amp pages | Sakshi

జనం సొమ్ముతో పార్టీ ప్రచారం

Published on Sat, 07/28/2018 - 03:19

సాక్షి, అమరావతి: వచ్చే ఎన్నికల్లో గట్టెక్కడమే ఏకైక ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విపరీతంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ ఈ తరహాలో అధికారాన్ని స్వలాభం కోసం వాడుకోలేదు. ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన సొమ్మును చంద్రబాబు తన పార్టీ ప్రచారానికి ఖర్చు పెడుతున్నారు. రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల టీడీపీ పరిపాలనపై ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోందని జిల్లా కలెక్టర్లు నివేదిక ఇవ్వడంతో చంద్రబాబులో గుబులు మొదలైనట్లు తెలుస్తోంది.

దీంతో ప్రభుత్వ ధనాన్ని, అధికార యంత్రాంగాన్ని విచ్చలవిడిగా వాడుకుంటే తప్ప వచ్చే ఎన్నికల్లో నెగ్గలేమని ఆయన నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. కిందిస్థాయి నుంచి పైస్థాయి దాకా మొత్తం అధికార యంత్రాంగాన్ని పార్టీ ప్రచారం కోసం వినియోగించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. అంటే ప్రభుత్వ అధికారులను అచ్చంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మార్చేస్తారన్నమాట.  

ప్రచార ఆర్భాటంతో గెలిచేద్దాం..
టీడీపీ పాలనపై ప్రజల్లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నట్లు తేలడంతో చంద్రబాబు హడావుడిగా నష్టనివారణ చర్యలు మొదలుపెట్టారు. ప్రభుత్వ అధికారులను, సిబ్బందిని పార్టీ కోసం ఉపయోగించుకోవడంతోపాటు ప్రచార ఆర్భాటంతో ప్రజల్లో భ్రమలు కల్పించి, ఓట్లు కొల్లగొట్టాలని నిర్ణయానికొచ్చారు. వచ్చే ఆరు నెలలు ప్రతి జిల్లాలోనూ ఆర్భాటంగా శంకస్థాపనలు చేసి, శిలాఫలకాలు వేసి భారీగా ప్రచారం పొందాలని యోచిస్తున్నారు.

ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రతిపాదనల దశలోనే ఉన్న పరిశ్రమలకు ఆగమేఘాలపై శంకుస్థాపనలు చేసి, పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చేస్తున్నాయంటూ ప్రచార పర్వానికి తెరలేపేందుకు సన్నద్ధమవుతున్నారు. పింఛన్లు, రేషన్‌ కార్డులు...కమ్యూనిటీ సెంటర్లు... తాగునీటి పథకాలు... వచ్చే ఆరు నెలల్లో ఏ ఒక్కటీ పూర్తయ్యే అవకాశం లేకున్నా శంకుస్థాపనలతోనే సరిపెట్టి, ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించాలని చంద్రబాబు ఎత్తుగడ వేశారు.

ఓట్ల దర్శిని
గ్రామదర్శిని, నగర దర్శిని పేరుతో సర్కారు సొమ్మును తెలుగుదేశం పార్టీ ప్రచారానికి ఖర్చు చేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. గ్రామదర్శిని కింద ఆగస్టు నుంచి డిసెంబర్‌ నెలాఖరు వరకు 150 రోజులపాటు అధికార యంత్రాంగాన్ని గ్రామాల పర్యటనకు పంపాలని నిర్ణయించారు.

ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం ఆదేశించారు. టీడీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో సాధించిన ఘన కార్యాలను వివరించడంతోపాటు సర్కారుపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని వీలైనంతమేర తగ్గించడమే గ్రామదర్శిని, నగర దర్శిని అసలు ఉద్దేశం. ఈ కార్యక్రమం అమలు కోసం గ్రామ, మండల, నియోజకవర్గాల స్థాయిల్లో ప్రత్యేకంగా నోడల్‌ ఆఫీసర్లను నియమించారు.

సాధికార మిత్రల డ్యూటీ అదే..
సాధికార మిత్రలను కూడా ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. వీరికి ప్రభుత్వ సొమ్ముతో ఐదు లక్షల 4జీ స్మార్ట్‌ ఫోన్లు కొనుగోలు చేసి ఇవ్వనున్నారు. ఫోన్ల కొనుగోలుకు ఐటీ శాఖ శుక్రవారం టెండర్‌ నోటిఫికేషన్‌ సైతం జారీ చేసింది. సాధికార మిత్రలు తమ పరిధిలోని ఓటర్ల సమాచారాన్ని సమగ్రంగా సేకరించడంతోపాటు స్మార్ట్‌ ఫోన్ల ద్వారా ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేయాల్సి ఉంటుంది.

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకే ఓటు వేసేలా ఓటర్లను సన్నద్ధం చేయడమే సాధికార మిత్రల విధి. ఈ మేరకు సాధికార మిత్రలకు త్వరలో శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లను కూడా తన పార్టీ ప్రచారం కోసం ఉపయోగించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఎన్నికల దాకా వీరంతా అధికార పార్టీ కార్యకర్తలుగా పని చేయాల్సి ఉంటుంది.

ప్రచారానికి ప్రత్యేక విభాగాలు
టెంకాయ కొట్టి, ఓ శిలాఫలకం వేసిన మరుక్షణమే దానికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. త్రీడీ యానిమేషన్‌తో ప్రచార చిత్రాలను రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. ఒక్కో జిల్లాలో ఒక్కో కో–ఆర్డినేటర్‌ను ఈ పని కోసమే నియమించుకున్నారు. త్రీడీ యానిమేషన్‌ చిత్రాల కోసం ప్రత్యేకంగా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, సాఫ్ట్‌వేర్లు సిద్ధం చేస్తున్నారు.

చూడగానే అక్కడేదో అద్భుతం జరిగిపోతోందనే రీతిలో చిత్ర నిర్మాణం ఉండేలా కసరత్తు చేస్తున్నారు. ఉదాహరణకు ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేయడమే ఆలస్యం.. అక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో అది పూర్తయినట్టు, గాల్లోకి విమానాలు ఎగురుతున్నట్టు, ఆ ప్రాంతంలో భారీగా పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు వచ్చేసినట్టు భ్రాంతి కలిగించేలా త్రీడీ యానిమేషన్‌ వీడియోలను తయారు చేయనున్నారు. సోషల్‌ మీడియాలో ప్రచారానికి కూడా ప్రత్యేక బృందాలను నియమిస్తున్నారు.


ఇదే ప్రభుత్వం మళ్లీ వచ్చేలా పనిచేయాలి 
సాధికార మిత్రలకు ఎంఈవో ఉద్బోధ 
నరసరావుపేట రూరల్‌:  ప్రభుత్వాధికారులు అధికార పార్టీ నాయకుల అవతారం ఎత్తుతున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండల విద్యాశాఖాధికారి(ఎంఈవో) ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయ ప్రకటన చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

నరసరావుపేట ఎంఈవో కె.జ్యోతికిరణ్‌ శుక్రవారం మండల పరిషత్‌ కార్యాలయంలో సాధికార మిత్రల శిక్షణ శిబిరంలో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వమే మళ్లీ ఎన్నికయ్యేలా సాధికార మిత్రలు పని చేయాలని సూచించారు. తిరిగి ఈ ప్రభుత్వం ఎన్నిక కాకుంటే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు నిలిచిపోతాయన్నారు. ఎంఈవో చేసిన వ్యాఖ్యలపై సమావేశంలో పాల్గొన్న వారంతా విస్మయం వ్యక్తం చేశారు. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)