amp pages | Sakshi

యువత సమస్యలపై ప్రభుత్వానికి నిజాయితీ లేదు

Published on Sat, 09/05/2020 - 08:34

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పేదరికం, నిరుద్యోగం, పెరిగిపోయాయని, యువతరానికి ఉపాధి కల్పనలో ప్రభుత్వానికి నిజాయితీ లేదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. పోటీ పరీక్షల దరఖాస్తు ఫారాలను అమ్మి, కోట్ల రూపాయలను వసూలు చేస్తున్నారనీ, అయితే పరీక్షలు మాత్రం నిర్వహించడం లేదని, కొన్ని పరీక్షలు నిర్వహించినప్పటికీ, నెలలు గడుస్తున్నా ఫలితాలను ప్రకటించడం లేదని రాహుల్‌ ఆరోపించారు. నిరుద్యోగం, ప్రైవేటీకరణ పెరగడంపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కూడా ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.2017 నుంచి ఇప్పటి వరకు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఎటువంటి నియామకాలు చేపట్టలేదని ఆమె ఆరోపించారు.

ప్రభుత్వం తక్షణం ఉపాధి కల్పన, తొలగించిన వారిని తిరిగి పనిలోకి తీసుకోవడం, ఉద్యోగాల కోసం పెండింగ్‌లో ఉన్న పరీక్షా ఫలితాలను ప్రకటించడం పై దృష్టి సారించాలని రాహుల్‌ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఐక్యారాజ్య సమితి నివేదికను ప్రస్థావిస్తూ మహిళల్లో పేదరికం విపరీతంగా పెరిగిందని కాంగ్రెస్‌ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జీవాలా అన్నారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) అంచనా ప్రకారం 40 కోట్ల మంది భారతీయులు అదనంగా దారిద్య్ర రేఖ దిగువకు చేరారని ఆయన అన్నారు. 64,371 టెక్నికల్‌ పోస్టులకు రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ ఫలితాలు ప్రకటించినా, ఇంత వరకు నియామకాలు జరపలేదని ఆయన విమర్శించారు. ఆర్‌ఆర్‌బిలో 1,03,769 గ్రూప్‌ డి ఖాళీలకు నోటిఫికేషన్‌ ఇచ్చినా, ఇంతవరకు నియామకాలు జరపలేదని, 1.16 కోట్ల మంది అభ్యర్థుల నుంచి దాదాపు 500 కోట్ల రూపాయలు వసూలు చేశారని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్‌ వల్లభ్‌ అన్నారు.

చదవండి: నోట్ల రద్దు ‘అసంఘటితం’పై శరాఘాతం

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)