amp pages | Sakshi

అమ్మకోసం ఇంకెన్నాళ్లు..!

Published on Fri, 08/17/2018 - 13:18

సాక్షి, కడప : అమ్మకోసం నిరీక్షణ తప్పడం లేదు...చిన్నారులకు కొంచెం ఊహ తెలిసే సమయానికి చూడాలనుకున్నా.. తల్లి కనుచూపు మేరలో కనిపించలేదు. ఎక్కడో దేశం కాని దేశంలో.. కుటుంబ భారం మోయడానికి వెళ్లిన తల్లి సేఠ్‌ కబంధ హస్తాల్లో చిక్కుకుని బయట పడలేకపోతోంది. ఇక్కడ చూస్తే దయనీయ స్థితి... ఒక వైపు తండ్రి దూరం .. మరోవైపు నానమ్మ లేక.. అమ్మ వస్తుందో రాదో తెలియక చిన్నారులు పడుతున్న వేదన అంతా ఇంతా కాదు. ఇక్కడ చిన్నారులను చూసుకోవడం తాతయ్య (అబ్బ)కు తలకుమించిన భారంగా మారింది. ఎందుకంటే ఇన్ని రోజులు చిన్నారులతోపాటు కుటుంబానికి అన్నీ తానై చేసి పెడుతున్న నానమ్మ రామసుబ్బమ్మ జూన్‌ 13న పాముకాటుతో తనువు చాలించింది. ఇక పిల్లలతోపాటు సరిగా నడవలేక కట్టె సాయంతో నడుస్తున్న పెద్దాయన వెంకట రమణయ్య పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. ఇదంతా గాలివీడు మండలం రెడ్డివారిపల్లెకు చెందిన చిన్నారుల వ్యధాభరిత గాధ.

అమ్మ కోసం నిరీక్షణ
అమ్మకోసం దాదాపు మూడేళ్లుగా చిన్నారులు నిరీక్షిస్తూనే ఉన్నారు. తల్లి పార్వతమ్మను చూడాలని.. కలుసుకోవాలని వనజ, రెడ్డి నాగేంద్ర, శైలజ, సునీల్‌లు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు చూసిన వారు ఇప్పుడు కొంచెం ఊహ తెలిసిన పిల్లలు కావడంతో అమ్మ ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఉన్నారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు.

కుటుంబం కోసం కష్టాలు
ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి అండగా నిలవాలని చిన్నారుల తల్లి పార్వతమ్మ కువైట్‌కు వెళ్లింది. దాదాపు మూడేళ్ల క్రితం వెళ్లిన ఆమె కొద్దిరోజుల వరకు ఎలా ఉందో కూడా సమాచారం లేని పరిస్థి. ఈ నేపథ్యంలో పార్వతమ్మ అత్త రామ సుబ్బమ్మ 2017 సంవత్సరం మే నెలలో చిన్నారులతో కలిసి వచ్చి అప్పటి కలెక్టర్‌ బాబూరావునాయుడును కలిసి పార్వతమ్మ ఆచూకీ కనిపెట్టాలని వేడుకుంది. అంతేకాకుండా స్వదేశానికి పిలిపించాలని మొర పెట్టుకుంది.  దీంతో ఏజెంటు ద్వారా అక్కడి సేఠ్‌తో మాట్లాడి పార్వతమ్మతో కుటుంబ సభ్యులను మాట్లాడించారు. అయితే పార్వతమ్మ కూడా అక్కడ సంతోషంగా లేకపోగా కష్టాలను అనుభవిస్తున్నానని.. సొంతూరికి పిలిపించుకోవాలని ఫోన్‌ చేసిన ప్రతి సందర్భంలోనూ రోదిస్తున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు.

అమ్మకోసం ఏజెంటు ద్వారా ప్రయత్నం
గాలివీడు మండలం రెడ్డివారిపల్లెకు చెందిన పార్వతమ్మను స్వదేశానికి రప్పించడం కోసం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే వెంకట రమణయ్య నాయుడు పిల్లలతో కలిసి జూన్‌ రెండవ వారంలో కలెక్టరేట్‌ మీకోసంలో అప్పుడు ఇన్‌ఛార్జి జేసీగా ఉన్న రామచంద్రారెడ్డిని కలిసి గోడు వెళ్లబోసుకోవడంతో బంధం యాప్‌ ద్వారా డీఆర్‌డీఏలో నమోదు చేశారు. అలాగే జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడను కూడా కలిసి పార్వతమ్మ కువైట్‌లో కష్టాలు పడుతోందని, స్వదేశానికి రప్పించాలని వేడుకున్నారు. ఈ పరిస్థితిలో ఎస్పీ కూడా కిందిస్థాయి సిబ్బందితో మాట్లాడి పార్వతమ్మను స్వదేశానికి పిలిపించేలా ఏజెంటు ద్వారా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.   ఒక వైపు డీఆర్‌డీఏ బంధం యాప్‌ అధికారులతోపాటు మరో వైపు గాలివీడు ఎస్‌ఐ మంజునాథ్‌ కూడా సంబంధిత ఏజెంటుతో చర్చించారు. పది పదిహేను రోజుల్లోపు తల్లి పార్వతమ్మ స్వదేశానికి వచ్చే అవకాశం ఉందని ఎస్‌ఐ వెల్లడించారు. అప్పటికైనా తల్లిని చూడాలనే కన్నబిడ్డల ఆశ నెరవేరుతుందో లేదో వేచి చూద్దాం.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)