పాడె మోసిన కరుణ | Sakshi
Sakshi News home page

పాడె మోసిన కరుణ

Published Wed, Dec 17 2014 2:43 AM

పాడె మోసిన కరుణ - Sakshi

తిరుపతి: మంగళవారం ఘనంగా జరిగిన ఎమ్మెల్యే వెంక టరమణ అంత్యక్రియల్లో వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర రెడ్డి పాల్గొని స్వయంగా పాడె మోశారు. రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు సహజమేనని అవి ఆత్మీయతకు అడ్డుకావని  నిరూపించారు. గతంలో రమణ కుటుంబంతో మెలగినట్లే వారిలో ఒకరుగా సాన్నిహిత్యంగా మెలగి వెంక టరమణ పట్ల తనకు గల అభిమానాన్ని చాటుకున్నారు. కరుణాకర రెడ్డి మంగళవారం ఉదయం 9 గంటలకే వెంకటరమణ నివాసానికి చేరుకున్నారు. అంతిమ సంస్కారాలకు భౌతికకాయం ఊరేగింపుగా బయలుదేరే (మధ్యాహ్నం ఒంటి గంట) వరకు అక్కడే ఉన్నారు. అంతిమ యాత్రకు భౌతిక కాయాన్ని తరలించే క్రమంలో వెంకటరమణ కుటుంబ సభ్యులతో చేయి కలిపారు. అనంతరం భౌతికకాయం అంతిమ యాత్రకు      బయలుదేరే వరకు అక్కడే వేచి ఉండి  కొంతదూరం భుజం కలిపి పాడె మోశారు.

ఆర్నెల్లకు ముందు హోరాహోరీగా జరిగిన సార ్వత్రిక ఎన్నికల్లో కరుణాకర రెడ్డి (వైఎస్‌ఆర్‌సీపీ), వెంకటరమణ (టీడీపీ) రాజకీయ ప్రత్యర్థులుగా తలపడ్డారు. అయితే కిడ్నీ, గుండె సంబంధ వ్యాధులతో నెల క్రితం వెంకటరమణ చికిత్స కోసం స్విమ్స్‌లో చేరినపుడు కరుణాకర రెడ్డి కుటుంబ సభ్యులతో కలసి వెళ్లి రమణను పరామర్శించి వచ్చారు. సోమవారం చెన్నై అపోలో ఆస్పత్రి నుంచి రమణ భౌతికకాయం తిరుపతికి చేరుకోగానే కరుణాకరరెడి ్డ తన కుటుంబ సభ్యులతో కలసి వెళ్లి అశ్రునివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
 
 

Advertisement
Advertisement