ఆ విషయంలో పవార్‌దే కీలక పాత్ర: ఠాక్రే

Published on Thu, 12/26/2019 - 16:10

ముంబై : ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ కీలక పాత్ర పోషించారని శివసేన అధినేత, ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే పేర్కొన్నారు. బుధవారం ముంబైలోని వసంత్‌దాదా షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తమకు తక్కువ సీట్లున్నప్పటికీ (శివసేన) ఎన్సీపీ, కాంగ్రెస్‌ కూటమితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి శరద్‌పవార్‌ వ్యూహం రచించారని తెలిపారు. భూమి తక్కువగా ఉన్నా... వ్యవసాయ ఉత్పాదకత ఎలా పెంచాలో నేర్పిన పవార్‌.. అదేవిధంగా తక్కువ సీట్లున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని చెప్పారని వ్యాఖ్యానించారు.

కాగా ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీతో జట్టుకట్టి.. 169 మంది సభ్యుల మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సిద్ధాంతపరంగా శివసేనతో జత కట్టడానికి కాం గ్రెస్‌ వెనుకంజ వేసినా ఇరువర్గాలకు సంధి కుదర్చడంలో శరద్‌పవార్‌ సఫలమయ్యారు. కామన్‌ మినిమమ్‌ ఎజెండాతో శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. బీజీపీ మాత్రం.. తమతో కలసి సీట్లు గెలుచుకున్న శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని విమర్శిస్తున్న విషయం తెలిసిందే.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ