amp pages | Sakshi

‘రూరల్‌’ పోరు  రసవత్తరం

Published on Sat, 12/01/2018 - 11:11

నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో మూడు పార్టీల అభ్యర్థులు విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఎన్నికల ప్రచారంలో.. నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ధి పనులను టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ వివరిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే చేపట్టనున్న సంక్షేమ పథకాలను ఆపార్టీ అభ్యర్థి డాక్టర్‌ ఆర్‌ భూపతిరెడ్డి చెబుతున్నారు. బీజేపీ అభ్యర్థి ఆనంద్‌ రెడ్డి కేంద్రంలో మోదీ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ.. తనను గెలిపిస్తే నిస్వార్థంగా సేవలందిస్తానని హామీ ఇస్తున్నారు.

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం పోరు రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, కాంగ్రెస్‌ అభ్యర్థి ఆర్‌ భూపతిరెడ్డి, బీజేపీ అభ్యర్థి కేశ్‌పల్లి గడ్డం ఆనందర్‌రెడ్డి మధ్య పోరు జోరుగా సాగుతోంది. మూడు పార్టీల అభ్యర్థులు విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. పోలింగ్‌ సమీపిస్తున్న కొద్దీ ఈ ముగ్గురు అభ్యరులు గెలుపు కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. నాలుగున్నరేళ్లలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులను బాజిరెడ్డి వివరిస్తున్నారు. 

అలాగే మరోమారు అధికారంలోకి వచ్చాక తమ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అమలు చేయనున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తున్నారు. పెన్షను లబ్ధిదారులు, రైతులు, మైనార్టీలు అన్ని వర్గాల ప్రజల తమను మరోమారు ఆశీర్వదించాలని కోరుతున్నారు. నాలుగున్నరేళ్లలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న కాంగ్రెస్‌ అభ్యర్థి డాక్టర్‌ ఆర్‌ భూపతిరెడ్డి.. కాంగ్రెస్‌ సర్కారు అధికారంలోకి వచ్చాక చేపట్టనున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి చెబుతున్నారు.

రైతులకు రూ.రెండు లక్షల రుణమాఫీ, రూ.రెండు వేల పింఛన్‌ వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కేంద్రంలోని మోదీ సర్కారు అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి సంక్షేమ పథకాలను బీజేపీ అభ్యర్థి కేశ్‌పల్లి గడ్డం ఆనంద్‌రెడ్డి ప్రజలకు వివరిస్తున్నారు. అలాగే తన తండ్రి కేశ్‌పల్లి గంగారెడ్డి ఎంపీగా, ఎమ్మెల్యేగా జిల్లా కోసం చేసిన నిస్వార్థ సేవలు, అభివృద్ధి పనులను ఆనందర్‌రెడ్డి ప్రస్తావిస్తున్నారు. తనకు అవకాశం కల్పిస్తే తన తండ్రిబాటలో నడిచి ప్రజలకు సేవలందిస్తామని చెబుతున్నారు. ఈ మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోరు రసవత్తరంగా సాగుతుండటంతో రూరల్‌ రాజకీయాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి.
 
పోటా పోటీగా ప్రచారం.. 
ముగ్గురు ప్రధాన అభ్యర్థుల మధ్య ప్రచారం జోరందుకుంది. నెల రోజుల ముందు నుంచే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాజిరెడ్డి ప్రచారాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలోని గ్రామగ్రామాన్ని చుట్టి వచ్చారు. ప్రధాన సామాజికవర్గాలతో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించారు. ఇప్పుడు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. తన అభ్యర్థిత్వం ఖరారైన వెంటనే కాంగ్రెస్‌ అభ్యర్థి డాక్టర్‌ ఆర్‌ భూపతిరెడ్డి ప్రచారాన్ని వేగవంతం చేశారు. అంతకుముందే నియోజకవర్గంలో తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. నామినేషన్‌ దాఖలు చేసిన వెంటనే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బీజేపీ అభ్యర్థి ఆనంద్‌రెడ్డి ప్రచారం జోరుగా సాగుతోంది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థులకు దీటుగా ఆనంద్‌రెడ్డి ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థుల కుటుంబసభ్యులు కూడా ప్రచార రంగంలోకి దిగడంతో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)