amp pages | Sakshi

ఈసారి లక్షమంది రైతులతో ర్యాలీ

Published on Sat, 04/28/2018 - 16:10

సాక్షి, న్యూఢిల్లీ : మహారాష్ట్రలో నాసిక్‌ నుంచి ముంబైలోని ఆజాద్‌ మైదాన్‌ వరకు రైతులు నిర్వహించిన మహా యాత్రను దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రభుత్వం అప్పుడే మరచిపోయినట్లు ఉన్నారు. రైతుల డిమాండ్లను కచ్చితంగా రెండు నెలల్లోగా అమలు చేస్తామని ఫడ్నవీస్‌ రైతు నాయకులకు స్పష్టమైన హామీ ఇచ్చి అప్పుడే నెలన్నర రోజులు గడిచిపోయాయి. అయినా రైతుల డిమాండ్ల పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్న సూచనలు కనిపించడం లేదు. రైతుల డిమాండ్ల పరిష్కారానికి ఆరుగురు మంత్రులతో వేసిన కమిటీ కూడా పేరుకు మాత్రమే రెండు సార్లు భేటీ అయింది. ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది.

మరో నెల రోజుల్లో అంగీకరించిన తమ డిమాండ్లన్నింటిని దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రభుత్వం నెరవేర్చక పోయినట్లయితే జూన్‌ ఒకటవ తేదీన లక్ష మంది రైతులతోని నిరసన యాత్రను నిర్వహిస్తామని అఖిల భారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) నాయకుడు డాక్టర్‌ అజిత్‌ నావెల్‌ హెచ్చరించారు. గతంలో తాము శాంతియుతంగా యాత్ర జరిపామని, ఈ సారి యాత్ర సందర్భంగా విధ్వంసం జరిగితే అందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా హెచ్చరించారు. రైతుల సమస్యల పరిష్కారానికి ఆరుగురు మంత్రులతో కమిటీ వేసినప్పటికీ ఆ కమిటీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రైతు నాయకులను చర్చలకు పిలవలేదని ఆయన చెప్పారు.

గత మార్చి నెలలో నాసిక్‌ నుంచి ముంబైలోని ఆజాద్‌ మైదానానికి దాదాపు 40 వేల మంది రైతులు నిరసన యాత్ర జరపడం, అది ఎంతో శాంతియుతంగా కొనసాగడం తెల్సిందే. దాదాపు 180 కిలోమీటర్లు నడిచి వచ్చిన రైతులు చివరి పది, పదిహేను కిలోమీటర్ల దూరాన్ని రాత్రిపూట మౌనంగా నడిచారు. రాష్ట్ర విధాన సభను ముట్టడిస్తే పదవ తరగతి విద్యార్థు పరీక్షలకు అంతరాయం ఏర్పడుతుందంటే ఆ ఆందోళనను విరమించి తమ నిరసన వేదికను కూడా ఆజాద్‌ మైదాన్‌కు మార్చుకున్నారు.

రైతులు తీసుకున్న రుణాల మాఫీని త్వరితగతిన సక్రమంగా అమలు చేస్తామని, రైతులకు పెట్టుబడికన్నా ఒకటిన్నర రెట్టు ఎక్కువగా కనీస మద్దతు ధర నిర్ణయిస్తామని, కొన్ని దశాబ్దాలుగా అటవి భూములు దున్నుకుంటున్న ఆదివాసీలకు 2006 నాటి అటవి హక్కుల చట్టాన్ని మార్చి పట్టాలిస్తామని, రైతుల రుణాల పింఛన్లను నెలకు 500 రూపాయల నుంచి వెయ్యి రూపాయలకు పెంచుతామని ఫెడ్నవీస్‌ హామీ ఇచ్చారు.

రైతు కూలీలకు కూడా పింఛను ఇవ్వాలి, పెద్ద నోట్ల రద్దు సందర్భంగా నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలనే డిమాండ్లను మాత్రం నాడు ఫడ్నవీస్‌ అంగీకరించలేదు. ఎంతో కాలం నుంచి దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర రైతులు పెద్ద నోట్ల రద్దు వల్ల, పశువుల వధ నిషేధ చట్టం వల్ల మరింత నష్టపోయారు. 1995 నుంచి 2015 వరకు రాష్ట్రంలో 65 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అదే కాలంలో దేశవ్యాప్తంగా మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 1995 నుంచి 2015 మధ్య కాలంలో ఎక్కువగా కాంగ్రెస్‌–ఎన్‌సీపీ సంకీర్ణ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఇప్పుడు ఫడ్నవీస్‌ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా రైతుల సంక్షేమం కోసం ఏమీ చేయలేకపోతోంది. దేశానికి వెన్నుముక రైతు అనడమేగానీ ఏ ప్రభుత్వం రైతులను పట్టించుకుంటున్న పాపాన పోవడం లేదు.

కాలం కలిసి రాక (వర్షాభావం లేదా అధిక వర్షాలు పడడం) రైతులు నష్టపోతున్నారని అంటారుగానీ అది తప్పు. దేశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్‌ ఆర్థిక విధానాల వల్ల రైతులు నష్టపోతున్నారు లేదా అభివద్ధిలోకి రాలేకపోతున్నారు. దేశవ్యాప్తంగా సమగ్ర వ్యవసాయ ఆర్థిక విధానాన్ని అమలు చేసినప్పుడే రైతులు బాగు పడతారు. ఈ అంశాన్ని అన్ని కోణాల నుంచి చర్చించేందుకు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలను కనీసం 20 రోజులైనా నిర్వహించాలి.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)