వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
Breaking News
సీఎం జగన్ను కలిసిన ఎమ్మెల్యే విక్రమ్రెడ్డి
Published on Fri, 08/19/2022 - 14:51
సాక్షి, నెల్లూరు(సెంట్రల్): ఆత్మకూరు నియోజకవర్గంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజీని ఈనెల 30వ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని బుధవారం ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా బ్యారేజీ నిర్మాణం గురించి, దాని రైతాంగం ఎలా లబ్ధిపొందుతుంది తదితర వివరాలను విక్రమ్రెడ్డి సీఎం జగన్కు వివరించారు.
అనంతరం ఆత్మకూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి పనుల గురించి చెప్పారు. ఇంకా చేయాల్సిన వాటిని సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తాను నియోజకవర్గంలో తిరుగుతున్న సమయంలో స్థానిక ప్రజల నుంచి వస్తున్న స్పందన, సంక్షేమ పథకాల లబ్ధిదారులు వ్యక్తం చేస్తున్న సంతోషాన్ని ముఖ్యమంత్రికి చెప్పారు. త్వరలో బ్యారేజీని ప్రారంభిస్తున్న నేపథ్యంలో జగన్మోహన్రెడ్డికి విక్రమ్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
చదవండి: (సంక్రాంతి నుంచి ‘ఫ్యామిలీ డాక్టర్’)
Tags