నల్లబెల్లి : మండల కేంద్రంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ నల్లబెల్లి అధ్యక్షుడు బత్తిని మహేశ్, నాయకులు మాలోత్ రమేశ్, వైనాల అశోక్, చార్ల శివారెడ్డి, మాలోత్ చరణ్సింగ్, కడుదూరి కట్టయ్య, డ్యాగల కృష్ణ, వర్ణం ఇంద్రారెడ్డి, జిల్లా మునేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఏనుగల్ తండాలో 10 కుటుంబాలు..
నర్సంపేట రూరల్ : నర్సంపేట మండలంలోని ఏనుగల్తండాకు చెందిన బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు బానోత్ రవి, వార్డు మాజీ సభ్యుడు బోడ సోములు ఆధ్వర్యంలో 10 కుటుంబాలు బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాయి. వారికి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. అదేవిధంగా గురిజాల గ్రామ సొసైటీ మాజీ డైరెక్టర్ అల్లిరాజు బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. కార్యక్రమంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు గజ్జి రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ తప్పెట రమేశ్, కత్తి కిరణ్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పార్వతమ్మ, మహిళా అధ్యక్షురాలు సాంబలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఎల్గూర్స్టేషన్ గ్రామం నుంచి..
సంగెం : ఎల్గూర్స్టేషన్ గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినట్లు పార్టీ మండల అధ్యక్షుడు మాధవరెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు గుగులోత్ బొంద్యా, గుగులోత్ రమేష్, నర్సానగర్ నుంచి జాటోత్ భద్రయ్య పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మెట్టుపల్లి రమేశ్, నాయకులు అచ్చ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.