amp pages | Sakshi

పంత్‌ చేసిన పనితోనే ఐసోలేషన్‌కు వెళ్లారా?

Published on Sat, 01/02/2021 - 17:28

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా జట్టు ఇంకా రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇటీవల మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో అద్భుతమైన విజయం సాధించడంతో భారత క్రికెట్‌ జట్టు ఫుల్‌ జోష్‌లో ఉంది. రెండో టెస్టుకు మూడో టెస్టుకు మధ్య సమయం చాలా ఉండటంతో ఆటగాళ్లకు విశ్రాంతి లభించింది. దాంతో టీమిండియా ఆటగాళ్లు బయో బబుల్‌ నిబంధనలు పాటిస్తూనే మెల్‌బోర్న్‌ నగరంలో చక్కర్లు కొడుతున్నారు. ఈ క్రమంలోనే పలువురు క్రికెటర్లు మెల్‌బోర్న్‌లోని ఒక హోటల్‌కు వెళ్లి నచ్చిన ఫుడ్‌ను ఆర్డర్‌ చేసుకుని తిన్నారు. రోహిత్ శ‌ర్మ‌, రిష‌బ్ పంత్‌, శుభ్‌మ‌న్ గిల్, న‌వ్‌దీప్ సైనీ, పృథ్వీ షాలు హోటల్‌కు వెళ్లిన వారిలో ఉ‍న్నారు. ఇదే వారిని ఇరకాటంలో పడేసింది. వీరిని ఐసోలేషన్‌లోకి వెళ్లేలా చేసింది.  (వైరల్‌ : క్రికెటర్ల బిల్లు చెల్లించిన అభిమాని)

ఇంతకీ ఏం జరిగిందంటే..  వీరంతా ఫుడ్‌ ఆరగించేసే సమయంలో బిల్లును ఒక అభిమాని చెల్లించాడు. ఆ క్రికెటర్ల బిల్లు ఎంత అయ్యిందని తెలుసుకుని మరీ కౌంటర్‌లో కట్టేశాడు.  క్రికెటర్లకు తెలియకుండా 118 ఆస్ట్రేలియన్‌ డాలర్లు( రూ. 6700) బిల్లు కట్టాడు. అయితే బిల్లు చెల్లించడానికి కౌంటర్ వద్దకు వచ్చిన క్రికెటర్లకు మీ బిల్లును ఆ వ్యక్తి కట్టాడంటూ నవల్‌దీప్ సింగ్ వైపు చూపించారు దీంతో రోహిత్ శర్మ, పంత్‌లు నవల్‌దీప్‌ వద్దకు వచ్చి డబ్బు ఇవ్వబోయారు. అయితే నవల్‌దీప్‌ అందుకు అభ్యంతరం చెప్పి డబ్బు తీసుకోలేదు. దాంతో అతనికి థాంక్స్‌ చెప్పారు. కానీ పంత్‌.. అతన్ని హగ్‌ చేసుకున్నాడట. కాగా, సీఏ సూచించిన కొన్ని హోటల్‌కు వెళ్లాడానికి అనుమతులున్నాయి. కానీ సదరు అభిమానితో క్లోజ్‌గా ఉండటంతో పాటు హోటల్‌ బయట కూర్చొన్నప్పుడు కూడా మాస్కులు ధరించలేదని విషయం సీఏ దృష్టికి వచ్చింది. దాంతో పంత్‌తో పాటు అతనితో ఉ‍న్న క్రికెటర్లను ఐసోలేషన్‌లో ఉంచాలని  క్రికెట్‌ ఆస్ట్రేలియా ఆదేశించింది. ఈ విషయాన్ని  భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ)కి తెలియజేసింది. దీనికి టీమ్‌ మేనేజ్‌మెంట్‌ అంగీకరించడంతో వారంతా ముందుగానే సిడ్నీకి చేరుకుని ఐసోలేషన్‌లో ఉండనున్నారు.  వీరికి విడిగా శిక్షణ ఇవ్వాలని కూడా నిర్ణయించారు. 

Videos

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)