amp pages | Sakshi

‘బాబు అవినీతిపై దేశవ్యాప్త చర్చ జరుగుతోంది’

Published on Fri, 02/14/2020 - 14:22

సాక్షి, వైఎస్సార్‌/కర్నూలు/అనంతపురం : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అవినీతిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా తెలిపారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో ప్రతి పనిలో అవినీతి జరిగిందని విమర్శించారు. బాబు అవినీతిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ హయాంలో ప్రతి పనిలో చిన్నబాబుకు కమిషన్లు వెళ్ళేవని విమర్శించారు. చంద్రబాబు అవినీతిని ఐటీ అధికారులు నిగ్గు తేల్చారని తెలిపారు. ఇది ఆరంభం మాత్రమే అని చెప్పడంతో అవినీతి చేసిన టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పారు.(చదవండి : చంద్రబాబు అవినీతి బట్టబయలు)

అవినీతికి చంద్రబాబు బ్రాండ్‌ అంబాసిడర్‌ : గడికోట
ప్రభుత్వ చీప్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశ చరిత్రలో అవినీతికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా చంద్రబాబు మిగిలిపోతారని విమర్శించారు. అన్ని వ్యవస్థలను మేనేజ్‌ చేయగల ఘనుడు చంద్రబాబు అని తెలిపారు. దేశ చరిత్రలో స్వాతంత్ర్యం తర్వాత ఇటువంటి భారీ స్కామ్‌ ఎక్కడా లేదన్నారు. చంద్రబాబు చేసిన అవినీతి బాగోతాన్ని ఐటీ అధికారులు బట్టబయలు చేశారని చెప్పారు. గతంలో ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా బుక్కయ్యారని గుర్తుచేశారు. బాబు అక్రమ ఆస్తులపై దర్యాప్తు సంస్థ నిఘా పెట్టాలని కోరారు. టీడీపీ హయాంలో రూ. 3లక్షల కోట్లు అప్పుచేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు. ఈ అవినీతి బాగోతంలో పాత్ర ఉన్న ప్రతి ఒక్కరికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇవన్నీ తప్పుదోవ పట్టించేందుకు అమరావతి అంశంపై బాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. (చదవండి : బాబు తేలు కుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నారు)

ఆ డైరీలో బాబు బాగోతం ఉంది : తోపుదుర్తి
రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ.. అవినీతికి కేరాఫ్‌ చంద్రబాబు అని విమర్శించారు. చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌ ఇంట్లో లభ్యమైన డైరీలో చంద్రబాబు బాగోతం ఉందన్నారు. పీఎస్‌ ఇంట్లోనే రూ. 2వేల కోట్ల లావాదేవీలు వెలుగు చూస్తే.. బాబు ఇంట్లో ఎంత ఉంటుందో అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌ బినామీ ఆస్తులపై సీబీఐ, ఈడీ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ హయాంలో మంత్రులుగా పనిచేసిన వారందరిపైనా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీ పాలనలో చేసిన అప్పులు.. చంద్రబాబు అండ్‌ కో జేబుల్లో నింపుకున్నారని మండిపడ్డారు. 

విద్యావంతుల ద్వారా వాస్తవాలు తెలుసుకోవాలి : ఆమంచి
మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ మాట్లాడుతూ.. టీడీపీ ప్రజాధనాన్ని దోచుకునే ఓ సంస్థ అని విమర్శించారు. రాజధాని భూముల పేరుతో లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని అన్నారు. అచ్చెన్నాయుడు, బొండా ఉమాలను అడ్డం పెట్టుకుని చంద్రబాబు కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. ఫోర్త్‌ ఎస్టేట్‌గా నిలువాల్సిన మీడియా విలువలను ఎల్లో మీడియా నాశనం చేసిందన్నారు. ఇంట్లో ఉన్న విద్యావంతులైన పిల్లల ద్వారా ప్రజలు రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలను తెలుసుకోవాలన్నారు. తెలుగుదేశం డ్రామా కంపెనీ మూసివేసే టైమ్‌ వచ్చిందని అభిప్రాయపడ్డారు. 

బాబు అవినీతి మరోసారి రుజువైంది : బీవై రామయ్య
వైఎస్సార్‌సీపీ నేత బీవై రామయ్య మాట్లాడుతూ.. చంద్రబాబు అవినీతి పరుడని ఆధారాలతోపాటు మరొక్కసారి రుజువైంది. సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడని గుర్తుచేశాడు. వాటిపైనా విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవస్థలను మేనేజ్‌ చేసే వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. ఈ కేసు నుంచి చంద్రబాబు, లోకేశ్‌లు తప్పించుకోలేరని అన్నారు. చంద్రబాబు, లోకేశ్‌ ఇళ్లపై కూడా దాడులు నిర్వహించి లక్షల కోట్ల రూపాయల అవినీతి సొమ్మును బయటకు తీయాలని డిమాండ్‌ చేశారు.

చదవండి : లాగింది తీగమాత్రమే.. డొంక చాలా పెద్దది

చంద్రబాబుని పట్టుకుంటే ఎన్ని వేల కోట్లో!

Videos

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి

Photos

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)