వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
భారత బౌలర్లు అదుర్స్.. సౌతాఫ్రికా 54 పరుగులకే ఆలౌట్! సిరీస్ మనదే
Published on Thu, 01/05/2023 - 09:08
TeamIndia Win Final T20I Against South Africa Women- కేప్టౌన్: దక్షిణాఫ్రికా అండర్–19 మహిళల జట్టుతో ఆరో టి20 మ్యాచ్లో భారత అండర్–19 మహిళల జట్టు ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. బుధవారం జరిగిన చివరిదైన మ్యాచ్లో గెలిచి సిరీస్ను 4–0తో దక్కించుకుంది.
ప్రిటోరియా వేదికగా జరిగిన టీ20లో టాస్ గెలిచిన ఆతిథ్య దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్కు దిగింది. భారత బౌలర్ల ధాటికి 13.2 ఓవర్లలో 54 పరుగులకే ఆలౌటైంది. హైదరాబాద్ అమ్మాయి యషశ్రీ 14 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి సత్తా చాటింది..
మిగతా వాళ్లలో.. ఫలక్ నాజ్, సోనమ్ యాదవ్, పార్షవి చోప్రా రెండు వికెట్ల చొప్పున తీశారు. అనంతరం భారత్ 9.2 ఓవర్లలో 3 వికెట్లకు 55 పరుగులు చేసి నెగ్గింది. కెప్టెన్ షఫాలీ వర్మ (22; 3 ఫోర్లు, 1 సిక్స్), హైదరాబాద్ అమ్మాయి గొంగడి త్రిష (10 నాటౌట్; 1 ఫోర్) రాణించారు.
చదవండి: 12 ఏళ్ల తర్వాత హైదరాబాద్లో ‘మట్టి కుస్తీ’ సవాల్.. ‘హింద్ కేసరి’ విశేషాలు.. పూర్తి వివరాలు
Sara Khadem: ఇరాన్లో అడుగుపెడితే చంపేస్తాం.. చెస్ ప్లేయర్కు బెదిరింపు
Tags