జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
ఘోర రోడ్డు ప్రమాదం.. సీఐ దంపతులు మృతి
Published on Sat, 05/08/2021 - 06:20
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగర శివార్లలోని అబ్దుల్లాపూర్మేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున ఆగి ఉన్న ఓ లారీని స్విఫ్ట్ కారు వేగంగా వెళ్లి ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. అందులో ప్రయాణిస్తున్న హైదరాబాద్ సుల్తాన్ బజార్ సీఐ ఎస్. లక్ష్మణ్, ఆయన భార్య ఝాన్సి అక్కడికక్కడే మృతి చెందారు. సూర్యాపేట నుండి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో సీఐ భార్య ఝాన్సి కారును నడిపినట్లు సమాచారం.
#
Tags