చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్
Breaking News
ఆ సినిమాలు ప్రదర్శించకుంటే లైసెన్సులు రద్దే!
Published on Tue, 04/07/2015 - 20:35
మహారాష్ట్రలోని మల్టీప్లెక్స్ థియేటర్లలో సినిమాల ప్రదర్శనపై ఆ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. ప్రైమ్టైమ్ లో (సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు) మరాఠీ సినిమాలను తప్పనిసరిగా ప్రదర్శించాలని, లేని పక్షంలో థియేటర్ లైసెన్సులను రద్దు చేయాల్సి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆవు మాంసంపై నిషేధం విధించిన మరుసటిరోజే సినిమాల ప్రదర్శనపై దేవేంద్ర ఫడ్నవిస్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం బాలీవుడ్ను శరాఘాతానికి గురిచేసింది.
మహా ప్రభుత్వ నిర్ణయం దుష్టాంతానికి దారితీస్తుందని ప్రముఖ బాలీవుడ్ నటి దీప్తి నావెల్ అన్నారు. దర్శకుడు ముఖేశ్ భట్ స్పందిస్తూ.. 'ఇలా చేయాలని ఫడ్నవిస్ ను ఒక్కరు కూడా డిమాండ్ చేయలేదు. కొన్ని వర్గాల ఓటు బ్యాంకును ఆకర్షించేందుకే ఈ అసంబద్ధ నిర్ణయం తీసుకున్నారు' అని అసహనం వ్యక్తం చేశారు. ప్రైమ్టైమ్లో మరాఠీ సినిమాలతోపాటు భారతీయ చలనచిత్ర పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కేపై రూపొందించిన లఘు చిత్రాన్ని అన్ని థియేటర్లు విధిగా ప్రదర్శించాలని ప్రభుత్వం ఆదేశించింది.
Tags