నరేంద్ర మోదీ.. అమిత్‌ షా.. | Sakshi
Sakshi News home page

నరేంద్ర మోదీ.. అమిత్‌ షా..

Published Sat, May 4 2024 12:05 AM

-

నాగర్‌కర్నూల్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి పోతుగంటి భరత్‌ప్రసాద్‌కు మద్దతుగా మార్చి 16న ఆ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభకు పార్టీ అగ్రనేత, ప్రధాని మోదీ హాజరైన విషయం తెలిసిందే. తాజాగా ఈ నెల పదో తేదీన బీజేపీ మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా ఆయన మరోసారి పాలమూరుకు రానున్నారు. మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ పరిధిలోని నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభలో ప్రధాని పార్టీ శ్రేణులు, ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సైతం మహబూబ్‌నగర్‌కు రానున్నారు. పట్టణంలో నిర్వహించే రోడ్‌షోతో పాటు కార్నర్‌ మీటింగ్‌లో ఆయన పాల్గొననున్నట్లు తెలిసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా త్వరలో నాగర్‌కర్నూల్‌లో పర్యటించనున్నట్లు సమాచారం.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement