amp pages | Sakshi

500 కోట్లు వర్షార్పణం.. 10 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న సాగు

Published on Sat, 07/16/2022 - 07:59

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వారం రోజులకుపైగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో భారీ స్థాయిలో సాగు దెబ్బతింది. వేసిన విత్తనాలు కుళ్లిపోవడం, మొలకెత్తినచోట మొక్కలు కొట్టుకుపోవడం, దెబ్బతినడంతో.. సుమారు 10 లక్షల ఎకరాల్లో తీవ్రంగా నష్టం వాటిల్లింది. దీనితో రైతుల పెట్టుబడి కష్టం వర్షార్పణమైంది. అనధికార అంచనా ప్రకారం రైతులకు సుమారు రూ.500 కోట్ల మేర నష్టం వాటిల్లింది.

వానలు బాగా పడతాయని..: ఈ ఏడాది వర్షాలు బాగుంటాయన్న వాతావరణశాఖ అంచనాల మేరకు 1.43 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. రైతులు కూడా జూన్‌ రెండో వారం నుంచే సాగు మొదలుపెట్టారు. వ్యవసాయశాఖ గణాంకాల ప్రకారమే.. ఇప్పటివరకు 53.79 లక్షల ఎకరాల్లో పలు రకాల పంటలు సాగయ్యాయి. పంటలన్నీ ప్రాథమిక దశలోనే ఉండటంతో భారీ వర్షాలకు, వరదలకు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. పత్తి చేలలో నీరు నిలవడంతో విత్తనాలు భూమిలోనే కుళ్లిపోయాయి. మొలకస్థాయిలో ఉన్న పత్తి మునిగి దెబ్బతింది. వరినారు కొట్టుకుపోయింది. వానలు తెరిపినిచ్చినా పంట చేతికొచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. మళ్లీ పంట పెట్టుబడుల భారం మీద పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గోదావరి వెంట భారీగా నష్టం: ప్రధానంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల, వాజేడు, వెంకటాపురం తదితర ప్రాంతాల్లో పంటలకు తీవ్రంగా నష్టం జరిగింది. గోదావరికి భారీ వరద రావడంతో.. నదికి రెండు పక్కలా ఒకట్రెండు కిలోమీటర్ల మేర పంటలను ముంచెత్తడంతో నదీ పరీవాహక ప్రాంతాల్లో పంటలపై ప్రభావం పడింది. 

నిజామాబాద్‌ జిల్లాలో 1.85 లక్షల ఎకరాల్లో, కామారెడ్డి జిల్లాలో సాగైన 1.89 వేల ఎకరాల్లో పావువంతు పంటలు మునిగిపోయాయి. పెద్దపల్లి జిల్లాలో 65వేల ఎకరాల్లో పంటలు సాగుకాగా 60 శాతం నీట మునిగాయి. భూపాలపల్లి జిల్లాలో 1.14 లక్షల ఎకరాల్లో, ములుగు జిల్లాలో 10 వేల ఎకరాలు వరద పాలయ్యాయి. వరంగల్‌ జిల్లాలో సాగైన 1.31 లక్షల ఎకరాలు, మహబూబాబాద్‌ జిల్లాలో 1.38 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది.

ఈ చిత్రంలో చెరువులా కనిపిస్తున్నది మంచిర్యాల జిల్లా వేమనపల్లికి చెందిన కౌలు రైతు చౌదరి శంకరయ్య సాగు చేస్తున్న చేను. ఆయన 12 ఎకరాలు కౌలు తీసుకుని పత్తి వేయగా ప్రాణహిత వరదలు చేనును ముంచెత్తాయి. పదెకరాల మేర పూర్తిగా నీట మునిగింది. ఎకరానికి రూ.18 వేల వరకు పెట్టుబడి పెట్టానని.. అంతా వరద పాలైందని శంకరయ్య వాపోయారు. మళ్లీ విత్తనాలు వేద్దామంటే పెట్టుబడికి సొమ్ము ఎక్కడి నుంచి తేవాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: గోదావరి మహోగ్ర రూపం.. రంగంలోకి హెలికాప్టర్లు.. సైన్యం

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌