రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
రాజకీయ ప్రకటన చేసిన ప్రకాశ్రాజ్
Published on Tue, 01/01/2019 - 10:11
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నటుడు ప్రకాశ్రాజ్ నూతన సంవత్సరం రోజున కీలక ప్రకటన చేశారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ‘‘అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీఅందరి మద్ధతుతో రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న. ఎక్కడి నుంచి అనేది త్వరలోనే ప్రకటిస్తా. వచ్చేది ప్రజా ప్రభుత్వమే’’ అంటూ ప్రకాశ్రాజ్ మంగళవారం ట్వీట్ చేశాడు. ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు ఎక్కుపెడుతూ ఆయన తరచుగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.
రజనీకాంత్, కమల్హాసన్ తరువాత రాజకీయ ప్రకటన చేసిన నటుడిగా ప్రకాశ్రాజ్ నిలిచారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా సీఎం కేసీఆర్తో కలిసి పలు అంశాలపై చర్చించిన విషయం తెలిసిందే. లోక్సభ ఎన్నికల వేళ ప్రకాశ్రాజ్ ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
HAPPY NEW YEAR TO EVERYONE..a new beginning .. more responsibility.. with UR support I will be contesting in the coming parliament elections as an INDEPENDENT CANDIDATE. Details of the constituency soon. Ab ki baar Janatha ki SARKAR #citizensvoice #justasking in parliament too..
— Prakash Raj (@prakashraaj) 31 December 2018
Tags