amp pages | Sakshi

నిజామాబాద్‌లో.. పసుపు బోర్డు ఏర్పాటు..

Published on Wed, 04/03/2019 - 13:53

సాక్షి, నిజామాబాద్‌ : పసుపుబోర్డును ఏర్పాటు చేసి, పసుపునకు మంచి ధర లభించేలా చర్యలు చేపడతామని కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రకటించారు. ఎర్రజొన్న రైతులనూ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నిజామాబాద్‌లోని పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో మంగళవారం జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. వంద రోజుల్లో నిజాం షుగర్స్‌ ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఐదేళ్లుగా హామీని విస్మరించిందని, తమ అభ్యర్థిని గెలిపిస్తే పారిశ్రామిక వేత్తలతో టేకోవర్‌ చేయించి ఫ్యాక్టరీని పునఃప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.

 టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లపై విమర్శలు.. 
టీఆర్‌ఎస్‌తో పాటు, కాంగ్రెస్‌పైనా రాజ్‌నాథ్‌సింగ్‌ విమర్శలు చేశారు. నిజాంషుగర్స్‌ ఫ్యాక్టరీ నడవకపోయినప్పటికీ.. అవినీతి మాత్రం నడుస్తోందన్నారు. నిరుపేదల అభ్యున్నతి కోసం, దేశ అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుంటే.. కొన్నింటికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అడ్డుపడుతోందని ఆరోపించారు. యూపీఏ హయాంలో దేశంలో 25 లక్షల గృహాలు నిర్మిస్తే., మోదీ ఐదేళ్ల పాలనలో 1.30 కోట్ల గృహాలను నిర్మించి ఇచ్చామన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించిన రాజ్‌నాథ్‌.. కిసాన్‌ సమ్మాన్‌ యోజన కింద రైతులకు రూ.6 వేల ఆర్థిక సహాయం, సబ్సిడీ గ్యాస్‌ కనెక్షన్లు వంటి పథకాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఐదేళ్ల మోదీ పాలనలో దేశ ప్రతిష్ట ఎలా పెరిగిందో జిల్లా నుంచి ఇతర దేశాలకు వెళ్లిన వారిని అడగాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కోసం కేసీఆర్‌ కు ఓటేసిన ప్రజలు.. పార్లమెంట్‌ ఎన్నికల్లో మోదీ కోసం బీజేపీ అభ్యర్థులకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.

రైతాంగం తిరగబడింది : డాక్టర్‌ లక్ష్మణ్‌ 
నిజామాబాద్‌లో ఎర్రజొన్న, పసుపు రైతులు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తిరగబడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ లక్ష్మణ్‌ విమర్శించారు. టీఆర్‌ఎస్‌ సర్కారు ఇన్నాళ్లూ రైతులను మభ్యపెట్టిందని, వీధుల్లోకి వచ్చి ఉద్యమిస్తుంటే కనీసం పట్టించుకోలేదన్నారు. రైతులు 185 మంది నామినేషన్లు వేశారంటే వారి కడుపు ఎంత మండిందో అర్థం చేసుకోవచ్చన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ మొదటి ఓటమి నిజామాబాద్‌లోనే చూడబోతోందని వ్యాఖ్యానించారు. సభలో నిజామాబాద్‌ పార్లమెంట్‌ పార్టీ ఇన్‌చార్జి వెంకటరమణి, జిల్లా అధ్యక్షులు పల్లెగంగారెడ్డి, పార్టీ జహీరాబాద్‌ అభ్యర్థి బానాల లక్ష్మారెడ్డి, నాయకులు యెండల లక్ష్మీనారాయణ, లోకభూపతిరెడ్డి, శ్రీనివాస్, లక్ష్మీనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Videos

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)