ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నలుగురు తెలుగు అభ్యర్థులూ విజయం సాధించారు. వీరిలో ముగ్గురు విదర్భకు చెందిన బీజేపీ అభ్యర్థులే కావడం విశేషం. చంద్రాపూర్ జిల్లా బల్లార్షా నుంచి సుధీర్ మునగంటివార్, యావత్మాల్ జిల్లా యావత్మాల్ నుంచి బీజేపీ అభ్యర్థి మదన్ యేర్వార్, వనీ నుంచి బోద్కువార్ సంజీవరెడ్డి గెలిచారు. సుధీర్ కాంగ్రెస్ అభ్యర్థి ములచందానిపై నాలుగు వేలకుపైగా ఓట్లతో, మదన్ యేర్వార్ శివసేన అభ్యర్థి సంతోష్ డవలేపై స్వల్ప మెజార్టీతో, బోద్కువార్ సంజీవరెడ్డి ఆరు వేల ఓట్ల తేడాతో శివసేన అభ్యర్థి విశ్వాస్ నందేకర్పై విజయం సాధించారు. పశ్చిమగోదావరి జిల్లా అల్లుడైన ద్వారం మల్లికార్జున రెడ్డి కూడా నాగపూర్లోని రాంటెక్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలుపొందారు.
గణపవరం మండలం ముప్పర్తిపాడుకు చెందిన చింతా సూర్యభాస్కరరెడ్డి అల్లుడైన మల్లికార్జున రెడ్డి కాంట్రాక్టరుగా మహారాష్ట్రలో ఉంటూ అంచెలంచెలుగా ఎదగడంతోపాటు, స్వచ్ఛంద సంఘాల సేవల ద్వారా మరాఠా ప్రజల మనసుల్ని గెలిచారు. మహారాష్ట్రలోని మొత్తం 15 మంది తెలుగు అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేశారు.
సంపన్న మహిళ సావిత్రి జిందాల్ ఓటమి
చండీగఢ్/ముంబై: వ్యాపార దిగ్గజం, కాంగ్రెస్ నేత నవీన్ జిందాల్ తల్లి సావిత్రి జిందాల్ హర్యానాలోని హిస్సార్ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి కమల్ గుప్తా చేతిలో 13 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. దేశంలో అత్యంత సంపన్నురాలిగా ‘ఫోర్బ్స్’ గుర్తింపు పొందిన సావిత్రి జిందాల్.. మొన్నటిదాకా భూపీందర్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. మహారాష్ట్రలో 353 కోట్ల ఆస్తులను ప్రకటించిన బీజేపీ అశ్యర్థి మోహిత్ కంబోజ్ కూడా ఓటమి పాలయ్యారు. అంతే కాకుండా కేవలం 15వేల 934 రూపాయల ఆస్తులతో అతి పేదవాడిగా బరిలోకి దిగిన సీపీఎం అభ్యర్థి కిడాపిల్ నారాయణన్ కూడా ఓడిపోయారు. ఇక మహారాష్ట్రలో గణపాత్రో దేశ్ముఖ్(88) పదకొండోసారి ఎమ్మెల్యేగా నెగ్గి చరిత్ర సృష్టించారు. ఈయన సోలాపూర్ జిల్లాలోని సాంగోలా స్థానం నుంచి గెలిచారు. ఈ ఎన్నికల్లో మొత్తం 2302 మంది స్వతంత్రులు పోటీ చేయగా 2290మంది ఓటమి పాలయ్యారు. హర్యానాలోని రాయ్ స్థానం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి జైతీరథ్ దాహియా ఐఎన్ఎల్డీ అభ్యర్థిపై కేవలం 3 ఓట్ల తేడాతో గెలిచారు.
నలుగురు తెలుగువారి జయకేతనం!
Published Mon, Oct 20 2014 1:54 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
ఆ ఉద్యోగులకు శుభవార్త.. జీతాల పెంపు, రూ.1.8 లక్షల బోనస్ కూడా
కేవలం రూ.4 కోట్ల సినిమా.. నెల రోజుల్లోనే యానిమల్ను దాటేసి!
'బుజ్జి' ఎక్కడ తయారైందంటే?.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
రేవ్ పార్టీ.. హేమతో పాటు ఈ బ్యూటీ కూడా.. ఇంతకీ ఎవరంటే? (ఫోటోలు)
ఈ బ్రాండ్ అంత ఈజీగా రాలేదు: దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
శ్రీధర్ రెడ్డి హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి: కేటీఆర్
బేబీ హీరోయిన్ హారర్ థ్రిల్లర్.. ట్రైలర్ చూశారా?
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (23-05-2024)
బీఆర్ఎస్కు10 ఏళ్ళు పట్టింది.. కాంగ్రెస్కు 5 ఏళ్ల పాలన గగనం: కిషన్ రెడ్డి
ఏపీలో చంద్రబాబు విధ్వంసం సృష్టించాడు: కాసు మహేష్రెడ్డి
తప్పక చదవండి
- కేవలం రూ.4 కోట్ల సినిమా.. నెల రోజుల్లోనే యానిమల్ను దాటేసి!
- బేబీ హీరోయిన్ హారర్ థ్రిల్లర్.. ట్రైలర్ చూశారా?
- ఎంటర్ప్రెన్యూర్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్గా మారిన లాయర్! ఏకంగా ఆరుసార్లు కేన్స్..!
- బాయ్ఫ్రెండ్తో బ్రేకప్.. తొలిసారి క్లారిటీ ఇచ్చిన శృతిహాసన్!
- 'ఇప్పుడు కొనండి.. తరువాత చెల్లించండి'.. గూగుల్ పే కొత్త ఫీచర్
- ‘దాడి సమయంలో కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారు’
- 800 ఏళ్ల నాటి వ్యాయామం..దెబ్బకు ఒత్తిడి, అలసట మాయం!
- బీసీసీఐ ఆఫర్ నిజమే.. నేనే రిజెక్ట్ చేశా: ఆసీస్ దిగ్గజం
- SRH vs RR: ‘సన్రైజర్స్ కాదు!.. రాజస్తాన్కే గెలిచే ఛాన్స్’
- పీకేకు దిమ్మతిరిగే ప్రశ్న.. సహనం కోల్పోయిన రాజకీయ వ్యూహకర్త
Advertisement