amp pages | Sakshi

‘అర్ధనగ్న చిత్రాల ప్రదర్శన సిగ్గుచేటు’

Published on Mon, 07/20/2020 - 14:52

అమృత్‌సర్‌: బ్రిటిష్ పాలకులు అమలు చేసిన పైశాచిక విధానాల చరిత్రను నేటి తరం తెలుసుకునే విధంగా జలియన్‌వాలాబాగ్‌ను అభివృద్ధి చేస్తున్నారు. అందులో భాగంగానే పునరుద్దరించిన ఫొటో గ్యాలరీ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ చిత్రాలు అజంతా ఎల్లోరా గుహలలో చిత్రీకరించిన చిత్రాల మాదిరిగానే ఉంటాయని చెబుతారు. కానీ ఫోటోగ్యాలరీలో ప్రదర్శించిన రెండు అర్ధనగ్న మహిళల చిత్రాలు ప్రస్తుతం వివాదాస్పదమవుతున్నాయి. 

ఈ విషయంపై అంతర్జాతీయ సర్వ్‌కాంబోజ్‌ సమాజ్‌ అధ్యక్షుడు బాబీ కంబోజ్‌ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర యోధులు, సిక్కు గురువుల చిత్రాలు, కలిగి ఉన్న గ్యాలరీలో సెమీ న్యూడ్ మహిళల చిత్రాన్ని అధికారులు ప్రదర్శించడం సిగ్గుచేటు. అయితే, జలియన్ వాలాబాగ్ భారతీయుల తీర్థయాత్ర కేంద్రం కంటే తక్కువ కాదు. దేశం కోసం ప్రాణాలను అర్పించిన వారికి గౌరవం ఇవ్వడానికి ప్రతిరోజూ వందలాది మంది పాఠశాల పిల్లలు, కుటుంబాలతో సహా సందర్శిస్తారు. ఇలాంటిచోట ఫొటో గ్యాలరీలో అర్ధనగ్న మహిళల చిత్రాల్ని అధికారులు ప్రదర్శించారని మాకు తెలియగానే సిగ్గుచేటుగా భావించాం’ అని ఆయన అన్నారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. షాహీద్ ఉధమ్ సింగ్ విగ్రహం ముందు టికెట్లు ఇచ్చే కిటికీ ఏర్పాటు చేయడం ద్వారా అమరవీరులను, గురువులను ట్రస్ట్ అవమానించినట్లు అంతర్జాతీయ సర్వ్ కాంబోజ్ సమాజ్.. ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. కాగా.. ప్రస్తుతం, పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న జలియన్‌ వాలాబాగ్ కాంప్లెక్స్ సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంటోంది.

ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో, జలియన్ వాలా బాగ్ వద్ద పునరుద్ధరణ పనులు ఫిబ్రవరి 15న ప్రారంభమయ్యాయి. ఈ స్మారకాన్ని సందర్శించడానికి జూలై 31 నుంచి తిరిగి ప్రజలను అనుమతించనున్నారు. కేంద్ర ప్రభుత్వం మొదటి దశలో నిర్మాణ పనులకు రూ. 20కోట్ల రూపాయలను కేటాయించింది. రాజ్యసభ ఎంపీ, జలియన్ వాలా బాగ్ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ ట్రస్టీ స్వైత్‌ మాలిక్ పునర్నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఏప్రిల్‌ 13,1919న జలియన్‌ వాలాబాగ్‌లో జనరల్‌ డయ్యర్‌ ఆదేశాల మేరకు బ్రిటీష్‌ ఇండియా సైన్యం వందల మంది భారత పౌరుల ప్రాణాలను బలితీసుకున్న సంగతి తెలిసిందే. (కరోనా వ్యాక్సిన్‌ : ఎయిమ్స్‌కు గ్రీన్‌ సిగ్నల్‌)

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌