగ్గయ్య ఆమోదించారు. ఆ రోజు నుంచే (1989 ఆగస్టు 13) ఆత్రేయ తన పాటల సెట్లను ఊహించుకొని మురిసిపోతూ, ఆ ముద్రణ ముచ్చట గురించి ఆత్మీయులకు చెప్పసాగారు. సభలకూ, సమావేశాలకూ దూరంగా ఉండే ఆత్రేయ ఒక ఆప్త మిత్రుని బలవంతం మీద ప.గో. జిల్లా భీమవరంలో జరుగు తున్న ‘అల్లూరి సీతారామరాజు సంగీత నాటక కళా పరిషత్’ నాటక పోటీలకు చూడ్డానికి ముఖ్య అతిథిగా వెళ్లారు. ఆ ప్రదర్శనలతో స్ఫూర్తి పొంది తను రాయాలనుకున్న ‘ఆఖరి నాటకా’నికి శ్రీకారం చుట్టాలనే తలంపుతో ఆయన రెండ్రోజులపాటు ఆ నాటకాలను చూస్తూ ఉండిపోయారు. అలాంటి అరుదైన అవకాశాన్ని వినియోగించుకోవాలని స్థానిక రామరాజభూషణ సాహిత్య పరిషత్ వారు ఒక సాయంకాల సమావేశానికి ఆత్రేయను అతిథిగా ఆహ్వానించారు. ఆ సమావేశంలో పలువురు కవులు, సాహితీవేత్తలు ఆత్రేయ నాటకాల గురించి, పాటల గురించి అద్భుతమైన ప్రసంగాలు చేసి వారి రచనలను ఆయనకు కానుకలుగా సమర్పించారు. వారి అభిమానానికి ముగ్ధులైన ఆత్రేయ ప్రతిస్పందిస్తూ ముక్తసరిగా మాట్లాడి, మరోసారి వచ్చి ఆ సభ్యులంతా తృప్తిపడేలా సుదీర్ఘోపన్యాసం చేస్తానన్నారు. అంతేగాక త్వరలో అచ్చుకానున్న తన పాటల సంపుటాలను భీమవరం పంపిస్తానని వాటిని తనకు పుస్తకాలనిచ్చిన రచయితలందరికీ అందజేయాలనీ పరిషత్ నిర్వాహకులు రాయప్రోలు భగవాన్ గారిని కోరారు. పుస్తక ముద్రణ గురించి చర్చించడానికి జగ్గయ్య గారిని తిరిగి కలవడానికి నిర్ణయించిన 1989 సెప్టెంబరు 13న ఆత్రేయ మాట తప్పారు. ఆకస్మికంగా తిరిగిరాని లోకానికి పయన మయ్యారు. పాటల సంపుటాలతో పాటు మనస్విని సౌజన్యంతో వెలువడిన 7 సంపుటాల ‘ఆత్రేయ సాహితి’ని ఆయన చూసుకోలేదు. ఉద్వేగంతో ఆయన మాటిచ్చినట్టు ఆత్రేయ రచనల సెట్ రామరాజ భూషణ సాహిత్య పరిషత్ సాహితీ వేత్తల కందలేదు! పైడిపాల, వ్యాసకర్త సినీగేయసాహిత్య పరిశోధకులు (చదవండి: నెట్టింట అద్భుతంగా అలరించిన అక్కినేని శతజయంతి) -
కథక్ నుంచి తీన్మార్ వరకు ఏదైనా..వారెవా! అనేలా ఇరగదీస్తాడు!
బెల్జియన్ కంటెంట్ క్రియేటర్ ఈడీ పీపుల్ వివిధ ప్రాంతాలలో లోకల్స్తో కలిసి చేసే డ్యాన్స్ వీడియోలు ప్రపంచ వ్యాప్తంగా ఫేమ్ అయ్యాయి. ఏదైనా ప్రాంతానికి వెళ్లిన పీపుల్ స్థానికులను ‘మీకు ఇష్టమైన డ్యాన్స్ ఏమిటి?’ అని అడగడమే కాదు ‘నాకు నేర్పించగలరా?’ అని రిక్వెస్ట్ చేసి ఓపిగ్గా నేర్చుకుంటాడు. అలా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలకు చెందిన డ్యాన్స్లను నేర్చుకుంటూ, స్థానికులతో పోటీ పడి డ్యాన్స్ చేస్తుంటాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా మన దేశానికి సంబంధించి వివిధ ప్రాంతాలకు చెందిన డ్యాన్స్లు చేసి ‘వారేవా’ అనిపించుకున్నాడు. ‘మీ డ్యాన్స్ చూస్తుంటే భారతీయ పౌరసత్వం ఇవ్వాలనిపిస్తుంది’. ‘మా దేశంలోని కొన్ని అద్భుతమై డ్యాన్స్లను మిస్ అయ్యారు. వాటిని కూడా చేస్తే బాగుంటుంది’ అంటూ వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఈడీ పీపుల్ షేర్ చేసిన డ్యాన్స్ వీడియోలపై నెటిజనులు స్పందించారు. View this post on Instagram A post shared by Ed People (@ed.people) (చదవండి: ఏం చిక్కొచ్చి పడింది! అటు చూస్తే.. జవాన్!.. ఇటు చూస్తే.. ఆఫీస్..!) -
మెగాస్టార్ ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్స్.. లిస్ట్ ఇదిగో!
మెగాస్టార్ ఆల్ టైమ్ హిట్ సాంగ్స్ మెగాస్టార్ ఈ పేరు తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. సౌత్ ఇండియాలో అంత క్రేజ్ మరెవరికీ లేదు. అంతలా కళామతల్లి ఒడిలో ఒదిగిపోయాడు. దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. 1978లో పునాదిరాళ్లు చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్.. ఇటీవల రిలీజైన భోళాశంకర్ వరకు ఆయన ప్రయాణంతో ఇండస్ట్రీలో చెరగని ముద్రవేశారు. తన కెరీర్లో ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన చిరు ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకే పెద్దదిక్కులా ఉన్నారు. ఆయన సినిమాల్లో బ్లాక్ బస్టర్స్తో పాటు ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. అయితే సినీ కెరీర్లో 150కి పైగా చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేశారు. ఆగస్టు 22న 1955లో ఆంధ్రప్రదేశ్లోని మొగల్తూరులో జన్మించారు. చిరంజీవి అసలు పేరు శివశంకర్ వరప్రసాద్. ఆంజనేయస్వామి భక్తుడైన మెగాస్టార్కు ఇండస్ట్రీలో చిరంజీవిగా ముద్రపడిపోయింది. ఆగస్టు 22, 2023న ఆయన బర్త్ డే సందర్భంగా మెగాస్టార్ ఆల్ టైమ్ హిట్ సాంగ్స్ గురించి తెలుసుకుందాం. 1. చమక్ చమక్ చాం - కొండవీటి దొంగ - విజయంశాంతి 2. రెడ్ రెడ్ బుగ్గే రెడ్ సిగ్గె రెడ్ చూశా- అల్లుడా మజాకా - రంభ 3. రగులుతోంది మొగలిపొద- ఖైదీ- మాధవి 4. భద్రాచలం కొండ సీతమ్మవారి దండ- గ్యాంగ్ లీడర్- విజయశాంతి 5. బంగారు కోడిపెట్ట వచ్చేనండి- ఘరానా మొగుడు- డిస్కో శాంతి 6. మంచమేసి.. దుప్పటేసి.. మల్లెపూలు చల్లానురా- కొండవీటి రాజా- విజయశాంతి 7. ఇందువదన కుందరదన - ఛాలెంజ్- విజయశాంతి 8. సందె పొద్దులకాడ - అభిలాష- రాధిక శరత్కుమార్ 9. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు - రాక్షసుడు- సుహాసిని 10. సిన్ని సిన్ని కోరికలడగ - స్వయంకృషి- విజయశాంతి 11. నమ్మకు నమ్మకు ఈ రేయిని -రుద్రవీణ- శోభన 12. జై చిరంజీవ జగదేకవీరా.. - జగదేకవీరుడు అతిలోక సుందరి- శ్రీదేవి 13. చుక్కల్లారా చూపుల్లారా - ఆపద్బాంధవుడు- మీనాక్షి 14. దాయి దాయి దామ్మ- కులుకే కుందనాల బొమ్మ- ఇంద్ర- సోనాలి బింద్రే 15. ఏ ఛాయ్ చటుక్కున తాగరా భాయ్- మృగరాజు- సిమ్రాన్ 16. కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి.. - ఠాగూర్- జ్యోతిక, శ్రియాశరణ్ 17. వానా వానా వెల్లువాయే.. కొండకొన తుల్లిపోయే- గ్యాంగ్ లీడర్- విజయశాంతి 18. ఆంటీ కుతురా.. అమ్మో అప్సరా.. ముస్తాబు అదిరింది- బావగారు బాగున్నారా?- రంభ 19. బంగారం తెచ్చి.. వెండి వెన్నెల్లో ముంచి- ఇద్దరు మిత్రులు -
ప్రతి ఒక్కరి గుండెల్ని తాకే దేశభక్తి పాటలు ఇవే
భారతదేశం తన 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నేడు (ఆగస్టు 15)న జరుపుకుంటుంది. భారతదేశం బ్రిటీష్ వలస పాలన నుంచి స్వాతంత్య్రం పొంది 76 సంవత్సరాలు పూర్తవుతోంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు వైభవంగా జరుపుకుంటున్నారు. దాదాపు రెండు శతాబ్దాల తర్వాత బ్రిటీష్ వారి నుంచి విముక్తిని సాధించిపెట్టిన నాయకులు, ఇందుకు తమ ప్రాణాలను అర్పించిన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు గుర్తు చేసుకుంటున్నారు. అలా కొన్ని పాటలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. 'తేరి మిట్టీ' -కేసరి కొన్ని పాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి పాటల్లో తేరి మిట్టి మే మిల్ జవాన్ సాంగ్ ఒక్కటి. ఈ పాట విన్నప్పుడల్లా మనస్సు ఉప్పొంగుతుంది. గీత రచయిత మనోజ్ ముంతాషిర్ ఎంతో గొప్పగా రచించారు. ఈ పాట విన్న తర్వాత అందరిలో దేశభక్తి భావం రాకుండా ఉండదు. ఈ పాటను 1బిలియన్కు పైగా వీక్షించారు. 'మేమే ఇండియన్స్' - ఖడ్గం కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, సోనాలి బింద్రే ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన దేశభక్తి మూవీ 'ఖడ్గం'. నేటి తరానికి దేశ భక్తి అంటే ఏంటో తెరపై చూపించిన సినిమా ఇది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన 'మేమే ఇండియన్స్' పాట ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పాట ఎప్పుడు విన్నా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. చంద్రబోస్ రాసిన ఈ గీతాన్ని సింగర్ హనీ ఆలపించారు. 'ఎత్తరా జెండా' - RRR విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన పీరియాడిక్ మూవీ 'ఆర్.ఆర్.ఆర్'. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా ఎండ్ క్రెడిట్స్ పడే సమయంలో 'నెత్తురు మరిగితే ఎత్తరా జెండా' అనే పాట వస్తుంది. దేశభక్తిని చాటిచెప్పే ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్లు పలువురు స్వాతంత్ర్య సమరయోధుల గెటప్స్లో కనిపిస్తారు. ఎమ్ఎమ్ కీరవాణి స్వరపరిచిన ఈ సెలబ్రేషన్ సాంగ్కు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. విశాల్ మిశ్రా, పృథ్వీ చంద్ర, సాహితి చాగంటి, హారిక నారాయణ్ కలిసి ఆలపించారు. 'దేశం మనదే తేజం మనదే' - జై తేజ దర్శకత్వంలో నవదీప్ హీరోగా నటించిన చిత్రం 'జై'. ఈ సినిమాలో అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన 'దేశం మనదే తేజం మనదే' సాంగ్ ఎవర్ గ్రీన్ దేశభక్తి గీతంగా నిలిచింది. బేబీ ప్రెట్టీ, శ్రీనివాస్ కలిసి పాడిన ఈ పాటకు కులశేఖర్ సాహిత్యం సమకూర్చారు. 'పాడవోయి భారతీయుడా' -వెలుగు నీడలు 'పాడవోయి భారతీయుడా.. ఆడి పాడవోయి విజయ గీతికా' అంటూ మహాకవి శ్రీ శ్రీ రాసిన దేశభక్తి గీతం ప్రతి యేడాది స్వాతంత్ర్య దినోత్సవం రోజున మార్మోగుతూనే ఉంది. ఈ పాట వచ్చిన 13 ఏళ్ల తరువాత అక్కినేని నాగేశ్వరరావు 'వెలుగు నీడలు' చిత్రంలో పెండ్యాల నాగేశ్వరరావు స్వరపరిచిన ఈ పాటను పి.సుశీల , ఘంటసాల పాడారు. ఈ పాట వచ్చి 60 సంవత్సరాలు గడిచినా నేటికీ క్లాసిక్ దేశభక్తి గీతాల్లో ఎప్పటికీ ట్రెండింగ్లో ఉంటుంది. 'పుణ్యభూమి నాదేశం' -మేజర్ చంద్రకాంత్ ఇక ఎన్టీఆర్ క్లాసిక్ హిట్స్ అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేపాట. మేజర్ చంద్రకాంత్ మూవీలోని 'పుణ్యభూమి నాదేశం నమో నమామి'. దేశం కోసం ప్రాణం అర్పించిన ఎందరో మహానుభావున త్యాగాలను గుర్తు చేస్తూ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈపాటకు కీరవాణి స్వరాలను సమకూర్చారు. 'వినరా.. వినరా' రోజా ఏ.ఆర్ రెహమాన్ దేశభక్తి గీతాలు యూత్లో దేశభక్తిని రగిల్చాయి. రోజా చిత్రంలో వినరా.. వినరా.. దేశం మనదేరా అంటూ రాజశ్రీ రాసిన పాటతోపాటు.. మా తేఝే సలాం వందేమాతరం అంటూ రెహమాన్ పాడిన పాట సంచలనం అయ్యింది. -
సహజ వాగ్గేయకారుడు
జనం గుండెల నుంచి ప్రభవించిన సజీవ వాగ్గేయకారుడు గద్దర్. కవిత్వాన్ని పాటలో రంగరించి తత్వాన్ని బోధించిన మానవతా మూర్తి. ఆయన పాటల్లో పల్లె జీవన సంస్కృతీ వికాసం ఉంది. వేమన, పోతులూరి వీరబ్రహ్మం, కబీరు,సంత్ రవిదాసు సూక్తులు ఆయన పాటల్లో ప్రతిధ్వనిస్తుంటాయి. ఆయన ‘జననాట్యమండలి’ సృష్టికర్త. ఆయన నాలుక మీద ఆదిమ జాతుల స్వర విన్యాసం ఉంది. సముద్ర ఘోషను ఆయన ఊరిలోనికి మోసుకొచ్చాడు. అడవి వేదనలను రాజ్య ప్రసాదాల్లోకి ప్రవహింప చేశాడు. నేను విశాఖపట్నం జైల్లో ఉన్నప్పుడు నక్సలైట్ సెల్ నుంచి ‘సిరిమల్లె సెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మా, నీవు సినబోయి కూచున్నవెందుకమ్మో ఎందుకమ్మా’ పాట అర్ధరాత్రి పాడాడు. అది నాలో పునరుత్తేజాన్ని తీసుకొచ్చింది. దళిత వీరుల చెవుల్లో విప్లవ స్వరాన్ని విని పించి సైనిక కవాతు చేయించిన సైన్యా ధ్యక్షుడు ఆయన. 1985లో కారంచేడు ఉద్యమంలో మమేకమై ‘దళిత పులులమ్మ, కారంచేడు భూస్వాములతో కలబడి నిల బడి పోరు చేసిన దళిత పులులమ్మ’ అని దళితులకు చైతన్యాన్నీ, ధైర్యాన్నీ, పోరాట శక్తినీ కల్పించిన దళిత వీరుడు ఆయన. ఆయన తండ్రి అంబేద్కర్ స్థాపించిన మిలింద విశ్వవిద్యాలయా నికి రాళ్లెత్తాడు. అంబేడ్కర్ కుల నిర్మూ లన ఉద్యమానికి గద్దర్ వెన్ను తట్టాడు. చేతిలో ఎర్ర జెండా ఉన్న ప్పుడు కూడా గుండెల్లో అంబేడ్కర్ని నింపుకున్నాడు. అందుకే ఆయన తన గమనంలో కుల నిర్మూలన వాదిగా ధ్వనిస్తూ వచ్చాడు. కులం మీద ఆయన గొడ్డలి వేటు వేశాడు. ‘దళిత పులులమ్మ’ పాటలో కథా కథన చాతుర్యాన్ని చూపాడు. గద్దర్ కారంచేడులో దళితులు చనిపోయిన ప్రదే శానికి వచ్చినప్పుడు ‘వీళ్ళు పోరాటంలో చనిపోయారు గాని, పిరికి వాళ్ళై చనిపోలేద’ని స్థానిక దళితులు చెప్పారు. అప్పుడు గద్దర్ ఈ పాట రాశాడు. ‘దళిత పులులమ్మా / కారంచేడు భూస్వాములతోనే / కలబడి నిలబడి పోరు చేసినా/ మాల సాయిబు వడ్డెర జాతికి మాదిగపల్లె తల్లిలాంటిది/ శరణుకోరిన శత్రువునైనా ప్రేమతో చూసే పేదలపల్లె/ మాదిగపల్లె పేరు వింటెరా/ బరిశె నెత్తుకొని పందె మాడితే ఊరి దొరలకు ఉచ్చబడతది/ కోటి బాధలతో మునిగి తేలినా అన్న మాటకు అటుఇటు గారు/ వడ్డీల మీద వడ్డీలు గట్టి – నడ్డి విరిగినా బుద్ధిమంతులు/ మట్టిలో మటై్ట మన్నులో మన్నై – పండించిన ప్రతి వడ్లగింజను/ బలిసిన దొరల గరిసెలు నింపి – పస్తులు పండే కష్ట జీవులు.’ ఈ పాట చరిత్రకు సాక్ష్యంగా నిలబడింది. దళితుల పోరాట పటిమకు అద్దం పడుతుంది. గద్దర్ దళిత బిడ్డ. ఆయన అంబే డ్కర్ బుర్రకథల ద్వారానే ముందుకు నడిచాడు. తరువాత జన నాట్యమండలి నిర్మించాడు. పీపుల్స్వార్కు అనుబంధంగా జన నాట్యమండలి కృషి చేసింది. జననాట్యమండలి ఆనాడు దళిత ఉద్యమానికి వ్యతిరేకంగా ఉంది. అది ఆనాడు దళిత ఉద్యమాన్ని హైజాక్ చేయాలని అనుకొంది. ఆ సందర్భంగా గద్దర్పై దళిత ఉద్యమ ప్రభావం పడింది. దాని ఫలితమే ఈ పాట. మొదటి సారిగా, జననాట్యమండలి పాటల్లో కులాధిపత్యం వర్గాధిప త్యాన్ని జోడించి పాడటం ప్రారంభమైంది గద్దర్తోనే! ఇది దళిత ఉద్యమ విజయం. ఈ పాటను 1985 సెప్టెంబర్ 1న ‘చలో చీరాల’ మహాసభలో గద్దర్ పాడాడు. ఈ పాట ఒక ఉజ్జ్వల జ్వలనాన్ని ప్రేక్షకుల్లో రూపొందించింది. సుమారు 3 లక్షల మంది దళితులు ‘దళిత మహాసభ’ ఆధ్వర్యంలో చీరాల హైస్కూలు గ్రౌండ్స్లో హాజరయ్యారు. ఈ వ్యాస రచయితే అధ్యక్షత వహించాడు. గద్దర్ నిజానికి ఒక తాత్త్వికుడు. నీకిష్టమైన పాటేదంటే ‘ఏలరో ఈ మాదిగ బతుకు’ అంటాడు. నిజానికి ఈ పాటలో ఈ దళిత కులాల జాతీయతను ఎలుగెత్తి చాటాడు గద్దర్: ‘ఏలరో ఈ మాదిగ బతుకు మొత్తుకుంటే దొరకదురా మెతుకు/ బంగారు పంటలిచ్చె భరత గడ్డమనది / గంగమ్మ ప్రవహించే పుణ్యభూమి మనది / గంగ యమున బ్రహ్మపుత్ర కృష్ణ పెన్నా కావేరి/ ఎన్నెన్నో జీవ నదులు ప్రవహించే జీవగడ్డ / మాల మాదిగలకే మంచినీళ్లు కరువాయే’ అని గద్దర్ సామా జిక తత్త్వాన్నీ, సామాజిక సమస్యనూ దళిత జాతీయ దృక్పథంతో అనేక పాటల్లో విశ్లేషిస్తాడు. దళిత ఉద్యమంలో పాటలు పాడే దళాలన్నీ అవి ఏ పేరుతో ఉన్నా గద్దర్, మాష్టార్జీ ప్రభావంతోనే పాటలు పాడుతూ వచ్చాయి. అందుకే దళిత ఉద్యమం మీద గద్దర్ ప్రభావం సాంస్కృతికంగా బలంగా ఉందనక తప్పదు. మనం ఎన్ని దృక్కోణాల నుంచి చూసినా ఆయన జాతి వైతాళికుడు. కుల మత భేదాలు లేని బౌద్ధ సిద్ధాంతగామి. ఆయన ఒక నశించని సామాజిక విప్లవ స్వరం. ఆయన పాట లతో లోకం మేల్కొంది. అందుకే ఆయన ఈ యుగం జాతి వైతాళికుడు. ఆయన పాటల బాటలో నడుద్దాం. కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నేత ‘ 98497 41695 -
మన ‘పాల్ రాబ్సన్’!
‘గద్దరమ్మ నోటికి దండం’ అనేవాళ్లు, ఇప్పుడు ‘గద్దర్’ నోటికి దండాలు పెట్టే రోజులొచ్చాయి! ఒక ఉద్యోగిగా సరి పెట్టుకుని, పెరుగుతున్న ధరలతోనే రాజీపడి బతుకు భారాన్ని చిరునవ్వుతో మోసుకుంటూ కాలక్షేపం చేయలేక, కళారంగాన్ని కదనరంగంగా మార్చిన విప్లవ కవితా ఉద్యమ వారసుడు, కవి, మధుర గాయకుడు అయిన గుమ్మడి విఠల్ రావు (గద్దర్) కాకతీయ మహాయుగానికి, తెలంగాణ విప్లవోద్యమానికి కారణమయిన తెలంగాణలో పుట్టి పెరిగిన వాడు. సామాజిక అసమానతలపైన, అన్యాయాలపైన అతని విమర్శ వ్యక్తిగతమైనది కాదు, వ్యవస్థాగతమైనది. నిత్య హత్యా సత్యమైన ఆస్తిహక్కుకు బద్ధవిరోధి. అది రద్దు కానంత వరకు ఈ కుల వ్యవస్థ, ఈ మత దురహంకార వర్గ సమాజం మారదనీ, మానవుడు మారడనీ నమ్ముతున్నవాడు. సరికొత్త బాణీలతో, సొంత గొంతుతో అట్టడుగు ప్రజల యాసలో, మాండలిక భాషలో కళారంగాన్ని విప్లవీకరించిన వ్యక్తిగా గద్దర్కు ఈ దేశంలోనే కాదు, ఖండాంతరాలలో కూడా పోలిక – నీగ్రో బానిసల బతుకులకు అర్థం చెప్పి వాళ్ళ బాధల గాథలే పల్లవిగా, అను పల్లవిగా, వీధి వీధినీ గానం చేసి అజ్ఞాత జీవితాలకూ, అస్థిరమైన ప్రవాస జీవితాలకూ నాద బ్రహ్మగా నిలిచిన పాల్ రాబ్సన్ ఒక్కడే! ఆ బానిసల గర్భశోకానికి శ్రుతిగా సంగీతం వెలయించిన పాల్ రాబ్సన్ 1950లలో ‘ఫిస్క్ జూబ్లీ గాయకుల’కు ప్రత్యక్ష వారసుడు. స్పానిష్ అంతర్ యుద్ధంలో సమర గీతాలు ఆలపించాడు. ఈ సమర కళాయాత్రను సహించలేని అమెరికా పాల కులు రాబ్సన్ నోరు నొక్కబోయారు. అతని గాన సభలను దేశ మంతటా నిషేధించారు. విదేశాలకు వెళ్ళకుండా పాస్పోర్ట్ నిరా కరించారు. అయినా జ్ఞాతంగానూ, అజ్ఞాతంగానూ దేశంలోనూ, దేశాంతరాలలోనూ ప్రభుత్వాలూ, అధికారులూ, సంస్థలూ, జీవన రంగంలో సర్వ విభాగాలకు చెందిన మేధావులూ రాబ్స న్ను తలకెత్తుకున్నారు. అలాంటివాడు మన గద్దర్. ‘ఫెస్క్ జూబ్లీ’ గాయకులకు రాబ్సన్ వారసుడైనట్లే, నూతన ఫక్కీలో శ్రీకాకుళ గిరిజనోద్య మానికి అక్షర రూపమిచ్చిన జముకుల కథకు జనకుడు, గాయ కుడూ అయిన పాణిగ్రాహి జానపద కళాసృష్టికీ ప్రత్యక్ష వార సుడు గద్దర్. పాణిగ్రాహి జముకుల కథలోని కథకుడైన చిన బాబు వయస్సు ఆనాటికి 14 ఏళ్ళే అయినా బుద్ధిలేని ప్రభుత్వం రైల్వే స్టేషన్లో జనం మధ్యనే అరెస్ట్ చేసి అర్ధరాత్రి అడవులలో ‘ఎన్కౌంటర్’ జరిపి ఆ ‘అభిమన్యుడి’ని పొట్టన పెట్టుకుంది! నాటి ఆంధ్ర కళారంగంలో విప్లవానికి అదే నాంది. రచ యితలను, కళాకారులను నిర్బంధించడం ఏ ప్రభుత్వ పతనా నికైనా తొలి మెట్టు అవుతుంది. అప్పుడు ఎవరికి వారే ఆలోచించుకుని కాంగో కవి ‘లెవెన్ ట్రీ’ అన్నట్టుగా ‘తన విముక్తికి తానే నడుం కడతాడు.’ కనుకనే శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంత కల్లోలానికి కలం, గళం సారథ్యం వహించిన పాణిగ్రాహి గానీ, తెలంగాణలో గిరిజన ప్రాంతాలలో దోపిడీ వ్యవస్థపై గజ్జె కట్టి గుండె చప్పుళ్ళు విన్పించిన గద్దర్ గానీ లక్షలాది జనాన్ని కదిలించారు. గద్దర్ బాణీ విప్లవ రచయితల సంఘానికి ‘పారాణి’గా అమరింది. ఆంధ్ర ప్రజా నాట్యమండలి చేతుల మీదుగా, ఒకనాటి సాంస్కృతిక పునరుజ్జీవన కాలంలో పునరుద్ధరణ పొందిన ఎన్నో జానపద కళారూపాలు ఆనాటి వాతావరణాన్ని పుణికి పుచ్చుకోగా ఇటీవల పాణిగ్రాహి, గద్దర్ చేపట్టిన కళా రూపాలు సరికొత్త ఫక్కీలో తెలుగు భారతి నొసట వీర రస గంగాధర తిలకాలు దిద్దాయి! అందుకే తెలుగు బుర్రకథను రమ్యమైన కళాఖండంగా తీర్చిదిద్ది దేశాన్ని ఊపివేసిన నాజర్ కూడా పాణిగ్రాహి, గద్దర్ ప్రయోగాలను కళ్ళ కద్దుకున్నాడు. కథకు, వర్ణనకు, హాస్యా నికి, గంభీరతకు, రౌద్రానికి, కరుణకు, కాఠిన్యానికి, బీభత్సానికి, రమ్యతకు, సభ్యతకు – ఒకటేమిటి, నవరసాలకు మించిన నవ్య పోషణకు నగలు తొడిగే సామాన్యుని నాగరికతా సంస్కృతుల నట్టింటి మాణిక్యంగా గద్దర్ బృందం దిద్ది తీర్చినదే జన నాట్యమండలి! అమరవీరులను తలచుకుంటూ అతను రాసిన ‘పాదాపాదాల పరిపరి దండాలు’, ‘సిరిమల్లె చెట్టుకింద’, ‘లాల్ సలామ్’ పాటలు, ఖవాలీ,సంగీత నృత్య రూపకాలు మరపురాని కళాస్మృతులు. గద్దర్, వంగపండు ప్రసాద్ (విశాఖ బాణీలో) ‘జజ్జనక జనారే’ అనే పాట విన్నప్పుడు ఈ జోస్టాలే 'Rumba' పాట గుర్తుకొస్తుంది! గద్దర్ అంగోలా కవి అగస్తినో నేటో లాంటివాడు. గద్దర్ రాష్ట్ర సరి హద్దులు దాటి, దండకారణ్యంలో దూకి, రాముడికి బదులు పరశు రాముడై సంచరించి, మణిపూర్, అస్సాం ఉద్యమాల ఊపిరిని కూడా పొదుగుకొని, భాషల అక్షరాభ్యాసం చేసి హైదరాబాద్లో మళ్ళీ పొద్దుపొడుపై వాలాడు! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు – రచనా కాలం ఫిబ్రవరి 25, 1990 abkprasad2006@yahoo.co.in -
డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన విద్యార్థిని
కరీంనగర్: డీజే పాటలు.. స్నేహితులతో డ్యాన్సులు.. చుట్టూ కేరింతలు.. ఆనందంతో ఆడిపాడుతున్న ఓ బాలిక ఒక్కసారిగా కుప్పకూలింది. అధ్యాపకులు ఆస్పత్రికి తరలిస్తుండగా.. గుండెపోటుతో మరణించింది. గంగాధర మండలం కొండన్నపల్లి శివారులోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో విషాదం నెలకొంది. శుక్రవారం ఫ్రెషర్స్ డే వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ విద్యార్థిని గుండు ప్రదీప్తి(16) గుండెపోటుతో మృతి చెందింది. గంగాధర మండలంలోని వెంకటాయిపల్లి గ్రామానికి చెందిన గుండు అంజయ్య–శారదల కూతురు ప్రదీప్తి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. శుక్రవారం కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకల సందర్భంగా డ్యాన్స్ చేస్తూ.. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ కుప్పకూలింది. ఉపాధ్యాయులు వెంటనే సీపీఆర్ చేస్తూ.. గంగాధర ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్ తరలిస్తుండగా.. మార్గంమధ్యలో చనిపోయింది. ప్రదీప్తి చిన్నప్పుడే గుండెకు రంధ్రం ఉండగా.. మందులు వాడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. -
జవ సత్వాలున్న జన గళం
ప్రజా గాయకుడిగా, ప్రజా ఉద్యమ గేయ రచయితగా దశాబ్దాల పాటు శ్రామిక, ఉత్పాదక రంగాలలోని పీడితుల్ని, అధికార వర్గాల పీడనల్ని ప్రతిబింబించిన నెత్తుటి, నిలువెత్తు మట్టి మనిషి గద్దర్. ఆయన ఆలోచన, రచనలు... ఆధునాతనంగానూ, గ్రామీణంగానూ రెండు విధాలుగా సాగాయి. గద్దర్ అంబేడ్కరిజంలోకి మారాక కుల వ్యవస్థ, అంటరానితనాలకు వ్యతిరేకంగా అనేక జానపద గేయాలు రాశారు. స్త్రీ జీవితం, ఆమె పడుతున్న శ్రమ, మానవత్వాలపై లోతైన తాత్వికతతో పాటలు కూర్చారు. ఆయన భౌతికకాయం, అందులో మిగిలి ఉన్న తుపాకీ తూటా సహా ‘మహాబోధి’ప్రాంగణంలో ఖననం అయినప్పటికీ... విముక్తి పోరాటానికి ఆయన రాసిన పాటలు ఎప్పటికీ సజీవంగా జనంలో ఉండిపోతాయి. న్యాయం కోసం తనకు తానుగా ఒక ప్రజా గీతంగా, ఒక ప్రజాయుద్ధ నౌకగా అవతరించిన గద్దర్ (75) – గుమ్మడి విఠల్ – ఆగస్టు 6న కన్నుమూశారు. ప్రజా గాయకుడిగా, ప్రజా ఉద్యమ గేయ రచయితగా దశాబ్దాల పాటు శ్రామిక, ఉత్పాదక రంగాలలోని పీడితుల్ని, అధికార వర్గాల పీడనల్ని ప్రతిబింబించిన నెత్తుటి, నిలువెత్తు మట్టి మనిషి గద్దర్. ప్రజా గేయ రచయితగా ఎదుగుతున్న క్రమంలో 1970లలో గద్దర్ రాసిన పాట తెలుగునాట మోతెత్తిపోయింది. సిరిమల్లె సెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మా / నీవు సినబోయి గూసున్న వెందుకమ్మో ఎందుకమ్మా రాడికల్ విద్యార్థి ఉద్యమం వైపు మళ్లి, తర్వాత ఒక జాతీయ బ్యాంకులో క్లర్కుగా చేసి, కొంతకాలానికే ఆ ఉద్యోగాన్ని వదిలి, తిరిగి ఉద్యమంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత, నక్సలైట్ ఉద్యమంగా ప్రసిద్ధి చెందిన కమ్యూనిస్టు విప్లవోద్యమంలో పూర్తి సమయం గాయ కుడిగా మారారు. చిన్న చిన్న సభల్లో, కొన్నిసార్లు వీధుల్లో పాటలు పడుతూ, జనాన్ని సమీకరిస్తూ సీపీఐ–ఎంఎల్ (పీపుల్స్ వార్)లో అందరికీ తెలిసిన వ్యక్తి అయ్యారు. పీడిత వ్యవసాయ ఉత్పాదక రంగ ప్రజానీకం మీద; భూస్వాముల దోపిడీలు, దౌర్జన్యాల మీద తనదైన శైలిలో పాటలు రాసి, పాడి, భారతదేశ సాంస్కృతిక రంగాన్ని కదం తొక్కించారు. సాయుధ విప్లవం మాత్రమే ప్రస్తుత వ్యవస్థకు ప్రత్యా మ్నాయాన్ని నిర్మించగలదని చాలాకాలం పాటు నమ్మికతో ఉన్నారు. గద్దర్ అనే తన పేరును ఆయన అమెరికా గదర్ ఉద్యమం నుంచి తీసుకున్నారు. చివరికి ఆ పేరు మావోయిస్టు పోరాటాలకు భారతీయ చిహ్నంగా మారింది. 1997లో గద్దర్ అజ్ఞాతం నుంచి జన జీవన స్రవంతిలోకి వచ్చినప్పుడు ఆయనపై జరిగిన కాల్పులలో ఐదు తూటాలు ఆయన శరీరంలోకి దిగబడ్డాయి. వైద్యులు నాలుగు తూటా లను బయటికి తీయగలిగారు. మిగతా ఒక తూటా మొన్నటి రోజున ఆయన అంతిమ శ్వాస తీసుకునే వరకు పాతికేళ్లకు పైగా ఆయన శరీరం లోపలే ఉండిపోయింది. ధైర్యం, దృఢచిత్తం, వివేకం, వినయం... అదే సమయంలో చిన్న పిల్లవాడి మనస్తత్వం. ఇవీ గద్దర్లోని గుణాలు. క్రమంగా ఆయనకు తెలిసి వచ్చినదేమంటే... మావోయిస్టు విప్లవం ఎక్కడికీ దారి తీయడం లేదని. దాంతో దళిత ఉద్యమం వైపు మళ్లి, ప్రజాదరణ పొందే విధంగా పాటలు రాయడం, పాడటం మొదలుపెట్టాడు. 1985లో కారంచేడు కమ్మ భూస్వాములు ఎనిమిది మంది దళితులను దారుణంగా హత్య చేసినప్పుడు ఆయన రాసిన పాట ఇది: కారంచెడు భూస్వాముల మీద కలబడి నిలబడి పోరుచేసిన దళిత పులులమ్మా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని యావత్ దళితులను ఏకం చేసేందుకు ఈ పాట ఆయుధంగా మారింది. అక్కడి నుంచి ఆయన అంటరాని తనం, అంబేడ్కరిజం, రాజ్యాంగవాదంపై పాటలు రాయడం ప్రారంభించారు. 1990లో మండల్ వ్యతిరేక ఉద్యమం దేశమంతటా వ్యాపించింది. సామాజిక న్యాయం, ప్రతిభ అన్నవి మండల్ అనుకూల,మండల్ వ్యతిరేక శక్తుల సైద్ధాంతిక లంగర్లు అయ్యాయి. కమ్యూనిస్టు విప్లవకారులు కూడా తమ అగ్రవర్ణ నాయకుల నేతృత్వంలో స్పష్టమైన వైఖరిని తీసుకోడానికి వెనుకంజ వేస్తున్నారు. ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’ అప్పటి ఎడిటర్ అరుణ్శౌరీ మేధోపరమైన మండల్ వ్యతిరేక ఉద్య మానికి నాయకత్వం వహించారు. ఆ సమయంలో గద్దర్ రాసిన పాట మండల్ అనుకూల శక్తులకు ఆయుధంగా మారింది. అరుణ్శౌరిగో నీకు ఆకలి బాధేమెరుక నెయ్యి కాడ నువ్వుంటే పియ్యికాడ మేముంటం ఈ పాట చాలామంది అగ్రవర్ణ విప్లవకారులకు నచ్చలేదు. కానీ మండల్ రిజర్వేషన్లు అమలు చేయాలని పోరాడుతున్న ఓబీసీ/ ఎస్సీ/ ఎస్టీలకు స్ఫూర్తినిచ్చేందుకు గద్దర్ ఆ పాటను బహిరంగ సభలలో పాడుతూనే ఉన్నారు. 1990వ దశకం చివరిలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని మావోయిస్టులు నిర్ణయించుకున్నారు. మెల్లిగా గద్దర్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మూల శక్తిగా మారారు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా... బలే.. బలే.. బలే... ఈ పాట తెలంగాణ ఉద్యమానికి ప్రతీకగా నిలిచింది. గద్దర్ ఎప్పుడూ టీఆర్ఎస్కు బహిరంగ మద్దతుదారు కానప్పటికీ మావోయి స్టుల మద్దతుతో సమాంతర రాడికల్ తెలంగాణ అనుకూల గ్రూపు లను నడిపించారు. ఈ క్రమంలో మావోయిస్టు భావజాలంతో గద్దర్ వ్యతిరేకించారు. వర్గపోరు మాత్రమే సరిపోదు, కులపోరాటాన్ని చేపట్టాలని భావించారు. అనేక విముక్తి బలాలను కలిగి ఉన్న భారత రాజ్యాంగాన్ని గుర్తించడం ప్రారంభించారు. భారత రాజ్యాంగం పట్ల, అంబేడ్కర్ పట్ల తమ దృక్పథాన్ని మార్చుకోవాలని మావోయిస్టులను ఒప్పించేందుకు పార్టీతో అంతర్గతపోరును సాగించారు. అయితే సహజంగానే వారు తమ పాత వర్గ పోరాట పంథాను మార్చుకోడానికి నిరాకరించారు. దాంతో పార్టీ నుంచి బయటికి వచ్చి నేటి భారత రాజ్యాంగాన్ని సమర్థించిన, సమర్థిస్తున్న అనేక ఇతర శక్తులతో కలిసి పని చేశారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విభిన్న రాజకీయ, సైద్ధాంతిక శక్తులతో సన్నిహితంగా మెలిగారు. అప్పటికే గద్దర్పై ఆయన మావోయిస్టుగా ఉన్నప్పటి కేసులు అనేకం ఉన్నాయి. ఆరోగ్యం కూడా క్షీణించడం మొదలైంది. ఆ సమయంలోనే కొంత కాలం గద్దర్, నేను... సీపీఎం మద్దతు ఉన్న బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్లో కలిసి పని చేశాం. మరోవైపు ఆయన కాంగ్రెస్తోనూ సత్సంబంధాలు కొనసాగించారు. తెలంగాణలో రాహుల్ గాంధీ ప్రసంగించిన కొన్ని బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఢిల్లీలో రాహుల్ను, సోనియాగాంధీని కలిశారు. గద్దర్ జీవితం వీరోచిత పోరాటాల అవిశ్రాంత గాథ. ఒక్క రెండు పాటలు తప్ప మిగతా ముఖ్యమైన పాటలన్నీ తనే రాసి, పాడినవి. గద్దర్ పాడటంతో ప్రాచుర్యం పొందిన ‘బండెనక బండి కట్టి’ పాట 1940లలో నిజాంకు, రజాకర్లకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజా పోరాటంలో యాదగిరి రాసినది. రెండో పాట: ఈ ఊరు మనదిర, ఈ వాడ మనదిర / దొర ఏందిరో, వాని పీకుడేందిరో. ఈ పాటను మరో ప్రముఖ దళిత గాయకుడు, రచయిత గూడ అంజయ్య రాశారు. గద్దర్ తన గళంతో ఆ పాటను ఆంధ్రప్రదేశ్లోని దాదాపు ప్రతి పల్లెకు తీసుకెళ్లారు. గద్దర్ ఆలోచన, రచన... ఆధునాతనంగానూ, గ్రామీణంగానూ రెండు విధాలుగా సాగాయి. గద్దర్ అంబేడ్కరిజంలోకి మారాక కుల వ్యవస్థ, అంటరానితనాలకు వ్యతిరేకంగా అనేక జానపద గేయాలు రాశారు. స్త్రీ జీవితం, ఆమె పడుతున్న శ్రమ, మానవత్వాలపై లోతైన తాత్వికతతో పాటలు కూర్చారు. వంటపని, వీధుల పారిశుధ్యం,ఇంటిని శుభ్రంగా ఉంచే హింసాత్మక శ్రమలలోని నొప్పిని పాటలుగా మలిచారు. ఇంటికి చీపురు చేసే సేవలోని గొప్పతనంపై ఆయన రాసి, పాడిన పాట అత్యంత తాత్వికమైనది. అంబేడ్కర్ అడుగుజాడల్లో గద్దర్ తన పూర్వపు కమ్యూనిస్టు నాస్తికత్వాన్ని పక్కనపెట్టి సరైన బౌద్ధేయుడు అయ్యారు. గద్దర్ భౌతికకాయం, అందులో మిగిలి ఉన్న తూటా సహా ‘మహాబోధి’ (పేద పిల్లల కోసం ఆయనే స్థాపించిన పాఠశాల) ప్రాంగణంలో ఖననం అయినప్పటికీ, మానవ సమానత్వంపై ఆయన ప్రేమ, విముక్తి పోరాటానికి ఆయన రాసిన పాటలు ఎప్పటికీ సజీవంగా జనం జీవనంలో ఉండిపోతాయి. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
శుభకార్యాల్లో సినిమా పాటలు.. కాపీ రైట్ కాదు.. కేంద్రం క్లారిటీ..
ఢిల్లీ: వివాహాది శుభకార్యాలలో సినిమా పాటలను వినియోగించడం కాపీరైట్ ఉల్లంఘన కిందకు రాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇలాంటి ఘటనల్లో కాపీరైట్ సొసైటీలు రాయల్టీని వసూలు చేయకూడదని స్పష్టం చేసింది. శుభకార్యాలలో మూవీ సాంగ్స్ ప్లే చేయడంపై రాయాల్టీ వసూలు చేస్తున్నారని పలు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్, ఇండస్ట్రీ, ఇంటర్నల్ ట్రేడ్(డీపీఐటీ) ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. వివాహాది శుభకార్యాల్లో సినిమా పాటల ప్రదర్శనకు రాయల్టీ వసూలు చేస్తున్నాయంటూ అనేక ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపిన డీపీఐటీ .. ఇది కాపీరైట్ యాక్ట్ 1957లోని సెక్షన్ 52(1)కు విరుద్ధమని పేర్కొంది. మతపరమైన కార్యక్రమాలు, అధికారిక వేడుకల్లో ప్రదర్శించే నాటక, ఏదైనా సౌండ్ రికార్డింగ్లు కాపీరైట్ ఉల్లంఘన కిందకు రావని సెక్షన్ 52 (1) (za) చెబుతోందని అధికారులు స్పష్టం చేశారు. వివాహ ఊరేగింపుతోపాటు పెళ్లికి సంబంధించిన ఇతర కార్యక్రమాలు కూడా మతపరమైన వేడుకల కిందకే వస్తాయని డీపీఐటీ తెలిపింది. వీటిని దృష్టిలో ఉంచుకొని కాపీరైట్ సంస్థలు వీటికి దూరంగా ఉండాలని పేర్కొంటూ ప్రకటన విడుదల చేసింది. ఏదైనా సంస్థల నుంచి రియాల్టీకి సంబంధించిన డిమాండ్లు వస్తే వాటిని అంగీకరించవద్దని అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: వాహనదారుల భరతం పడుతున్న ట్రాఫిక్ పోలీసులు...
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement