అదృశ్యమైన బాలిక.. పంటపొలాల్లో శవంగా

Published on Sat, 01/16/2021 - 20:33

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయిన బాలిక పంటపొలాల్లో శవమై కనిపించింది. యూపీలోని జమాల్‌పూర్‌ గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఆ తర్వాత మళ్లీ తిరిగిరాలేదు. ఈ క్రమంలో స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు.. గ్రామ శివారులోని పంటపొలాల వద్దకు చేరుకోగా బాధితురాలి మృతదేహం కనిపించింది.  దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలంలో విషం డబ్బా కనిపించడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా లేదా ఎవరైనా బలవంతంగా విషం తాగించారా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.(చదవండి: 13 నెలల నరకం.. గర్భవతిగా ఇంటికి)

ఇక పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించిన పోలీసులు స్థానికుల నుంచి సేకరించారు.  అయితే బాలిక తప్పిపోయిన విషయం గురించి ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయకపోవడం, శవం దొరికిన తర్వాత కూడా సరైన రీతిలో స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ