amp pages | Sakshi

వారిని తరిమి కొట్టాలి

Published on Fri, 04/05/2019 - 17:43

నిజామాబాద్‌ సిటీ/నిజామాబాద్‌ : దేశం, రాష్ట్రం బాగు పడాలంటే ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్‌ను తరిమికొట్టాలని టీపీసీసీ స్టార్‌ క్యాంపెయినర్, కాంగ్రెస్‌ నాయకురాలు విజయశాంతి పిలుపునిచ్చారు. మోదీ దేశ ప్రజలను ఆర్థికంగా దెబ్బ తీస్తే, కేసీఆర్‌ అబద్ధాలతో రాష్ట్రాన్ని ఏలుతున్నారని విమర్శించారు. గురువారం నిజామాబాద్‌లోని చంద్రశేఖర్‌కాలనీలో నిర్వహించిన బహిరంగ సభలో విజయశాంతి ప్రసంగించారు. దేశానికి మోదీ, రాష్ట్రానికి కేసీఆర్‌ శనిలా మారారని, వారిని తరిమి కొడితేనే మనం బాగుపడుతామన్నారు.

ఆర్థిక ఇబ్బందులే.. 
2014 ఎన్నికల వేళ నల్లధనం తీసుకువచ్చి ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని మోదీ మాయ మాటలు చెప్పటంతో ప్రజలు గెలిపించారని, కానీ, ఆ తర్వాతే మోదీ అసలు స్వరూపం బయటపడిందని విజయశాంతి తెలిపారు. పెద్ద నోట్లు రద్దు చేసి అనేక మంది ప్రాణాలు పోడానికి కారణమయ్యాడని విమర్శించారు. జీఎస్‌టీ తీసుకువచ్చి చిన్న వ్యాపారాలు, పరిశ్రమలను దెబ్బతీశాడన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన మోదీ.. మళ్లీ నమ్మించి గొంతు కోయడానికి వస్తున్నాడని ఆరోపించారు. ప్రస్తుతం నరేంద్రమోదీ, రాహుల్‌గాంధీల మధ్య ఎన్నికల యుద్ధం జరుగుతోందని, ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు పలికి రాహుల్‌ను ప్రధాని చేయాలని పిలుపునిచ్చారు.

కేసీఆర్‌ జన్మంతా అబద్ధాలే.. 
కేసీఆర్‌ మాట్లాడిన ప్రతి మాట అబద్ధమేనని విజయశాంతి విమర్శించారు. అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్‌ను గిన్నిస్‌బుక్‌ రికార్డులో ఎక్కించవచ్చని ఎద్దేవా చేశారు. ఐదేళ్లుగా కేసీఆర్‌ మోదీకి గులాం, సలామ్‌ చేస్తున్నాడన్నారు. 15 మంది ఎంపీలు ఉన్నా ఐదేళ్లలో విభజన హామీలు సాధించుకోలేదు కానీ, ఇప్పుడు 16 మంది ఎంపీలు కావాలని అనడం సిగ్గుచేటనన్నారు. కేసీఆర్‌కు ఓటువేస్తే మోదీకి వేసినట్లేనని తెలిపారు. ఎంపీ కవిత జిల్లాకు చేసింది ఏమి లేదని విమర్శించారు. సోనియాగాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని, దొరల పాలన పోవాలంటే కేసీఆర్‌కు కాకుండా కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరారు.

నిజామాబాద్‌లో 180 మంది రైతులు నామినేషన్లు వేశారంటే ఇక్కడి రైతుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చునన్నారు. పసుపు, ఎర్రొజొన్న రైతుల సమస్యలకు పరిష్కారం చూపని కేసీఆర్‌పై రైతుల తిరిగిబాటు మొదలైందని, ప్రజలు సైతం ఈ విషయాన్ని గుర్తించుకుని కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రులు షబ్బీర్‌అలీ, సుదర్శన్‌రెడ్డి, పార్టీ అభ్యర్థి మధుయాష్కీగౌడ్, డీసీసీ చీఫ్‌ మానాల మోహన్‌రెడ్డి, నాయకులు గడుగు గంగాధర్, కేశ వేణు, సుభాష్‌జాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.   

Videos

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)