amp pages | Sakshi

దేశంలో ఫస్ట్‌.. దక్షిణాదిలోలాస్ట్‌!

Published on Tue, 12/25/2018 - 04:31

సాక్షి, అమరావతి : నాలుగేళ్లలో రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టామని, అయితే దక్షిణాదిలో మిగిలిన రాష్ట్రాల కంటే ఇప్పటికీ వెనుకబడ్డామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. వృద్ధి రేటులో మిగిలిన రాష్ట్రాలను అధిగమించి మొదటి స్థానంలో ఉన్నా తలసరి ఆదాయంలో వెనుకబడ్డామన్నారు. ఉండవల్లిలోని గ్రీవెన్స్‌ హాలులో సోమవారం సుపరిపాలన (గవర్నెన్స్‌)పై రెండో శ్వేతపత్రాన్ని ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా అందులోని అంశాలను వివరించడంతోపాటు రాజకీయాలపైనా మాట్లాడారు. కాంగ్రెస్‌ను ఎన్టీఆర్‌ వ్యతిరేకిస్తే తాను ఇప్పుడు అదే పార్టీతో కలిశానని ప్రధాని మోడీ చేసిన విమర్శపై స్పందిస్తూ.. కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తే తప్పేమిటని ప్రశ్నించారు. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీల్లో ఏదో ఒక పార్టీ వైపు ఉండాల్సిందేనని, ఈ రెండు కాకుండా కొత్త సృష్టి చేయలేమన్నారు. కేసీఆర్‌ ప్రతిపాదిస్తున్న ఫెడరల్‌ ఫ్రంట్‌ విఫలమవుతుందని చెబుతున్నారా అని అడిగిన ప్రశ్నకు తాను అలా అనడంలేదని సమాధానమిచ్చారు.

మమతా బెనర్జీని ఆయన కలవడం సాధారణమేనన్నారు. ధనిక పార్టీలన్నీ కూటమిగా ఏర్పాటయ్యాయని మోడీ చేసిన విమర్శపై మాట్లాడుతూ ఆయన పార్టీ కంటే సంపన్న పార్టీ మరొకటి ఉందా అన్నారు. టన్నుల కొద్ది డబ్బును దగ్గర పెట్టుకుని ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. డబ్బుతో ఎన్నికల్లో ప్రజల్ని ప్రభావితం చేయాలనుకుంటున్నారని, ఈవీఎంలతో ప్రజాస్వామ్యాన్ని చిప్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలకు అప్పగిస్తారా? అని ప్రశ్నించారు. దేశంలో అందరి కంటె ఎక్కువ అభివృద్ధి చేస్తున్నానని మోడీ తనను చూసి అసూయపడుతున్నారన్నారు. మోడీ హయాంలో స్వేచ్ఛ లేకుండా పోయిందని అన్నింటినీ ట్యాప్‌ చేస్తున్నారని, భార్యాభర్తలు మాట్లాడుకున్నా బయటకు తెలిసిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రధాన ప్రతిపక్షం ఆ పార్టీ పంచన చేరి అడుగడుగునా అడ్డంకులు కల్పిస్తోందని విమర్శించారు. 

పోలవరం నిర్మాణానికి నిధులివ్వడంలేదు
కేంద్రం పోలవరానికి నిధులివ్వడంలేదని, అందులో అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తున్నారని, అదే సమయంలో బాగా చేశామని అవార్డు ఇచ్చారని ఇదే తమ పనితీరుకు నిదర్శనమన్నారు. నిధుల్ని ఆపినా అవార్డులను ఆపలేకపోతున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్పడంలో అర్థం లేదని, వాళ్లు ఎగువన కాళేశ్వరం కడితే దిగువన పోలవరం కడుతున్నామన్నారు. సుపరిపాలనతో దేశంలో అగ్రస్థానానికి వచ్చామని, దేశంలో ఏపీకి మించి సంక్షేమం ఇచ్చిన రాష్ట్రం మరొకటి లేదని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు తుది దశకు వచ్చిందని, డిసెంబర్‌ కల్లా దాన్ని పూర్తి చేస్తామన్నారు. డ్యామ్‌కు గేటు పెట్టే కార్యక్రమాన్ని ప్రతిపక్షం ఎగతాళి చేస్తోందని, కడపలో స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తామంటే రియల్‌ ఎస్టేట్‌ కోసం చేస్తున్నామంటున్నారని, వారికి కనీస జ్ఞానం లేదని విమర్శించారు. దేశ చరిత్రలో ఇంత త్వరగా పూర్తవుతున్న సాగునీటి ప్రాజెక్టు పోలవరమేనన్నారు. త్వరలో అన్ని వ్యవసాయ పంపుసెట్లను సోలార్‌ విద్యుత్‌కు మారుస్తామని, రైతులకు ఖర్చు లేకుండా అవసరమైన విద్యుత్‌ వాడుకుని మిగిలిన దాన్ని ప్రభుత్వానికి రూ.1.50లకు ఇస్తారని తెలిపారు. రాబోయే రోజుల్లో అన్ని వాహనాలను విద్యుత్‌కు మార్చి కాలుష్యం లేకుండా చేస్తామన్నారు. విజయవాడకు వచ్చిన వారు స్వచ్ఛమైన గాలి పీల్చుకుని సంతోషంగా ఫీలవుతున్నారని, అది తమ ఘనతన్నారు. తుపానులను కూడా అంచనా వేస్తున్నామని చెప్పారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)