61.03 లక్షల మందికి 1 నుంచి పింఛన్లు

Published on Thu, 03/31/2022 - 08:23

సాక్షి, అమరావతి: ఏప్రిల్‌ రెండో తేదీ ఉగాది పండుగ నేపథ్యంలో రాష్ట్రంలో పింఛనుదారులందరికీ 1న పింఛన్‌ చేతికందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 61,03,530 మంది అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. రెండు రోజుల ముందే రూ.1,551.15 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.

బుధవారం ఉదయం నుంచే లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) అధికారులు గ్రామ, వార్డు సచివాలయాల వారీగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. వలంటీర్ల ఆధ్వర్యంలో 1న తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ మొదలుపెట్టి, సాయంత్రంలోగా కనీసం 90 శాతం మందికి డబ్బులు చేరవేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

చదవండి: రాయచోటి.. ప్రత్యేకతల్లో మేటి 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ