రాజధాని రైతులకు ఊరట

Published on Tue, 08/27/2019 - 18:17

సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంత రైతులకు ఊరట కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు 187.44 కోట్ల రూపాయలు విడుదల చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి రైతులకు కౌలు క్రింద ఈ మొత్తం విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. ప్రభుత్వం నిధులు విడుదల చేయడం పట్ల రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీపై రైతుల ఆగ్రహం
రాజధాని తరలిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారంపై స్థానిక రైతులు మండిపడుతున్నారు. అమరావతిపై టీడీపీ, దాని అనుకూల మీడియా వారం రోజుల నుంచి విష ప్రచారం చేస్తుండటంతో రైతులు స్పందించారు. టీడీపీ సాగిస్తున్న అసత్య ప్రచారంతో రాజధానిలో భూముల ధరలు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజధానిపై తెలుగుదేశం పార్టీ నాయకులు దాని అనుకూల మీడియా చేస్తున్న విషప్రచారం ఆపకపోతే చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం తమ దగ్గర నుంచి భూములు లాక్కుని తమకు ఏమీ చేయలేదని వాపోయారు. రాజధానిపై అంత ప్రేమ ఉంటే ఒక్క శాశ్వత కార్యాలయం కూడా ఎందుకు కట్టలేదని టీడీపీ నాయకులను సూటిగా ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు భయటపడకుండా ఉండేందుకు, ఉనికిని చాటుకునేందుకు టీడీపీ నాయకులు విష ప్రచారం చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

చంద్రబాబు, ఆయన బినామీలు ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని రైతులు ఆరోపించారు. రాజధాని ఎక్కడ పెట్టాలన్న నిర్ణయం జరగకముందే టీడీపీ నాయకులు అమరావతిలో భూములు కొన్నారని రైతులు సాక్ష్యాలు చూపించారు. చంద్రబాబు, లింగమనేని రమేశ్‌, పయ్యావుల కేశవ్‌, ధూళిపాల నరేంద్ర, జీవీ ఆంజనేయులు, వేమూరి రవికుమార్‌ ప్రసాద్‌, కొమ్మాలపాటి శ్రీధర్‌, నారాయణ బినామీలు.. కోర్‌ క్యాపిటల్‌ ఎక్కడ వస్తుందో తెలుసుకుని ముందుగానే అక్కడ భూములు కొన్నారని రైతులు పూసగుచ్చినట్టు వివరించారు. (చదవండి: ఏపీ రాజధానిపై మహాకుట్ర!)

Videos

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

Photos

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)