-
సంజయ్ దత్ బయోపిక్.. ఏ పాత్రల్లో ఎవరు?
న్యూఢిల్లీ: ఎంతో కాలంగా వేచి చూస్తున్న సంజయ్ దత్ బయోపిక్ సంజు టీజర్ ఇటీవలే విడుదలైంది. ఈ సినిమాలో సంజయ్ దత్ పాత్రను రణబీర్ కపూర్ పోషిస్తున్న సంగతి తెల్సిందే. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు రాజ్కుమార్ హిర్వాణీ దర్శకత్వం వహిస్తున్నారు. సంజయ్ దత్ తన 22 ఏట నుంచి ముంబై బాంబు పేలుళ్ల కేసులో ఇరుకున్న దాకా జరిగిన పరిణామాలను ఈ సినిమాలో దర్శకుడు చూయించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఫైనల్ ట్రైలర్ను త్వరలోనే విడుదల చేస్తామని దర్శకుడు తెలిపారు. ఈ సినిమాలో నటిస్తున్న పరేష్ రావల్, మనిషా కోయిరాలా, దియా మీర్జా పాత్రల గురించి మీడియాకు వెల్లడించారు. సునీల్ దత్గా పరేశ్ రావల్ ఈ సనిమాలో సంజయ్ దత్ తండ్రి సునీల్ దత్ పాత్రను పరేష్ రావల్ పోషిస్తున్నట్లు దర్శకుడు ధృవీకరించారు. తర్వాత విడుదల చేసే పరేష్ను ఇంట్రడ్యూస్ చేస్తామని తెలిపారు. నర్గీస్ దత్గా మనీషా కోయిరాలా సంజయ్దత్ తల్లిపాత్రకు మనీషా కోయిరాలాను తీసుకుంటున్నట్లు దర్శకుడు తెలిపారు. సంజయ్ దత్ నటించిన తొలి సినిమా విడుదలకు మూడు రోజుల ముందు నర్గీస్ క్యాన్సర్తో చనిపోయింది. మనీషా కోయిరాలా కూడా క్యాన్సర్ బాధితురాలే. విదేశాలలో చికిత్స తీసుకున్న అనంతరం క్యాన్సర్ మహమ్మారి నుంచి మనీషా విజయవంతంగా బయటపడిన విషయం తెల్సిందే. సంజయ్ దత్, మనీషా కోయిలారా కలిసి యాల్గార్, కార్టూస్, సనమ్ చిత్రాల్లో నటించారు. మాన్యతా దత్గా దియా మీర్జా సంజయ్ దత్ జీవితాన్ని సమూలంగా మార్చిన మూడో భార్య మాన్యతా దత్ పాత్ర నటి దియా మీర్జాను ఎంపిక చేశారు. వీరిద్దరికీ 2008లో పెళ్లి అయిన సంగతి తెల్సిందే. సంజయ్ జైలుకు వెళ్లిన తర్వాత ఆయన వ్యాపారాలన్నీ ఆమెనే చక్కబెట్టేవారు. సంజయ్ మొదటి భార్య రిచా శర్మ, రెండో భార్య రియా పిళ్లైల పాత్రలకు ఎవరిని తీసుకునేది దర్శకుడు ధృవీకరించలేదు. సంజయ్ బాల్య మిత్రుడి పాత్రకు విక్కీ కౌశల్ సంజయ్ దత్ బాల్య మిత్రుడు కుమార్ గౌరవ్ పాత్రకు విశాల్ కౌశల్ను తీసుకుంటున్నట్లు ఊహాగానాలు గతంలో వినిపించాయి. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ విశాల్ కౌశల్ను ఈ పాత్రకు తీసుకుంటున్నట్లు దర్శకుడు చెప్పారు. సంజయ్ దత్ రెండో సోదరి నమ్రతా దత్ భర్తే ఈ కుమార్ గౌరవ్. తొలి చిత్ర సహనటి పాత్రకు సోనమ్ సంజయ్ దత్ తొలి చిత్రం రాఖీలో సంజయ్తో జోడీ కట్టిన టీనా మునిమ్ పాత్రకు సోనమ్ కపూర్ను తీసుకుంటున్నట్లుగా తెలిసింది. అయితే ట్రైలర్ వస్తేగానీ ఈ విషయంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సల్లూ భాయ్ పాత్రకు జిమ్ సర్భ్ సంజయ్ దత్కు అత్యంత సన్నిహిత మిత్రుడు, బాలీవుడ్ కండల నటుడు సల్మాన్ ఖాన్ పాత్రకు జిమ్ సర్భ్ను తీసుకుంటున్నట్లు రూమర్లు వస్తున్నాయి. ఒకానొక సమయంలో వారిద్దరూ చాలా సన్నిహితంగా మెలిగారు. ఇద్దరూ కలిసి సాజన్, చల్ మేరే భాయ్, ఓమ్ శాంతి ఓం సినిమాల్లో నటించారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ పాత్ర ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఈ విషయంపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. జర్మలిస్టు పాత్రలో అనుష్క శర్మ ఈ సినిమాలో అనుష్క శర్మ జర్మలిస్టు పాత్ర పోషిస్తున్నట్లు తెలియవచ్చింది. బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి కొన్ని కఠినమైన ప్రశ్నలు అడిగే జర్నలిస్టు పాత్రలో ఆమె కనిపించనున్నట్లు సమాచారం. కరిష్మా టన్నా, బొమన్ ఇరానీ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించనున్నారు. కరిష్మా టన్నా, మాధురీ దీక్షిత్ పాత్రంలో, బొమన్ ఇరానీ, కాంటే సినిమా దర్శకుడు సంజయ్ గుప్తా పాత్రలకు తీసుకుంటున్నట్లు సినిమా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. సంజయ్ దత్ బయోగ్రఫీ ఆధారంగా తీస్తోన్న ఈ చిత్రం జూన్ 29న విడుదల కానుంది. -
బాహుబలి కంటే ఒకటి ఎక్కువే!
‘బాహుబలి’ ఎన్ని పార్టులుగా తీశారు? రెండు! చిత్రీకరణ ప్రారంభించిన కొన్ని రోజుల తర్వాత దర్శకుడు రాజమౌళి అండ్ కో రెండు పార్టులుగా తీస్తున్నట్టు చెప్పారు. హిందీలో ఈ సిన్మాను విడుదల చేసిన ప్రముఖ దర్శక–నిర్మాత కరణ్ జోహార్, మేం ఏమన్నా తక్కువా? అన్నట్టు 3 పార్టులుగా ఓ సినిమా (‘బ్రహ్మాస్త్ర’)ను తీస్తున్నట్టు ప్రకటించారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్, కపూర్స్ వారసుడు– యంగ్ హీరో రణబీర్, ఆలియా భట్ ముఖ్య తారలుగా నటించనున్న ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఫస్ట్ పార్టును 100 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తారట! ఈ దర్శకుడు రణబీర్కి క్లోజ్ ఫ్రెండ్. తనదీ ఫిల్మీ బ్యాగ్రౌండే. ఆల్రెడీ రణబీర్ హీరోగా ‘వేకప్ సిద్’, ‘యే జవానీ హై దివానీ’ సినిమాలు తీశారు. ఇప్పుడు ఎలాంటి సినిమా తీయబోతున్నారో? స్నేహితుడు హీరోగా ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేసే సినిమా తీస్తారా? వెయిట్ అండ్ సీ!! హిందీలో హృతిక్ రోషన్ ‘క్రిష్’ ఫ్రాంచైజీలో మూడు సిన్మాలు వచ్చాయి. కానీ, ఒకటి హిటై్టన తర్వాత మరొకటి అనౌన్స్ చేశారు. షూటింగ్కి ముందే ఓ సినిమాను మూడు పార్టులుగా తీస్తున్నట్టు ప్రకటించడం ఇదే ఫస్ట్ టైమ్. -
దీపికపై ఓ కన్నేసిన కత్రినా
ప్రియుుడు రణబీర్కపూర్ తన చేతులు దాటి పోకుండా అష్టకష్టాలూ పడుతోంది సోగకళ్ల సుందరి కత్రినాకైఫ్. బాయ్ఫ్రెండ్స్ను ఎప్పటికప్పుడు ‘అప్డేట్’ చేసే స్టార్ హీరోరుున్ దీపికా పడుకొనేపై ఓ కన్నేసి ఉంచింది. కారణం... ప్రస్తుతం దీపిక... రణబీర్తో కలిసి ‘తవూషా’ చిత్రంలో నటిస్తుండటమే. బిజీ షెడ్యూల్స్ ఉన్నా వాటన్నింటినీ వారుుదా వేసుకొని మరీ షూటింగ్ స్పాట్లోని బాయ్ఫ్రెండ్ కోసం పరుగెత్తుతోంది కత్రినా. భారత్లో జరిగే ఈ షెడ్యూల్ ముగిసే వరకూ రణబీర్తోనే ఉంటానంటోంది.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement