More

'చీపురు' పార్టీలో భగ్గుమన్న విభేదాలు

4 Mar, 2015 15:26 IST
'చీపురు' పార్టీలో భగ్గుమన్న విభేదాలు

ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అధికారం చేపట్టి పట్టుమని పదిరోజులు అయ్యిందో, లేదో.. అప్పుడే ఆ పార్టీలో విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం గురించి చర్చ మొదలైన కొన్నాళ్లకే పార్టీ జాతీయ కన్వీనర్ పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. పీఏసీ పదవికి తానూ రాజీనామా చేస్తానని పార్టీ వ్యవస్థాపక నాయకుల్లో ఒకరైన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అన్నారు. పీఏసీ భేటీకి ఆయనతో పాటు సీనియర్ నాయకుడు యోగేంద్ర యాదవ్ కూడా గైర్హాజరయ్యారు.

ఈ ఉదంతంతో పార్టీ నాయకత్వం ఎటు పోతోంది, పార్టీ పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ కేవలం ముఖ్యమంత్రి పదవికే పరిమితం అయిపోతే ఇక పార్టీని ఎవరు నడిపిస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజల ఆమోదం ఉన్నా కూడా పార్టీని సమైక్యంగా నడిపించలేరా అన్న సందేహాలు వస్తున్నాయి. పార్టీ భవితవ్యంపై కార్యకర్తల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఉనికిని చాటుకోవాలని అనుకుంటున్నా, మరోవైపు నాయకులు ఒక్కొక్కరుగా చేజారిపోతుండటంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

Sheetal Mahajan: ఎవరెస్ట్‌ జంప్‌

కనుమరుగు కానున్న 75 ఏళ్లనాటి ఫార్మసీ కౌన్సిల్‌!

ఆ రెండు రాష్ట్రాల్లో 17న పోలింగ్‌

‘కశ్మీర్‌ గాజా కాదు.. ఆ ఘనతంతా ప్రధాని మోదీదే’ 

కోహ్లి అసాధారణమైన ప్రతిభకు నిదర్శనమిది