-
సై.. అంటే సై !
కీలక దశకు లోక్సభ ఎన్నికల పోరు ● ప్రచారానికి మిగిలింది ఇంకా వారం రోజులే.. ● 2 స్థానాల్లోనూ గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల వ్యూహాలు ● నేడు కొత్తకోటలో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్.. సీఎం రేవంత్ రాక ● రేపు ఎర్రవల్లి చౌరస్తాలో సభ.. హాజరుకానున్న రాహుల్ గాంధీ ● 10న నారాయణపేటకు ప్రధాని మోదీ.. త్వరలో అమిత్షా.. -
ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇప్పుడు ఎలాంటి సినిమా అయినా థియేటర్లలోకి వచ్చిన నెల నెలన్నర గ్యాప్లో ఓటీటీలోకి వచ్చేస్తోంది. కొన్నిసార్లయితే నెలలోపే స్ట్రీమింగ్ అయిపోతుంది. అలాంటిది ఓ మూవీ దాదాపు ఏడాది తర్వాత డిజిటల్గా అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. బాలీవుడ్ సినిమా అయినప్పటికీ దీన్ని తీసింది తెలుగు దర్శకుడు కావడం విశేషం.(ఇదీ చదవండి: సంజయ్లీలా భన్సాలీ 'హీరామండి' వెబ్ సిరీస్ రివ్యూ)ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన 'మల్లేశం' సినిమాతో రాజ్ రాచకొండ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ తర్వాత టాలీవుడ్ లో మరో మూవీ చేయలేదు. మధ్యలో ఓ మలయాళ మూవీ నిర్మించాడు. కానీ '8 ఏఎమ్ మెట్రో' మూవీతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. గతేడాది మే 19న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ అందుకుంది. కానీ ఓటీటీ రిలీజ్ ఊసే లేదు. ఇన్నాళ్లకు స్ట్రీమింగ్ ఫిక్స్ అయింది.దాదాపు ఏడాది తర్వాత అంటే మే 10 నుంచి '8 ఏఎమ్ మెట్రో' మూవీ జీ5 ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇక సినిమా కథ విషయానికొస్తే.. మహారాష్ట్ర చెందిన ఐరావతి (సయామీ ఖేర్).. సోదరి ప్రసవం కోసం హైదరాబాద్ వస్తుంది. చిన్నప్పడు జరిగిన కొన్ని సంఘటనల వల్ల అప్పుడప్పుడు పానిక్ ఎటాక్కి గురవుతూ ఉంటుంది. అలాంటి ఈమెకు మెట్రోలో ప్రీతమ్ (గుల్షన్ దేవయ్య) పరిచయమవుతాడు. వీళ్లిద్దరి మధ్య ఏం జరిగిందనేదే మెయిన్ పాయింట్.(ఇదీ చదవండి: సమ్మర్ స్పెషల్.. ఈనెలలో ఓటీటీలోకి 100 సినిమాలు/ సిరీస్లు) -
No Headline
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: లోక్సభ ఎన్నికల పోరు కీలక దశకు చేరింది. ఇంకా వారం రోజుల్లో ప్రచార పర్వం ముగియనుంది. ఈ మేరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రత్యేక వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. రాష్ట్రంలో ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం రేవంత్ సొంత ఇలాకా కావడంతో పార్టీ అధిష్టానం పాలమూరుపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టింది. రెండింటిలోనూ విజయకేతనం ఎగురవేసి సత్తా చాటాలని బీజేపీ.. సిట్టింగ్ స్థానాలను తిరిగి దక్కించుకుని, పట్టు నిలుపుకోవాలని బీఆర్ఎస్ కదనరంగంలో దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ప్రచార గడువు దగ్గరపడుతుండడంతో ఆయా పార్టీల అభ్యర్థులకు మద్దతుగా అగ్రనేతలు రంగంలోకి దింపుతున్నారు. మహబూబ్నగర్, నాగర్కర్నూల్ పార్లమెంట్ల పరిధిలో జాతీయ, రాష్ట్రస్థాయి నేతలు రోడ్షోలు, బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్లకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ప్రచారం మరింత హోరెత్తనుంది. ఆదివారం రాహుల్ గాంధీ.. నాగర్కర్నూల్ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న మల్లురవి గెలుపును కాంక్షిస్తూ ఆ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్గాంధీ జోగుళాంబ గద్వాల జిల్లాలో ఆదివారం పర్యటించనున్నారు. ఎరవ్రల్లి చౌరస్తాలో సాయంత్రం జరిగే బహిరంగసభలో పార్టీ శ్రేణులు, ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. రాహుల్ గాంధీ ఆరు నెలల్లో ఉమ్మడి జిల్లాకు రావడం ఇది ఐదోసారి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన కోస్గిలో రేవంత్రెడ్డికి మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభతో పాటు మహబూబ్నగర్, గద్వాల, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో జరిగిన ప్రచార సభల్లో పాల్గొన్నారు. కేటీఆర్.., హరీశ్రావు.. మహబూబ్నగర్, నాగర్కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు మద్దతుగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఆయా పార్లమెంట్ స్థానాల్లో నిర్వహించిన రోడ్షోలు, కార్నర్ మీటింగ్లకు హాజరై పార్టీ శ్రేణులు, ప్రజలనుద్దేశించి మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ వారంలో ప్రచార గడువు ముగిసేలోపు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్), మరో మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. కొత్తకోట, దేవరకద్ర, మక్తల్, భూత్పూర్, నాగర్కర్నూల్లో నిర్వహించనున్న రోడ్షోలు, కార్నర్ మీటింగ్కు హాజరుకానున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
హోం ఓటింగ్ ప్రారంభం
వనపర్తి: పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేని దివ్యాంగులు, 85 ఏళ్లు పైబడిన వృద్ధులు ఇంటి వద్దనే ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించిన విషయం తెలిసిందే. జిల్లాలో శుక్రవారం హోం ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా 8వ తేదీ వరకు కొనసాగనుంది. జిల్లావ్యాప్తంగా 269 మంది ఓటర్లు హోం ఓటింగ్కు దరఖాస్తు చేసుకోగా.. వారందరూ స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేందుకు జిల్లా ఎన్నికల అధికారి ఎనిమిది పోలింగ్ బృందాలను ఏర్పాటు చేశారు. దరఖాస్తు చేసుకున్న వారి ఇంటికి వెళ్లి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు. మొదటిరోజు జిల్లావ్యాప్తంగా 40 మంది దివ్యాంగులు, 75 మంది వృద్ధులు మొత్తం 115 మంది హోమ్ ఓటింగ్ వినియోగించుకున్నారు. అలాగే 240 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్ కోసం 8 కౌంటర్లు ఏర్పాటు చేశారు. -
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
కాంగ్రెస్ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి, నాగర్కర్నూల్ అభ్యర్థి మల్లురవికి మద్దతుగా టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. రేవంత్ సొంత జిల్లా కావడంతో వీరి గెలుపు బాధ్యతలను ఆయన తన భుజాలపై వేసుకున్నారు. ఈ మేరకు కొడంగల్, కోస్గి, మద్దూరు, మహబూబ్నగర్, నారాయణపేట, బిజినేపల్లిలో రోడ్ షోలు, కార్నర్ మీటింగులు, బహిరంగసభల్లో పాల్గొన్నారు. తాజాగా శనివారం ఆయన మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధి దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కొత్తకోటకు రానున్నారు. రోడ్ షోతో పాటు కార్నర్ మీటింగ్లో మాట్లాడనున్నారు. వచ్చే వారం మక్తల్ ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి పాల్గొనే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. -
నరేంద్ర మోదీ.. అమిత్ షా..
నాగర్కర్నూల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి పోతుగంటి భరత్ప్రసాద్కు మద్దతుగా మార్చి 16న ఆ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభకు పార్టీ అగ్రనేత, ప్రధాని మోదీ హాజరైన విషయం తెలిసిందే. తాజాగా ఈ నెల పదో తేదీన బీజేపీ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా ఆయన మరోసారి పాలమూరుకు రానున్నారు. మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలోని నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభలో ప్రధాని పార్టీ శ్రేణులు, ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం మహబూబ్నగర్కు రానున్నారు. పట్టణంలో నిర్వహించే రోడ్షోతో పాటు కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొననున్నట్లు తెలిసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా త్వరలో నాగర్కర్నూల్లో పర్యటించనున్నట్లు సమాచారం. -
వేసవిలో జాగ్రత్తలు తప్పనిసరి
కొత్తకోట రూరల్: రోజురోజుకు ఎండ తీవ్రత అధికమవుతుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్యాధికారి డా. జయచంద్రమోహన్ సూచించారు. శుక్రవారం మండలంలోని అమడబాకుల ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాలని, ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చూడాలని కోరారు. ఉపకేంద్రంలో రోగులకు అందుతున్న వైద్యసేవలపై గ్రామస్తులతో ఆరా తీశారు. ప్రజలు అవసరమైతే తప్పా బయటకు రావద్దని.. బయటకు వెళ్తే వాటర్ బాటిల్, ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అనంతరం కొత్తకోటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి సిబ్బందితో మాట్లాడారు. -
అదనపు బ్యాలెట్ యూనిట్ల ర్యాండమైజేషన్ పూర్తి
వనపర్తి: నాగర్కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు నిలిచినందున ప్రతి పోలింగ్ కేంద్రంలో రెండు బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకోసం మరో 380 బ్యాలెట్ యూనిట్లు వినియోగించేందుకు శుక్రవారం ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి తేజస్ పవార్ తెలిపారు. శుక్రవారం ఆర్డీవో కార్యాలయ ఆవరణలోని ఈవీఎం గోదాం నుంచి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో అదనపు బ్యాలెట్ యూనిట్లను పోలీసు భద్రత నడుమ చిట్యాల వ్యవసాయ మార్కెట్యార్డులోని ఈవీఎం రిసెప్షన్ కేంద్రానికి తీసుకొచ్చారు. అనంతరం వారి సమక్షంలో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో జిల్లా సహాయ రిటర్నింగ్ అధికారి ఎం.నగేష్, సి–సెక్షన్ సూపరింటెండెంట్ రమేష్రెడ్డి, బీజేపీ నాయకుడు ప్రవీణ్, సీపీఎం నాయకుడు పరమేశ్వరాచారి, టీడీపీ నాయకుడు శంకర్, బీఆర్ఎస్ నాయకుడు జమీల్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎన్నికల అధికారి తేజస్ పవార్ -
నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానం..
నియోజకవర్గం మహిళలు మొత్తం ఓటర్లు శాతం నాగర్కర్నూల్ 1,18,603 2,36,094 50.23 అచ్చంపేట (ఎస్సీ) 1,24,598 2,47,729 50.29 కొల్లాపూర్ 1,18,541 2,39,463 49.50 వనపర్తి 1,37,984 2,73,863 50.38 గద్వాల 1,30,982 2,56,637 51.03 అలంపూర్ (ఎస్సీ) 1,21,662 2,40,063 50.67 కల్వకుర్తి 1,20,970 2,44,405 49.49 మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానం.... నియోజకవర్గం మహిళలు మొత్తం ఓటర్లు శాతం మహబూబ్నగర్ 1,30,863 2,59,260 50.47 జడ్చర్ల 1,11,779 2,22,838 50.16 దేవరకద్ర 1,21,130 2,39,745 50.52 నారాయణపేట 1,19,682 2,36,182 50.67 మక్తల్ 1,24,363 2,44,173 50.93 కొడంగల్ 1,22,933 2,41,794 50.84 షాద్నగర్ 1,19,422 2,38,478 50.07 -
మహిళలే నిర్ణేతలు
రెండు లోక్సభ స్థానాల్లో మగువల ఓట్లే అధికం మహబూబ్నగర్ డెస్క్: వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపోటములకు మహిళా ఓట్లే కీలకంగా మారాయి. ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాల్లోనూ మహిళా ఓటర్లే అధికంగా ఉన్న నేపథ్యంలో ఎంపీ అభ్యర్థుల గెలుపును శాసించేది వీరే. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ పురుషుల కంటే మహిళలే అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన తాజా ఓటర్ల జాబితా ప్రకారం మహబూబ్నగర్ లోక్సభ స్థానంలో 16,82,470 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 50.53 శాతంతో 8,50,172 మంది మహిళా ఓటర్లే ఉన్నారు. ఇక్కడ పురుషుల కంటే 17,916 మంది మహిళలు ఎక్కువగా ఉన్నారు. నాగర్కర్నూల్ లోక్సభ స్థానంలో 17,38,254 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో కూడా 50.24 శాతంతో 8,73,340 మంది మహిళలు ఉన్నారు. ఇక్కడ పురుషుల కంటే 8,465 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. నాగర్కర్నూల్ లోక్సభ పరిధిలోని కొల్లాపూర్, కల్వకుర్తి సెగ్మెంట్ల పరిధిలో మినహా ఉమ్మడి జిల్లాలోని మిగిలిన 12 సెగ్మెంట్లలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నట్లు తేలింది. ప్రధాన పార్టీ అభ్యర్థుల ప్రత్యేక దృష్టి ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లోనూ గత శాసనసభ ఎన్నికల మాదిరిగానే ఓటింగ్లో మహిళలు అధికంగా పాల్గొంటే పోలింగ్ శాతం భారీగా పెరుగుతుంది. దీంతో అభ్యర్థుల గెలుపోటమును వీరే ప్రభావితం చేయనున్నారు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంపై దృష్టి సారించారు. ఇందుకోసం ఆయా పార్టీల నేతలను ప్రత్యేక ప్రణాళికతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. దీనితో పాటు మహాలక్ష్మి పథకంలో భాగంగా రాబోయే రోజుల్లో ప్రతి నెల రూ.2,500, రూ.500కే గ్యాస్ సిలిండర్.. తదితర వాటిని కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు నాయకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇక బీజేపీ ఆత్మ నిర్భన్నారీ శక్తిపై ప్రత్యేక దృష్టి సారించింది. సుకన్య సమృద్ధి యోజన, ముద్ర యోజన, లఖ్పతి దీదీ, స్టాండ్ ఆఫ్ ఇండియా, మిషన్ శక్తి యోజన.. తదితర కార్యక్రమాలను మహిళలకు వివరిస్తున్నారు. ఇంటింటికి తిరిగి మహిళా మోర్చా కార్యకర్తలు వీటిపై ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ సైతం... పదేళ్లలో మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తున్నారు. ముఖ్యంగా ఇందులో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, పింఛన్లు, కేసీఆర్ కిట్లు అందించిన విషయాన్ని గడపగడపకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. మహబూబ్నగర్లో 50.53,నాగర్కర్నూల్లో 50.24శాతం మహిళా ఓటర్లు అభ్యర్థుల జాతకాలు తేల్చేది వీరే.. వారిని ప్రసన్నం చేసుకోవడానికిప్రయత్నిస్తున్న నేతలు