amp pages | Sakshi

ఒక్కసారి అవకాశం ఇవ్వండి

Published on Thu, 11/29/2018 - 11:19

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టులు, టీఆర్‌ఎస్‌కు పలుమార్లు అవకాశం ఇచ్చారు.. కానీ, వారు చేసిన అభివృద్ధి ఏమీ లేదు.  బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. సమగ్రంగా అభివృద్ధి చేసి చూపిస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి గంగిడి మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో చౌటుప్పల్‌ మండలం తంగడిపల్లిలో బుధవారం నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. నల్లగొండ జిల్లా వాసులు నేటికీ ఫ్లోరైడ్‌ నీటినే తాగుతున్నారని.. ప్రజల కోసం ఏం చేశావో చెప్పాలి కేసీఆర్‌ అంటూ ప్రశ్నించారు. 

సాక్షి, సంస్థాన్‌ నారాయణపురం/చౌటుప్పల్‌ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టులు, టీఆర్‌ఎస్‌లకు పలుమార్లు అవకాశం ఇచ్చినా వారు చేసిన అభివృద్ధి ఏమి లేదని బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి  అభివృద్ధి చేసి చూపిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు.  మునుగోడు బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ గంగడి మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో చౌటుప్పల్‌ మండలం తంగడిపల్లిలోని ముసుకు మధుసూదన్‌రెడ్డి స్టేడియంలో బుధవారం ఏర్పాటు చేసిన ‘మార్పు కోసం బీజేపీ’ బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి’’  నెలకొన్న పవిత్ర క్షేత్రంలో రెండు చేతులెత్తి ప్రార్థిస్తున్నాను, తెలంగాణ విముక్తి కోసం పోరాడిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ నమస్కరిస్తున్నానన్నారు.   బీజేపీ నాయకుడు గుండగాని మైసయ్య గౌడ్‌ ఊరికి వెళ్లి శ్రద్ధాంజలి ఘటించానని తెలిపారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఫ్లోరైడ్‌తో అనారోగ్యం పాలవుతున్న  ప్రజల కోసం కేసీఆర్‌  ఏం చేశాడో చెప్పాలని ప్రశ్నించారు.

చౌటుప్పల్‌లోని మందుల కంపెనీలతో లాలూచీ పడి ఆ కంపెనీల నుంచి వచ్చే కాలుష్యంతో ప్రజల ఆరోగ్యం పాడైపోతున్న పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాంట్రాక్టర్ల కమీషన్లతో నక్కలగండి ప్రాజెక్ట్‌ పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆరోపించారు.   నక్కలగండి ప్రాజెక్ట్‌ బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. నాలుగు సంవత్సరాల పాలనలో నియోజకవర్గంలో ఒక్క డిగ్రీ కాలేజ్‌ స్థాపించ లేదని విమర్శించారు.  బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ గంగడి మనోహర్‌రెడ్డి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి చౌటుప్పల్‌ను నేషనల్‌ రూర్బన్‌ పథకంలో చేర్చారన్నారు. మనోహర్‌రెడ్డి గెలిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కార్యకర్తలు బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలన్నారు. అనంతరం  రాజస్థాన్‌ జలవనరుల సలహాదారు శ్రీరామ్‌ మాట్లాడుతూ ఓడిపోతామనే భయంతోనే  కేసీఆర్‌ ముందుస్తు ఎన్నికలకు వచ్చారన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతా సాంబమూర్తి మాట్లాడుతూ ఓటు బ్యాంకు రాజకీయాల కో సం టీఆర్‌ఎస్‌ ఓవైసీతో జట్టు కట్టిందని ఆరోపించారు. నకిరేకల్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కాసర్ల లింగయ్య మాట్లాడుతూ అవకాశం ఇస్తే సేవ చేస్తానని తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గెలుస్తుందని అన్నారు.

సమస్యలకు కారణం కాంగ్రెస్‌ పార్టీనే..
మునుగోడు నియోజకవర్గంలోని అన్ని సమస్యలకు కాంగ్రెస్‌ పార్టీనే కారణమని మునుగోడు బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ గంగిడి మనోహర్‌రెడ్డి విమర్శించారు.  ఫ్లోరోసిస్‌ నీళ్లకు, బీడు బీములకు, విద్యా, వైద్య సదుపాయాలు లేని నియోజవర్గానికి చిరునామాగా మునుగోడు మారిందన్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్‌ చండూరు సభలో చర్లగూడెం ప్రాజెక్ట్‌ను కుర్చి వేసుకుని పూర్తి చేస్తానని చెప్పి నిన్న అదే చండూరు సభలో వచ్చే ఏడాదిన్నరలో పూర్తి చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. చర్లగూడెం ప్రాజెక్టుకు నీళ్లు ఎక్కడ నుంచి తీసుకు వస్తారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గట్టుప్పల్‌ మండలాన్ని ఎందుకు రద్దు చేశారో చెప్పాలన్నారు.మునుగోడు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రభాకర్‌రెడ్డి నియోజకవర్గ సమస్యలను  ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లలేని అసమర్థుడు అని విమర్శించారు.  2009 నుంచి ఎంపీ, ఎమ్మెల్సీగా ఉన్న రాజగోపాల్‌రెడ్డి  మునుగోడు నియోజకవర్గానికి ఏం చేశాడో చెప్పాలని డిమాండ్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో త నను గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గ ప్రజలకు  అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానన్నారు.   ఈ కార్యక్రమంలో బీదర్‌ ఎమ్మెల్సీ రఘునాథరావు, బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి, నల్లగొండ అభ్యర్థి శ్రీరా మోజు షణ్ముఖ, జిట్టా బాలకృష్ణారెడ్డి, దోనూరి వీరారెడ్డి, సాగర్ల లింగయ్య, కాయితి రమేష్, దూడల భిక్షం, దాసాజు వెంకటాచారి, బాస్కర్‌ నర్సింహ, గుజ్జల సురేందర్‌రెడ్డి, పాలకుర్ల జంగయ్య, తడక సురేఖ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తాలు...

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)