amp pages | Sakshi

తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా

Published on Fri, 10/08/2021 - 10:15

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. 7 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు సాగాయి.

కేంద్రం దగ్గర ఉన్నదేందీ.. మాకు ఇచ్చేదేంది?
ప్రపంచంలో ఎవరూ వాళ్ల జేబుల్లోంచి తీసి సంక్షేమ కార్యక్రమాలు చేయరని సీఎం కేసీఆర్‌ అన్నారు. అల్పాదాయ వర్గాలకు భారీగా నిధులు వెచ్చించి అభివృద్ధి చేస్తున్నామన్నారు. శుక్రవారం అసెంబ్లీలో ‘తెలంగాణలో సంక్షేమం’పై జరిగిన చర్చలో సీఎం మాట్లాడుతూ కేంద్రం తమ కంటే ఎక్కువగానే అప్పులు చేసిందన్నారు. కేంద్రం దగ్గర ఉన్నదేందీ..? మాకు ఇచ్చేదేంది? అంటూ కేసీఆర్‌ ప్రశ్నించారు. ‘‘కేంద్రం నిధులు దారి మళ్లుతున్నాయని విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ.2 లక్షల 74 వేల కోట్లు వెళ్లాయి. మరి కేంద్రం నుంచి తెలంగాణకు వస్తున్న నిధులు ఎన్ని?. కేంద్రం నుంచి తెలంగాణకు ఒక్క రూపాయి రాలేదని’’ సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

తెలంగాణలో ఐటీ అభివృద్ధి చెందుతోందని.. పారిశ్రామిక రంగంలో అద్భుతాలు జరుగుతున్నాయన్నారు. అన్ని జిల్లా పరిషత్‌లు మాకే వచ్చాయన్నారు. స్థానిక సంస్థల్లో టీఆర్‌ఎస్‌ గెలిస్తేనే అభివృద్ధి అన్నారు. 2018లో ప్రజలు మాకు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారని.. ఏ ఎన్నిక జరిగినా టీఆర్‌ఎస్‌ గెలుస్తూ వచ్చిందని సీఎం అన్నారు. తెలంగాణలో ఆధ్యాత్మిక శోభ వెల్లువిరుస్తోందని.. బోనాల పండుగకు రూ.15 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఆధ్యాత్మికంగా అన్ని వర్గాలను గౌరవిస్తామని కొందరు చౌకబారు విమర్శలు చేస్తున్నారని సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు ప్రారంభమయ్యాయి. ఉద‌యం 10 గంట‌ల‌కు శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. సీఎం మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో వరద నష్టం నిధులు ఇంకా విడుదల చేయలేదన్నారు. పంట నష్టంపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతుందని, గోదావరి ఉధృతి వల్లే పంటలు మునిగాయన్నారు. 

పంట నష్టంపై కేంద్రానికి నివేదిక పంపినా నిధులు ఇవ్వలేదని విమర్శిచారు. కేంద్రం ఆలస్యం చేయడం వల్లే ఇబ్బందులు తలెత్తాయన్నారు. స్వామినాథన్‌ నివేదికలను కూడా కేంద్ర పట్టించుకోలేదని అన్నారు. దేశంలో పంటల బీమా విధాన శాస్త్రీయంగా లేదని, అందుకే రైతులకు న్యాయం జరగడం లేదని మండిపడ్డారు.
చదవండి: KCR: రాష్ట్రాల హక్కులను హరిస్తున్నారు

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌