రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఐటీసీ లాభం 10% అప్
Published on Thu, 05/17/2018 - 01:07
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ నికర లాభం 10 శాతం వృద్ధితో రూ. 2,932 కోట్లకు పెరిగింది. అంతక్రితం నాలుగో త్రైమాసికంలో లాభం రూ. 2,669 కోట్లు. సమీక్షా కాలంలో ఐటీసీ అమ్మకాలు రూ. 10,706 కోట్లు. 2016–17 క్యూ4లో ఆదాయం రూ. 14,883 కోట్లు. జీఎస్టీపరమైన మార్పుల కారణంగా ఆదాయాలను పోల్చి చూడటానికి లేదని ఐటీసీ తెలిపింది.
క్యూ4లో మొత్తం వ్యయాలు రూ. 6,996 కోట్లు. అంతక్రితం నాలుగో త్రైమాసికంలో ఇవి రూ. 11,364 కోట్లు. 2017–18 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 1 ముఖ విలువ గల షేరు ఒక్కింటికి రూ. 5.15 చొప్పున డివిడెండ్ ఇవ్వాలని సంస్థ బోర్డు సిఫార్సు చేసింది. బుధవారం బీఎస్ఈలో ఐటీసీ షేర్లు 1.47 శాతం పెరిగి రూ. 285.95 వద్ద క్లోజయ్యింది.
#
Tags