వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తెలంగాణలో కొత్తగా 1,280 కరోనా కేసులు
Published on Sun, 06/13/2021 - 19:58
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వైరస్ ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 91,621 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 1,280 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ బాధితుల్లో 15 మంది మరణించారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 2,261మంది డిశ్చార్జ్ అయ్యారు.
తెలంగాణలో ప్రస్తుతం 21,137 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు 6,03,369 మందికి కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 165 కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఇప్పటి వరకు తెలంగాణలో 5,78,748 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్య శాఖ ఆదివారం కరోనా కేసుల బులెటిన్ను విడుదల చేసింది.
చదవండి: పల్లె, పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష
#
Tags