సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం వరుసగా 84వరోజూ మంగళవారం ఉధృతంగా సాగింది. రాష్ర్టం ముక్కలైతే తమ భవిష్యత్తు అంధకారమవుతుందంటూ విద్యార్థిసంఘాలు ఆందోళన చేపట్టాయి. తిరుపతి ఎస్వీ వర్సిటీలో జరిగిన రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు చెందిన విద్యార్థుల సదస్సు ఎంపీలు రాజీనామాలు చేసేవరకు ఉద్యమించాలని తీర్మానించింది. కర్నూలు జిల్లా కోసిగిలో నిర్వహించిన విద్యార్థి గర్జన జరిగింది. రాష్ట్రం విడిపోతే ఉపాధి అవకాశాలు మృగ్యమై విద్యారంగం తిరోగమనం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో రైతుగర్జన పేరిట బహిరంగసభ నిర్వహించారు. కర్నూలు లో భూగర్భ జలశాఖ ఉద్యోగులు ప్రదర్శన నిర్వహించారు.
అనంతపురంలో యూత్ జేఏసీ ఆధ్వర్యంలో టవర్ క్లాక్ సర్కిల్లో మానవహారం నిర్మించారు. ప్రజాప్రతినిధుల తీరును నిరసిస్తూ కుందుర్పిలో సమైక్యవాదులు గాడిదకు వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. సమైక్యాంధ్ర జేఏసీ పిలుపుమేరకు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. విజయవాడలోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో కేంద్రహోంమంత్రి షిండేకు మెసెజ్ల ద్వారా సమాచారం పంపించారు. ముదినేపల్లి మండలం చిగురుకోటలో ఉపాధ్యాయ జేఏసీ నేతలు గడపగడపకు మేల్కొలుపు పేరుతో ఇంటింటికీ వెళ్లి సమైక్యాంధ్ర ఆవశ్యకతను వివరించారు. నాగాయలంకలో జేఏసీ నాయకులు రాస్తారోకో చేశారు. జగ్గయ్యపేటలో విద్యార్థులు పిరమిడ్ల ఆకారంతో నిలబడి నిరసన వ్యక్తం చేశారు. కలిదిండి సెంటరులో రైతులు దిగ్విజయ్సింగ్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమంలో కదంతొక్కుతున్న పార్టీ శ్రేణలు మంగళవారం కూడా విభిన్న రూపాల్లో ఆందోళనలు కొనసాగించాయి. వైఎస్సార్ జిల్లా పులివెందులలో పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో కార్యకర్తలు రాస్తారోకో చేపట్టారు. చిత్తూరు జిల్లా పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథ్రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో చేపట్టారు. శిబిరం వదే ్ద రోడ్డు పక్కన చెప్పులు కుట్టి, బూట్ పాలిష్ చేసి, రోడ్లు శుభ్రం చేసి నిరసన తెలిపారు. తిరుపతిలో తుడా మైదానం వద్ద ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మూటలుమోసి నిరసన వ్యక్తంచేశారు. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రలో ఉన్నత విద్యను అభ్యసించిన యువత ఇలా మూటలు మోసుకొని వచ్చే ఆదాయంతో జీవించాల్సిందేనని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.
రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని కోరుతూ శ్రీకాళహస్తిలో పార్టీ నేత బియ్యపు మధుసూదనరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురంలో పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు కల్యాణి ఆధ్వర్యంలో వృత్తి పనివారు, రైతులు, రజకులు, చేనేత కార్మికులు పనిముట్లతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కృష్ణాజిల్లా చాట్రాయి మండలంలోని కృష్ణారావుపాలెంలో పార్టీ కార్యకర్తలు వర్షంలో తడుస్తూనే ధర్నా చేపట్టారు. ఇక ఈనెల 2వతేదీ నుంచి కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని అన్ని మండలాల్లోనూ పార్టీ శ్రేణులు చేపట్టిన రిలే నిరశన దీక్షలు నిరవధికంగా కొనసాగుతున్నాయి.
విద్యార్థుల పోరుకేక.. కదంతొక్కిన వైఎస్సార్ సీపీ శ్రేణులు
Published Wed, Oct 23 2013 4:11 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
ఇండియా కూటమితో విభేదాలు.. వెనక్కి తగ్గిన దీదీ
నా కోసం కొంత డబ్బు కావాలి.. అందుకే నేనే అడిగా: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
సీఏఏ చట్టం కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
100 రోజులకు బ్లూ ప్రింట్ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తప్పక చదవండి
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement