-
గ్యారంటీల అమలులో విఫలం
ఇందల్వాయి: ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఇందల్వాయి మండలం గన్నారం, మేఘ్య నాయక్ తండా, నల్లవెల్లి గ్రామాల్లో ఆయన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో శుక్రవారం మాట్లాడారు. గ్రామాల్లో ప్రచారాని కి వచ్చిన కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీ యాలని కోరారు. గెలవగానే పసుపు బోర్డు తెస్తా నన్న ఎంపీ అర్వింద్ ఐదేళ్లు కాలయాపన చేసి ఇప్పు డు గెజిట్ పేరిట మరోసారి మోసం చేస్తున్నారని వి మర్శించారు. రాజ్యసభ సభ్యుడు సురేశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, ఎంపీపీ రమేష్నాయక్, జెడ్పీటీసీ సుమనరెడ్డి, వైస్ ఎంపీపీ అంజయ్య, దాస్, పులి శ్రీనివాస్, లావణ్య, సుధీర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ గెలుపు ఖాయం నిజామాబాద్నాగారం: ప్రజల మద్దతుతో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. వారు శుక్రవారం నగరంలో ఇంటింటి ప్రచారం చేశారు. నగరంలో అత్యధిక మెజారిటీ ఇచ్చి బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. ఒక్క ఫ్రీ బస్సు తప్ప చేసిందీ ఏమీ లేదన్నారు. ఇప్పటి వరకు రుణమాఫీ చేయలేదని, కల్యాణలక్ష్మి ఇవ్వడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు రాక, నీళ్లు లేక పొలాలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్ల మీద ఓట్లు వేసి అబద్దాలు చెబుతున్నారన్నారు. అర్వింద్ పసుపు బోర్డు పేరు చెప్పి మరోసారి ఓట్లు దండుకునే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. మేయర్ దండు నీతూ కిరణ్, సూదం రవిచందర్, ప్రభాకర్ రెడ్డి, సుజాత్ సింగ్ఠాకూర్, సత్య ప్రకాశ్, కరిపే రాజు పాల్గొన్నారు. గన్నారంలో మాట్లాడుతున్న బాజిరెడ్డి గోవర్ధన్ -
ఉష్ణోగ్రత @ 45.7
సుభాష్నగర్: ఈ వేసవిలోనే అత్యధికంగా శుక్రవా రం రికార్డు స్థాయిలో జిల్లా కేంద్రంలోని నిజామాబాద్ నార్త్ మండలంలో 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భగభగ మండుతున్న ఎండ దాటికి జ నం ఉదయం 11 దాటిందంటే రోడ్లపైకి రావడానికి జంకుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే నగరంలోని ఖలీల్వాడి, బస్టాండ్, కుమార్గల్లీ, పూసల గల్లీ, ఇతరత్ర ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. వర్నిలో 45.3, జక్రాన్పల్లిలో 45.0 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరాయి. రానున్న రోజుల్లో ఎండలు మరింత ముదిరే అవకాశముందని, వృద్ధులు, పిల్లలు బ యటికి రాకపోవడమే మంచిదని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు. రాత్రివేళల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు దాటి పెరుగుతున్నాయి. జక్రాన్పల్లిలో ఏకంగా కనిష్ట ఉష్ణోగ్రతలు 37.5 డిగ్రీలు, కొరట్పల్లిలో 37.0, ముప్కాల్లో 36.6 డిగ్రీలుగా నమోదయ్యాయి. సీజన్లో ఇదే అత్యధికం.. -
No Headline
మండలం కనిష్ట గరిష్ట నిజామాబాద్నార్త్ 34.6 45.7 వర్ని 35.1 45.3 జక్రాన్పల్లి 37.5 45.0 ఏర్గట్ల 34.1 44.5 ముప్కాల్ 36.6 44.5 వేల్పూర్ 35.3 44.2బెల్లాల్ 34.4 43.7 కోరట్పల్లి 37.0 43.7 ఎడపల్లి 34.7 43.6 భీమ్గల్ 35.6 43.4 కోటగిరి 34.6 43.2 పెర్కిట్ 33.8 43.1 డిచ్పల్లి 35.0 43.1మోర్తాడ్ 35.5 44.2 గూపన్పల్లి 33.5 44.2 మోస్రా 34.3 44.1 నిజామాబాద్ సౌత్ 33.7 44.0 కమ్మర్పల్లి 33.3 44.0 బోధన్ 34.9 43.9 పోతంగల్ 36.2 43.9 -
లోక్సభ ఎన్నికల్లో నెలకొన్న త్రిముఖ పోటీ..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: లోక్సభ ఎన్నికలకు గడువు దగ్గరపడుతున్న కొద్దీ మూడు ప్రధాన పార్టీలు ప్రచారాన్ని మరింత ము మ్మరం చేస్తున్నాయి. ఇంకా వారం రోజులు మాత్రమే ఎన్నికల ప్రచారానికి సమయం ఉంది. దీంతో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్లు శాసనసభ సెగ్మెంట్ల పరిధిలోని అన్ని మండలాల్లో నాలుగైదు గ్రామాలకు ఒక కమిటీని, మున్సిపాలిటీల్లో వార్డులు, డివిజన్ల వారీగా కమిటీలు వేసుకుని క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నాయి. ఆయా కమిటీల్లో సీనియర్లతో పాటు జూ నియర్లను సభ్యులుగా చేర్చారు. వీరంతా ప్రణాళిక ప్రకారం బూత్ స్థాయిలో అన్ని ఇళ్లను తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. తమ పార్టీ ప్రాధాన్యతలను వివరిస్తూ ముందుకు వెళుతున్నారు.నిజాం షుగర్స్, పసుపు బోర్డు తదితర అంశాలు, గల్ఫ్, బీడీ కార్మికులు, రైతు కూలీలు, ఉపాధి కూలీల సమస్యలతో పాటు మండలాలు, గ్రామా ల్లో స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారంపై నాయకులు, కార్యకర్తలు హామీలు ఇస్తున్నారు. ము ఖ్యంగా పోలింగ్ బూత్ల పరిధిలో సాధించే ఆధిక్యతను బట్టి స్థానిక ఎన్నికల్లో తగిన ప్రాధాన్యత ఇస్తామని పార్టీల అగ్రనాయకులు చెప్పడంతో శ్రే ణులు గట్టిగా ప్రచారం చేస్తున్నాయి. ఆధిక్యత సాధి స్తే తమకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలు లభిస్తాయనే ఆశాభావంతో శ్రమకోర్చి ప్రచారంలో పాల్గొంటున్నారు.తమ పార్టీ ఎంపీ అభ్యర్థుల గెలుపు లక్ష్యంతో పాటు స్థానికంగా తమ ఉనికినీ చాటుకునేలా మూడు పార్టీల కార్యకర్తలు పోటాపోటీగా పని చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసిన వెంటనే కొన్ని రోజుల తేడాతోనే గ్రామ పంచాయతీ సర్పంచ్, మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపరిషత్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి జూన్ ఆఖరులో లేదా జూలై ప్రారంభంలో ముగించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని లోక్సభ ఎన్నికల కోసం పనిచేయాలని, వారి పనితీరునే ప్రామాణికంగా తీసుకుని ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ పదవుల పోటీకి అవకాశాలు కల్పిస్తామని సీఎం స్పష్టం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు స్థానికంగా వచ్చే ఓట్లకు సంబంధించి కూడికలు, తీసివేతల లెక్కలు వేసుకుంటున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో తమ గ్రామాల్లో సాధించిన ఓట్లను పరిగణనలోకి తీసుకుని ప్రచార వ్యూహాలను రూపొందించుకుని క్షేత్రస్థాయిలోకి వెళుతున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఆయా నాయకులు, కార్యకర్తలు తమ ప్రాంతాల్లో వచ్చిన ఓట్లను బూత్ల వారీగా సరిచూసుకుని ప్లస్లు, మైనస్లను బేరీజు వేసుకుని ప్రచారం చేస్తున్నారు.బీఆర్ఎస్ పార్టీ గత శాసనసభ ఎన్నికల్లో నిజామాబాద్ లోక్సభ పరిధిలో జగిత్యాల, కోరుట్ల, బాల్కొండ స్థానాల్లో గెలుపొందింది. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో నెలకొన్న త్రిముఖ పోటీ తమకు కలిసొస్తుందని లెక్కలు వేసుకుంటున్న బీఆర్ఎస్ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 6న నిజామాబాద్, 7న కామారెడ్డిలో కేసీఆర్ రోడ్షోలు ఉండడంతో వాటిని విజయవంతం చేసేందుకు గాను బీఆర్ఎస్ శ్రేణులు కృషి చేస్తున్నాయి.కేంద్రంలో మరోసారి అధికారాన్ని దక్కించుకునే లక్ష్యంతో బీజేపీ శ్రేణులు ఉన్నాయి. నిజామాబాద్లో వరుసగా రెండోసారి జెండా ఎగురవేయాలనే పట్టుదలతో కార్యకర్తలు చెమటోడుస్తున్నారు. ‘మరోసారి మోదీ సర్కార్’ నినాదంతో పార్టీ శ్రేణులు, అనుబంధ హిందూ సంఘాలు క్షేత్రస్థాయిలో దూకుడుగా ప్రచారం నిర్వ హిస్తున్నాయి. పట్టణాల్లో, గ్రామస్థాయిలోనూ భారీగా ఓట్లు రాబట్టుకునేందుకు బీజేపీ శ్రేణులు, యువత గట్టిగా ప్రచారం చేస్తున్నారు.ఇవి చదవండి: మీరు తీసుకునేది ‘ట్యాపింగ్’ పైసలే : మాజీ మంత్రి పెద్దిరెడ్డి -
నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు భేష్
సుభాష్నగర్: నీటి ఎద్దడి తలెత్తకుండా జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యలు బాగున్నాయని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, జిల్లా ప్రత్యేకాధికారి శరత్ అభినందించారు. మే నెలలో ఎండల తీవ్రత అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో జి ల్లావ్యాప్తంగా తాగునీటి సరఫరాకు అంతరాయం తలెత్తకుండా అంకితభావంతో పని చేయాలని, నీటి సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించాల ని సూచించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి జిల్లాలో మంచి నీటి సరఫరా పరిస్థితిపై మండల స్పెషల్ ఆఫీసర్లు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఎక్కడ కూడా నీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నారని, వేసవి సీజన్ ముగిసే వరకు ఇదే స్ఫూర్తితో పని చేయాలని సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ నీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుగా గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇచ్చామని తెలిపారు. మండల ప్రత్యేక అధికారులు క్రమం తప్పకుండా మండలాల్లో పర్యటిస్తూ పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్ తదితరులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement