జనసేన డీలా.. పిఠాపురంలోనూ పవన్ గెలుపుపై అనుమానాలే....
జనసేన డీలా పడింది... పోలింగ్ తర్వాత సరళి చూసిన నేతలలో నిరుత్సాహం ఆవహించింది. క్రాస్ ఓటింగ్ భయమూ జనసేన నేతలను వెన్నాడుతోంది. సొంత పార్టీ నేతలను నమ్మకపోవడమూ నష్టమే కలిగించిందంటున్నారు. దీనికి తోడు టీడీపీ ఓటు పూర్తిగా బదిలీ కాకపోవడంపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక కాపు సామాజికవర్గం మినహా మిగిలిన సామాజిక వర్గాల ఓట్లని ఆకర్షించలేకపోయామని భావిస్తున్నారు. గోదావరి జిల్లాలలో ఆశించిన ఫలితాలు కష్టమేనంటున్నారు. ఈ నేపధ్యంలో ఫలితాలపై నేతలు అయోమయంగా ఉన్నారు. పోలింగ్ తర్వాత పవన్ ప్యాకప్ చెప్పేయడమూ జనసేన పరిస్ధితిని తెలియజేస్తోంది.పార్టీ పెట్టి పదేళ్లు అయినా..పోలింగ్ ముగిసిన తర్వాత జనసేన గప్ చుప్ అయింది. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్యాకప్ చెప్పేయడం పార్టీని డైలమా పడేస్తోంది. పోలింగ్ సరళిపై విశ్లేషణ తర్వాత ఆ పార్టీకి ఓటమి భయం పట్టుకుంది. జనసేన ఏర్పడి దశాబ్ధకాలం దాటుతున్నా ఇప్పటికీ అద్యక్షుడు పవన్ అసెంబ్లీలోకి అడుగుపెట్టలేకపోవడం పెద్ద మైనస్ గానే చెప్పుకోవాలి. ఆది నుంచి పవన్ వ్యవహార శైలే పార్టీని నట్టేట ముంచిందని భావిస్తున్నారు. ఇపుడు కూడా టీడీపీతో జతకట్టడం..పైగా టీడీపీ కోసం దిగజారిపోయి బలమైన సీట్లను సైతం వదులుకోవడం. కేవలం 21 సీట్లకే పరిమితమవడం ఇవన్నీ జనసేన పార్టీని కొంపముంచాయంటున్నారు.ఒక సిద్దాంతం, లక్ష్యం లేకుండాకేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహడ్డిని పదవి నుంచి దింపడానికే తాను కూటమిగా ఏర్పడ్డామని, ఓటు చీలకూడదంటూ పవన్ ప్రతీ సభలోనూ చెప్పిన వ్యాఖ్యలు పూర్తిగా నెగటివ్గా మారాయంటున్నారు. పార్టీకి ఒక సిద్దాంతం, లక్ష్యం లేకుండా సీఎం వైఎస్ జగన్పై అక్కసుతో కేవలం ఎదుట పార్టీపై బురదజల్లడం ప్రజలలో వ్యతిరేకత పెంచిందంటున్నారు. వాస్తవానికి జనసేన పార్టీ కనీసం 50, 60 సీట్లలో నైనా పోటీ చేయాలని కాపు నేతలు సూచించారు.నేతల మాటలను పెడచెవినట్టి..మాజీ మంత్రి హరిరామజోగయ్య లాంటి నేతలైతే ఏకంగా పలుమార్లు పవన్కు లేఖ రాయడమే కాదు స్వయంగా కలిసి కూడా సగం సీట్లలోనైనా పోటీ చేయాలని సూచించారు. అయితే పవన్ ఆ మాటలన్నీ పెడచెవిన పెట్టి కేవలం 21 అసెంబ్లీ సీట్లు, రెండు పార్లమెంట్ సీట్లకే పరిమితమయ్యారు. అందులోనూ కూడా జనసేనని నమ్ముకుని దశాబ్ధకాలంగా పార్టీకోసం కష్టపడుతున్న నేతలకి కాకుండా ఇతర పార్టీ నేతలకి అవకాశం ఇవ్వడం, అలాగే జనసేన పోటీ చేయాల్సిన స్ధానాలని టీడీపీకి వదిలేయడం పార్టీలో చిచ్చురేపింది సీనియర్ నేతలకు తీవ్ర ఆగ్రహంముఖ్యంగా గోదావరి జిల్లాలతో పాటు విజయవాడలోనూ ఈ వ్యవహారాలే పార్టీని రోడ్డున పడేశాయి. ఇలా మొదట నుంచి పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని చివరి నిమిషంలో అవనిగడ్డ సీటులో టిడిపి నుంచి మండలి బుద్ద ప్రసాద్ లాంటి నేతలను జనసేనలో చేర్చుకుని టిక్కెట్ ఇవ్వడం పార్టీ సీనియర్ నేతలకి తీవ్ర ఆగ్రహం కలిగించింది. ఇక పాలకొండలో సైతం ఇదే విధంగా టీడీపీకిి చెందిన నిమ్మక జయరాజుని జనసేనలో చేర్చుకుని టికెట్ ఇవ్వడం వివాదాన్ని రాజేసింది. అలాగే తిరుపతిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులుకి కూడా చివరి నిమిషంలో పార్టీలో చేర్చుకుని టిక్కెట్ ఇవ్వడంపై జనసేనలో అలజడి రేపింది.జనసేన బలం ఉన్న సీట్లని టీడీపీకి త్యాగంఅదే విదంగా మచిలీపట్నం ఎంపి సీటుని వైఎస్సార్సీపీ సిట్టింగ్ ఎంపి బాలశౌరికి ఇవ్వడం జనసేన నేతలని తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. ఇక గోదావరి జిల్లాలలో అయితే అక్కడ పార్టీ నియోజకవర్గి ఇన్ చార్జిలకి వెన్నుపోటు పొడుస్తూ జనసేన బలం ఉన్న సీట్లని సైతం టీడీపీకి త్యాగం చేయడం తీవ్ర నిరాశలోకి నెట్టింది. జనసేనకు గుడ్బైదీంతో కాకినాడ రూరల్ నుంచి మాజీ మేయర్ సరోజ, అమలాపురం ఇన్ చార్జి శెట్టి బత్తుల రాజాబాబు, రాజోలు ఇన్ చార్జి బొంతు రాజేశ్వరరావు, ముమ్మిడవరం ఇన్ చార్జి పితాని బాలకృష్ణ తదితరులు ఏకంగా జనసేనికు గుడ్ బై చెప్పి వైఎస్సార్సీపీలో చేరారు. అలాగే విజయవాడ పశ్చిమ సీటు ఆశించిన పోతిన మహేష్ కి కాకుండా బీజేపీకి వదిలేయడం కూడా పెద్ద వివాదాన్నే సృష్టించింది. పవన్ శైలిపై విమర్శలుచివరి నిమిషం వరకు పోతిన మహేష్ పెద్ద ఎత్తున విజయవాడ పశ్చిమ టిక్కెట్ కోసం ప్రయత్నించి విఫలమై ఆఖరికి వైఎస్సార్సీపీలో చేరిపోయి పవన్ శైలిపై పూర్తి స్ధాయిలో ద్వజమెత్తారు. అడుగడుగునా పవన్ను ప్రశ్నిస్తూ ఇరకాటంలో పెట్టారు.ఇక జగ్గంపేటలో అయితే పాఠంశెట్టి సూర్యచంద్ర జనసేనకు షాక్ ఇచ్చి ఇండిపెండెంట్గా బరిలోకి దిగారు. ఇక అనకాపల్లి సీటు విషయంలో కూడా చివరి నిమిషంలో పార్టీలో చేరిన మాజీ మంత్రి కొణతాల రామకృ్ణ కి ఇవ్వడం వివాదాస్పదమైంది. ఇక కాకినాడ రూరల్లో పంతం నానాజీకి టిక్కెట్ ఇవ్వడంతో నిరాశపడిన మాజీ మేయర్ సరోజ తీవ్ర స్ధాయిలో ద్వజమెత్తుతూ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరారు. ఒక్క మహిళకి కూడా టికెట్ ఇవ్వకపోవడం తీవ్ర నిరాశఇక రాజమండ్రి రూరల్ ఆశించి జనసేనకి పనిచేసిన కందుల దుర్గేష్ను టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి కోసం బుజ్జగించి చివరికి ఆయనను ఏమాత్రం అవగాహనలేని నిడదవోలు నియోజకవర్గానికి చివరి నిమిషంలో పంపడం అక్కరకు రాకుండా పోయిందంటున్నారు. ఇక గత ఎన్నికల సమయంలో భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆ స్ధానాన్ని టీడీపీ ఇన్ చార్జి రామాంజనేయులుకి జనసేన కండువా కప్పి ఇవ్వడంపైనా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక ఒక్క మహిళకి కూడా టికెట్ ఇవ్వకపోవడంపైనా మహిళా నేతలలో తీవ్ర నిరాశని మిగిల్చింది..ఇలా సీట్ల పంపకాలలోనే సొంత పార్టీలోనే పవన్ తన తీరుతో నిప్పు రాజేసుకున్నారు.ఇతర పార్టీల నుంచి చేర్చుకుని టికెట్జనసేన పోటీ చేసిన నాలుగైదు స్ధానాలు మినహా మిగిలిన స్ధానాలను ఇతర పార్టీల నుంచి చేర్చుకుని టిక్కెట్ ఇవ్వడం వల్ల జనసేన బలం ఎన్నికల ముందే తేలిపోయిందని చెబుతున్నారు. ప్రజల్లోకి ఈ సంకేతాలు బలంగా వెళ్లడంతో ఎదురుగాలి వీచిందంటున్నారు. గత ఎన్నికల సమయంలో పవన్ గాజువాక, భీమవరం నియోజకవర్గాలలో పోటీచేసి ఘోరంగా ఓడిపోయారు .ఆ తర్వాత ఆ రెండు నియోజకవర్గాలను పవన్ పట్టించుకోలేదు. ఎన్నికలు ముగియగానే పవన్ రెండు నియోజకవర్గాలలో ఇళ్లతో పాటు పార్టీ కార్యాలయాలను ఖాళీ చేశారు. ఆ తర్వాత తనకి ఓటు వేసిన ఆ రెండు నియోజకవర్గాల ప్రజలను పట్టించుకోలేదు. దీంతో ఎన్నికల తర్వాత పవన్ తమకు అందుబాటులో ఉండరనే భావన ప్రజలలో పెరిగిపోయింది. ఈ ఎన్నికలలో పవన్ ఆ రెండు నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగకుండా పిఠాపురం ఎంచుకోవడం వెనుక కారణం ఇదే అంటున్నారు. అలాగే తన గెలుపుకోసం పవన్ వారంలో మూడు రోజుల పాటు పిఠాపురంలోనే ప్రచారం చేసినా ఫలితం తమకు అనుకూలంగా ఉంటందని నేతలు ధీమా వ్యక్తం చేయలేకపోతున్నారు. ఇక పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తున్నట్లు ప్రకటన రాగానే టీడీపీ ఇంచార్జి చార్జి వర్మ నుంచి వచ్చిన వ్యతిరేకత తీవ్ర ఇరకాటంలో పడేసింది. ఆ తర్వాత పవన్ చంద్రబాబుతో చెప్పించుకుని స్వయంగా వర్మ ఇంటికి వెళ్లి షో చేసినా అది పనిచేయలేదంటున్నారు.వంగా గీత పోటీ పవన్కు మైనస్ పిఠాపురం నుంచి ఒకసారి పవన్ కళ్యాణ్ నెగ్గితే శాశ్వతంగా తన సీటుకి ఎసరే అన్న ఉద్దేశంతో వర్మ పవన్ గెలుపుకోసం పూర్తి స్ధాయిలో పనిచేయలేదని ప్రచారం జరుగుతోంది. ఇక పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నుంచి ఎంపీ వంగా గీత పోటీ చేయడం పవన్కు మైనస్ అయిందంటున్నారు. నాలుగు దశబ్ధాలగా రాజకీయాల్లో ఉన్న వంగా గీతకి కాకినాడ జిల్లాలో మంచి పేరుంది. వంగా గీత జెడ్పీ చైర్మన్గా రాజ్యసభ సభ్యురాలిగా, ఎమ్మెల్యేగా, కాకినాడ ఎంపీగా పనిచేసిన అనుభవంతో పాటు ప్రజలలో కలిసిపోయినవైనం వంగా గీతకి పాజిటివ్ అయిందంటున్నారు.దీనికి తోడు వంగాగీతపై పవన్ చేసిన వ్యాఖ్యలు ప్రజలలో ఆమెపై సానుభూతి పెంచేలా చేశాయంటున్నారు. ఎన్నికల ప్రచారం చివరి రోజు వంగా గీత చేసిన ప్రసంగం. అదే సమయంలో గీతమ్మని గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తానంటూ సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రసంగం ఇవన్నీ ఓటర్లని ఆలోచింపచేశాయంటున్నారు.పవన్ గెలిచినా ఎలాగూ సీఎం కాలేరుపవన్ గెలిచినా కూడా 21 సీట్లతో ఎలాగూ సీఎం కాలేరని... కనీసం మంత్రిగా కూడా అవకాశం ఇస్తారో లేదో తెలియదని భావించిన ఓటర్లు వంగా గీతని గెలిపిస్తే తమ నియోజకవర్గ ఎమ్మెల్యే డిప్యూటీ సిఎం అవుతుందన్న ఉద్దేశంతోనే మహిళా ఓటర్లు పెద్ద ఎత్తున క్యూలు కట్టారంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ గెలుపుపై పోలింగ్ ముందు వరకు భారీ బెట్టింగ్లకు దిగిన జనసేన నేతలు ఇపుడు మాత్రం ధీమా వ్యక్తం చేయలేకపోతున్నారట.జనసేన పార్టీ గోదావరి జిల్లాలనే నమ్ముకుని బరిలోకి దిగింది. మొదట నుంచి తూర్పుగోదావరి , పశ్చిమగోదావరి జిల్లాలపైనే పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారు.ఈ రెండు జిల్లాలలో కాపు సామాజికవర్గం ఓటర్లు అధికంగా ఉండటంతో పవన్ తనకి ఈ రెండు జిల్లాలలో ఎదురు ఉండదనుకున్నారు. జనసేన మొత్తంగా 21 అసెంబ్లీ స్ధానాలలో పోటీ చేస్తే ఇందులో ఈ రెండు జిల్లాల నుంచి 11 స్ధానాలు ఉన్నాయి. అయితే గోదావరి జిల్లాలలో కాపు ఓటర్లను తప్పితే మిగిలిన సామాజికవర్గాలని పట్టించుకోకపోవడం. అందరి నాయకుడిగా ఉండాల్సిన పవన్ కాపు చట్రంలోనే ఉండిపోవడం పార్టీకి చేటు తెచ్చాయంటున్నారు.ఈ నేపథ్యంలో కాపు ఓట్లలో కూడా పూర్తిగా తమకు పడలేదని నేతలు చెబుతున్నారు. ఇక టీడీపీ కోసం పవన్ ఎన్ని త్యాగాలు చేసినా టిడిపి నుంచి మాత్రం పూర్తి స్ధాయిలో ఓట్ల బదిలీ జరగలేదని జనసేన నేతలు భావిస్తున్నారు. టీడీపీకి ఎంతలా సహకరించినప్పటికీ కూడా తమకు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ స్ధాయిలో సహకారం అందలేదని, చాలా చోట్ల క్రాస్ ఓటింగ్ కూడా కొంప ముంచిందంటున్నారు. ఇలా పోటీ చేసిన 21 స్ధానాలలో కనీసం రెండు,మూడు స్ధానాలలో కూడా గెలుపు కష్టమేనని, వైఎస్ జగన్ గాలి వీస్తే ఆ సీట్లు కూడా రావడం కష్టమేనంటున్నారు.ప్రజల నమ్మకాన్ని పెంచుకోవడంలో పవన్ విఫలంఈసారైనా తమ అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి అడుగుపెడతారని ఆశించామని, కానీ చేతులారా పవన్ ఆ అవకాశాలను సైతం జారవిడుచుకున్నారని, ప్రజల నమ్మకాన్ని పెంచుకోవడంలో పవన్ విఫలమయ్యారని, కానీ చంద్రబాబు నమ్మకాన్ని సంపాదించుకున్నారని సొంతపార్టీ నేతలే సెటైర్లు వేస్తున్నారు. ఇక ఎన్నికల ముగిసిన తర్వాత పోలింగ్ సరళి చూసుకున్న జనసేన నేతలు మీడియాకు పూర్తిగా ముఖం చాటేశారు. నేతలెవరూ మీడియా ముందుకురాలేదు.ఇక పవన్ అయితే తన ఓటు కూడా తనకి వేసుకోలేకపోయారు.. మంగళగిరిలో ఓటు వేసిన తర్వాత అదే రోజు సాయంత్రం పవన్ వారణాసి వెళ్లి ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత నేరుగా వారణాసి నుంచి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఎన్నికల ముగియడంతో ఆంద్రా నుంచి ప్యాకప్ చెప్పారని సొంత పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. మొత్తంగా అటు పవన్ తీరుతో జనసేన పార్టీ పూర్తిగా డీలా పడింది.