గడిచిన 24 గంటల్లో 45,903 కేసులు

Published on Mon, 11/09/2020 - 10:08

ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగతుంది. గడచిన 24 గంటలలో 45,903 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య 85,53,657కి చేరుకుంది. ఇక గడచిన 24 గంటల్లో దేశంలో కరోనా వల్ల మొత్తం 490 మంది  మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 1,26,611కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్ఛార్జ్ అయిన వారి సంఖ్య 48,405 ఉండగా.. ఇప్పటి వరకు కోవిడ్‌కి చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 79,17,373గా ఉంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 5,09,673 ఉన్నాయి. ఇక దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 92.56 శాతంగా ఉంది. దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 5.96  శాతంగా ఉండగా.. మొత్తం నమోదయిన కేసులలో మరణాల రేటు 1.48 శాతానికి తగ్గింది. (చదవండి: వారికే కరోనా ముప్పు ఎక్కువట)


 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ