బర్త్‌డే పార్టీలో ఓవరాక్షన్‌ : సింగర్‌పై కాల్పులు

Published on Tue, 10/27/2020 - 16:43

లక్నో : ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలియా జిల్లాలో బీజేపీ నేత నివాసంలో జరిగిన బర్త్‌డే పార్టీలో కలకలం రేగింది. స్ధానికులు అత్యుత్సాహంతో కాల్పులు జరపడంతో స్టేజ్‌ సింగర్‌, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. భోజ్‌పురి గాయకుడు గోలు రాజా ఇతర గాయకులతో కలిసి పాటలు పాడుతుండగా ఏడెనిమిది మంది వ్యక్తులు రెండు సార్లు వారిపై గురిపెట్టి కాల్పులు జరిపారు. మహాకల్పూర్‌ గ్రామంలో జిల్లా బీజేపీ యువమోర్చా నేత భానూ దూబే నివాసంలో జరిగిన తన కుమారుడి బర్త్‌డే పార్టీలో ఈ ఘటన వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

ఈ వీడియోలో గోలు రాజా వేదికపై పాడుతుండగా రెండుసార్లు కాల్పులు జరగడంతో ఆయన ఉలిక్కిపడి ఒక్క ఉదుటున వేదిక నుంచి పరుగెత్తే దృశ్యాలు కనిపించాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో ఒక బుల్లెట్‌ రాజా కడుపులోకి, మరో బుల్లెట్‌ ఆయన చేతిలోకి దూసుకెళ్లిందని బలియా ఎస్పీ దేవేంద్ర నాథ్‌ వెల్లడించారు. కాల్పుల్లో గాయపడిన  గాయకుడిని వారణాసి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, లైసెన్స్డ్‌ రివాల్వర్‌ నుంచి రాజాపై కాల్పులు జరిపారని ఎస్పీ తెలిపారు. చదవండి : హథ్రాస్‌ కేసు.. సుప్రీం కీలక నిర్ణయం

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ