అభివృద్ధే ప్రధాని మోదీ లక్ష్యం | Sakshi
Sakshi News home page

అభివృద్ధే ప్రధాని మోదీ లక్ష్యం

Published Sat, May 4 2024 4:10 AM

అభివృద్ధే ప్రధాని మోదీ లక్ష్యం

సంగెం : దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడమే ప్రధాని మోదీ లక్ష్యమని బీజేపీ వరంగల్‌ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్‌ అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొని ఆయన మాట్లాడారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే దేశ ఆర్థిక వ్యవస్థను మూడో స్థానానికి తీసుకెళ్తుందని తెలిపారు. రేవంత్‌రెడ్డి అరచేతిలో బెల్లం పెట్టి మోచేత నాకించాడని ఆరోపించారు. కడియం కావ్యకు ఎందుకు ఓటు వేయాలని ఆయన ప్రశ్నించారు. సంగెం–చింతలపల్లి రైల్వే ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం, టెక్స్‌టైల్‌ పార్కును మరింత అభివృద్ధి చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అరూరి రమేశ్‌ కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు వన్నాల శ్రీరాములు, డాక్టర్‌ రాజేశ్వర్‌రావుతోపాటు డాక్టర్‌ పగడాల కాళీప్రసాద్‌రావు, పార్టీ మండల అధ్యక్షుడు బుట్టి కుమారస్వామి పాల్గొన్నారు.

బీజేపీ వరంగల్‌ ఎంపీ అభ్యర్థి

అరూరి రమేశ్‌

Advertisement
Advertisement