amp pages | Sakshi

దేశ ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు

Published on Tue, 03/26/2019 - 13:13

సాక్షి, ములుగు : తెలంగాణలో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తూ సమన్యాయంతో పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్‌ వైపు దేశ ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల శాఖ  మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని డీఎల్‌ఆర్‌ గార్డెన్స్‌లో సోమవారం ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలను గెలిపించుకుంటే ఢిల్లీలో సీఎం చక్రం తిప్పడం ఖాయమన్నారు.

పార్టీలో కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని, ఎంపీ సీతారాంనాయక్‌కు అన్యాయం జరుగలేదని, సుముచిత స్థానం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఆరు నెలల కాలంలో చెరువులకు దేవాదుల ద్వారా నీటిని అందించి మత్తళ్లు పోసేలా చర్యలు తీసుకుంటామని, అలాగే పోడు రైతులకు పట్టాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ములుగు జిల్లాలో పార్టీకి సంబంధించి మనలో మనకే లొల్లి ఉందని, శాసన సభ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను పునరావత్తం కాకుండా చూసుకోవాలని సూచించారు.

మండల, గ్రామ స్థాయిలో కార్యకర్తలు సమన్వయంగా పని చేస్తు పార్లమెంట్‌ అభ్యర్థి మాలోత్‌ కవితను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తరఫున ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను అందించామని, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ధైర్యంగా ఓటును అడగాలని, ప్రభుత్వ పథకాల అమలు విషయంలో ప్రజలకు వివరించాలని కోరారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, 100 నుంచి 70 శాతం ఓట్లు పడిన గ్రామాలను గుర్తించి దత్తత తీసుకుంటామని చెప్పారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉందని, పార్లమెంట్‌ సెగ్మెంట్ల వారీగా ఇన్‌చార్జిలను నియమించే పరిస్థితి కూడా ఆ పార్టీకి లేదని ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌ అభ్యర్థి మాలోతు కవిత మాట్లాడుతూ ములుగు నియోజకవర్గ ప్రజలను ఆశీర్వదించి గెలిపించాలని, సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బిల్ట్‌ పరిశ్రమ పునరుద్ధరణ, చెరువులను రిజర్వాయర్‌లుగా మార్చడం, పోడు రైతులకు పట్టాలు అందించడంలో ముందుంటానని అన్నారు. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున అన్ని రకాల సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని అన్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)